ఒక సినిమా రిలీజయ్యాక దాన్ని హిట్ అనిపించుకోవడానికి హీరోలు, నిర్మాతలు పడుతున్న అగచాట్లు అన్ని ఇన్ని కావు. అందులోనూ పెద్ద చిత్రాల మధ్య ఒక చిన్న మూవీ విడుదలైతే దాని మీద అయ్యో పాపం అని జాలిపడే వాళ్లే ఎక్కువ. మొన్న గురువారం వరకు ఇదే డిస్కషన్ నడిచింది. డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కు పోటీగా ఆయ్ ని బరిలో దించినప్పుడు నిర్మాత బన్నీ వాస్, సమర్పకులు అల్లు అరవింద్ మరీ ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారనే అధిక శాతం అనుకున్నారు. అయినా సరే భయపడకుండా రిలీజ్ చేశారు. ఆగస్ట్ 15 సాయంత్రం నుంచి ప్రీమియర్లు వేసి తమ ధైర్యం ఏంటో చాటారు.
ఊహించని విధంగా ఆయ్ సూపర్ హిట్ కొట్టేసింది. మొదటి రోజు కేవలం అరవై లక్షల గ్రాస్ వస్తే నాలుగో రోజు రెండు కోట్ల ఇరవై లక్షలు వసూలు చేసింది. అది కూడా పరిమిత స్క్రీన్లు, షోలతో. దీన్ని బట్టే ఏ స్థాయి విజయమో అర్థం చేసుకోవచ్చు. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షో యాప్ ద్వారా ఆయ్ 32 వేల టికెట్లు అమ్మితే, మిస్టర్ బచ్చన్ 11 వేలు, డబుల్ ఇస్మార్ట్ 16 వేల టికెట్లకే పరిమితమయ్యాయి. వాటికైన బడ్జెట్ లో కనీసం పావు వంతు కూడా ఆయ్ కు ఖర్చయ్యిండదు. అయినా సరే ఆడియన్స్ కంటెంట్ కే పట్టంకట్టి ఆయ్ థియేటర్లకు కదిలి వెళ్లారు.
నిన్న ఆదివారం కావడంతో కొన్ని కీలక కేంద్రాల్లో రవితేజ, రామ్ కు కేటాయించిన మెయిన్ స్క్రీన్లను ఆయ్ కు మార్చడం అనూహ్యం. కొత్త కథేమీ లేకపోయినా కామెడీతో కడుపుబ్బా నవ్వించి, చివర్లో ఎమోషన్ తో కూడిన ఎలివేషన్ తో ఫుల్ టైం పాస్ చేయించిన దర్శకుడు అంజి కె మణిపుత్ర మంచి మార్కులు తెచ్చేసుకున్నాడు. హీరో నితిన్ నార్నెతో పాటు కమెడియన్లు కసిరెడ్డి, అంకిత్ కొయ్యని తమ బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చడంతో ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ దూసుకెళ్తోంది. అంతకు ముందు వచ్చిన కమిటీ కుర్రోళ్ళు సైతం ఇదే తరహాలో విజయం సాధించడం మరో చక్కని పరిణామం.
This post was last modified on August 19, 2024 9:29 pm
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…