
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యావ్యవస్థలో సమూల మార్పులకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలోనే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్-టీచర్స్ మీటింగ్ కార్యక్రమం మొదలైంది. ఈ క్రమంలోనే కడపలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ విద్యార్థులతో ఆప్యాయంగా మాట్లాడారు.

మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ లోని 6వ తరగతి విద్యార్థినీవిద్యార్థులతో పవన్ చిట్ చాట్ చేశారు. వారందరి పేర్లను అడిగి తెలుసుకున్న పవన్..పేరుపేరున ఆప్యాయంగా పలకరించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates