ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 18 కీలక ప్రాజెక్టులకు వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. వీటిలో అమరావతి రాజధానిలో ఏర్పాటు చేసే ప్రాజెక్టులు సహా.. ఏపీలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రాజక్టులు కూడా ఉన్నాయి.
- అమరావతి రాజధానిలో 58 వేల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
- 7 జాతీయ రహదారులకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు(ఇవి ఏపీని ఇతర రాష్ట్రాలతో అనుసంధానం చేస్తాయి)
- ఈ ప్రాజెక్టులలో జాతీయ రహదారులలోని వివిధ విభాగాల విస్తరణ, రోడ్డు ఓవర్ బ్రిడ్జి మరియు సబ్వే నిర్మాణం మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు రోడ్డు భద్రతను మరింత పెంచుతాయి. ఉపాధి అవకాశాలను సృష్టిస్తాయి.
- తిరుపతి, శ్రీకాళహస్తి, మలకొండ మరియు ఉదయగిరి కోట వంటి మతపరమైన, పర్యాటక ప్రదేశాలకు సజావుగా అనుసంధానాన్ని అందిస్తాయి.
- రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. బుగ్గనపల్లె సిమెంట్ నగర్ – పాణ్యం స్టేషన్ల మధ్య రైలు మార్గాన్ని రెట్టింపు చేయడం, రాయలసీమ – అమరావతి మధ్య కనెక్టివిటీని పెంచడం, న్యూ వెస్ట్ బ్లాక్ హట్ క్యాబిన్ – విజయవాడ స్టేషన్ల మధ్య మూడవ రైలు మార్గాన్ని నిర్మించడం ఈ ప్రాజెక్టులలో ఉన్నాయి.
- ఎలివేటెడ్ కారిడార్, హాఫ్ క్లోవర్ లీఫ్ మరియు రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు.
- అంతర్-రాష్ట్ర ప్రయాణాన్ని ఈ ప్రాజెక్టులు మెరుగుపరుస్తాయి. రద్దీని తగ్గిస్తాయి. మొత్తం లాజిస్టిక్స్ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.
- గుంతకల్ వెస్ట్ మరియు మల్లప్ప గేట్ స్టేషన్ల మధ్య రైల్ ఓవర్ రైల్ నిర్మాణం సరకు రవాణా రైళ్లను పెంచడం, గుంతకల్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గించడం లక్ష్యంగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
కేవలం రాజధానిలో..
కేవలం రాజధాని అమరావతికి సంబంధించి.. ప్రధాని శ్రీకారం చుట్టిన ప్రాజెక్టులు ఇవీ..
- శాసనసభ, హైకోర్టు, సచివాలయం, ఇతర పరిపాలనా భవనాల నిర్మాణం.
- 5,200 కుటుంబాలకు రూ.11,240 కోట్లకు పైగా విలువైన గృహ భవనాల నిర్మాణం.
- రూ.17,400 కోట్లకు పైగా విలువైన భూగర్భ యుటిలిటీల నిర్మాణం.
- అధునాతన వరద నిర్వహణ వ్యవస్థలతో కూడిన 320 కి.మీ ప్రపంచ స్థాయి రవాణా నెట్వర్క్ ఉన్న ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వరద ఉపశమన ప్రాజెక్టులు.
- ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు.
- రాజధాని నగరం అమరావతి అంతటా రూ.20,400 కోట్లకు పైగా విలువైన సెంట్రల్ మీడియన్లు, సైకిల్ ట్రాక్లు, ఇంటిగ్రేటెడ్ యుటిలిటీలతో కూడిన 1,281 కి.మీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates