అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల్లో ఒక వర్గానికి చాన్నాళ్లుగా అస్సలు నచ్చట్లేదు. ఒకప్పుడు మెగా అభిమానులందరూ బన్నీని అభిమానించేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్లో బన్నీ ఫ్యాన్స్ వేరైపోయారు. ‘సరైనోడు’ ఈవెంట్లో బన్నీ ‘చెప్పను బ్రదర్’ కామెంట్ నుంచి మొదలుపెడితే.. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం చేయడం వరకు అనేక పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. మెగా అభిమానులంతా కలిసే ఉండాలని కోరుకునేవారికి ఈ అగాథాన్ని ఎలా పూడ్చాలో అర్థం కావడం లేదు. ఇందుకు బన్నీనే పూనుకోవాలని.. తన తీరు మార్చుకోవాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ సంకేతాలు మాత్రం కనిపించడం లేదు.
తాజాగా బన్నీ జాతీయ అవార్డు విజేతలకు విషెస్ చెప్పిన తీరు మళ్లీ వివాదాస్పదం అయింది. దీని మీద అతణ్ని వ్యతిరేకించే మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ ఉత్తమ నటులుగా ఎంపికైన రిషబ్ శెట్టి, నిత్యా మీనన్లతో పాటు తెలుగు నుంచి ‘కార్తికేయ-2’ ఉత్తమ చిత్రంగా నిలిచిన నేపథ్యంలో ఆ చిత్ర బృందానికి బన్నీ విషెస్ చెప్పాడు. అంతే కాక పలు అవార్డులు గెలుచుకున్న మలయాళ చిత్రం ‘ఆట్టం’ బృందాన్నీ అభినందించాడు. కానీ టాలీవుడ్ నుంచి మేటి డ్యాన్స్ మాస్టర్గా ఎదిగి.. ‘తిరు చిత్రాంబళం’ చిత్రానికి ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు సాధించిన జానీ మాస్టర్ను మాత్రం బన్నీ అభినందించలేదు.
జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు. అతను ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం కూడా పని చేశాడు. ఈ నేపథ్యంలోనే జానీని బన్నీ పట్టించుకోలేదని.. ఉద్దేశపూర్వకంగానే అతడికి శుభాకాంక్షలు చెప్పలేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. బన్నీ యాదృచ్ఛికంగానే జానీ మాస్టర్ పేరు మరిచిపోయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడున్న సున్నితమైన పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్కు ఇది కూడా పెద్ద తప్పుగా కనిపిస్తోంది. బన్నీ తీరు మారదా అంటూ దీని మీద నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on August 20, 2024 9:41 am
మనకు జీవితంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో అందరికీ తెలిసిందే. కానీ కొన్ని చిన్న అలవాట్లను మనం నిర్లక్ష్యం చేస్తుంటాము.…
నందమూరి బాలకృష్ణ తన ప్రతి పుట్టిన రోజుకూ అభిమానులకు సినిమాల పరంగా కానుక ఇస్తుంటాడు. అప్పటికి నటిస్తున్న సినిమా నుంచి…
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…