ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో జరిగిన ఎన్నికల్లో అనేక కారణాల వల్ల ఓడిపోయామని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే ఇకపై అలాంటి పరిస్థితులు రాకుండా చూస్తున్నామని అన్నారు. 2004కు ముందు కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టామని, అది రాష్ట్రానికి మంచి ఫలితాలు తీసుకువచ్చినా ప్రజలు పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పారు. దీంతో అప్పట్లో ఓటమి ఎదురైందని వివరించారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం రెండింటినీ సమానంగా ముందుకు తీసుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఈ కారణంగా ఇకపై 2004లాంటి పరిస్థితులు రాబోవని స్పష్టం చేశారు.
ఆదివారం ఆయన హైదరాబాద్లో నిర్వహించిన దక్షిణాసియా సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఏపీ నుంచి విభజన తర్వాతి ఆంధ్రప్రదేశ్ వరకు జరిగిన అభివృద్ధిని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయని, అనేక ప్రాజెక్టులను సమయపాలనతో పూర్తి చేస్తున్నామని చెప్పారు.
అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్ అన్ని రంగాల్లో ఎలా అభివృద్ధి చెందిందో, రాబోయే రోజుల్లో అమరావతి అంతకంటే మెరుగ్గా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతికతతో అమరావతిని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తున్నామని, కృత్రిమ మేధస్సును విస్తృతంగా ఉపయోగిస్తున్నామని వెల్లడించారు.
ఈ సందర్భంగా గతంలో ఐటీ కంపెనీలను ఆకర్షించడానికి తాను ఎదుర్కొన్న సవాళ్లను గుర్తుచేశారు. బిల్ గేట్స్ను కలిసినప్పుడు అనేక షరతులు ఎదురయ్యాయని, ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడం అంత సులభం కాదని అన్నారు. అయినప్పటికీ అన్ని అడ్డంకులను దాటి హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చామని చెప్పారు.
గత ఐదేళ్లలో అమరావతి పూర్తయి ఉంటే రాష్ట్రానికి ఇప్పటికే అదనపు ఆదాయం వచ్చేదని అన్నారు. అయితే వైసీపీ పాలన కారణంగా ఆలస్యం జరిగిందని విమర్శించారు. అయినప్పటికీ రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని, వచ్చే మూడు సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేసి ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు.
This post was last modified on March 22, 2026 8:49 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…