అల్లు అర్జున్ అంటే మెగా అభిమానుల్లో ఒక వర్గానికి చాన్నాళ్లుగా అస్సలు నచ్చట్లేదు. ఒకప్పుడు మెగా అభిమానులందరూ బన్నీని అభిమానించేవాళ్లు. కానీ కొన్నేళ్ల నుంచి మెగా ఫ్యాన్స్లో బన్నీ ఫ్యాన్స్ వేరైపోయారు. ‘సరైనోడు’ ఈవెంట్లో బన్నీ ‘చెప్పను బ్రదర్’ కామెంట్ నుంచి మొదలుపెడితే.. ఇటీవల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అయిన శిల్పా రవికి ప్రచారం చేయడం వరకు అనేక పరిణామాలు ఇందుకు కారణమయ్యాయి. మెగా అభిమానులంతా కలిసే ఉండాలని కోరుకునేవారికి ఈ అగాథాన్ని ఎలా పూడ్చాలో అర్థం కావడం లేదు. ఇందుకు బన్నీనే పూనుకోవాలని.. తన తీరు మార్చుకోవాలనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కానీ ఆ సంకేతాలు మాత్రం కనిపించడం లేదు.
తాజాగా బన్నీ జాతీయ అవార్డు విజేతలకు విషెస్ చెప్పిన తీరు మళ్లీ వివాదాస్పదం అయింది. దీని మీద అతణ్ని వ్యతిరేకించే మెగా అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
జాతీయ ఉత్తమ నటులుగా ఎంపికైన రిషబ్ శెట్టి, నిత్యా మీనన్లతో పాటు తెలుగు నుంచి ‘కార్తికేయ-2’ ఉత్తమ చిత్రంగా నిలిచిన నేపథ్యంలో ఆ చిత్ర బృందానికి బన్నీ విషెస్ చెప్పాడు. అంతే కాక పలు అవార్డులు గెలుచుకున్న మలయాళ చిత్రం ‘ఆట్టం’ బృందాన్నీ అభినందించాడు. కానీ టాలీవుడ్ నుంచి మేటి డ్యాన్స్ మాస్టర్గా ఎదిగి.. ‘తిరు చిత్రాంబళం’ చిత్రానికి ఉత్తమ జాతీయ నృత్య దర్శకుడిగా అవార్డు సాధించిన జానీ మాస్టర్ను మాత్రం బన్నీ అభినందించలేదు.
జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కు అత్యంత సన్నిహితుడు. అతను ఇటీవలి ఎన్నికల్లో జనసేన పార్టీ కోసం కూడా పని చేశాడు. ఈ నేపథ్యంలోనే జానీని బన్నీ పట్టించుకోలేదని.. ఉద్దేశపూర్వకంగానే అతడికి శుభాకాంక్షలు చెప్పలేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు. బన్నీ యాదృచ్ఛికంగానే జానీ మాస్టర్ పేరు మరిచిపోయి ఉండొచ్చు కానీ.. ఇప్పుడున్న సున్నితమైన పరిస్థితుల్లో మెగా ఫ్యాన్స్కు ఇది కూడా పెద్ద తప్పుగా కనిపిస్తోంది. బన్నీ తీరు మారదా అంటూ దీని మీద నెగెటివ్ పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on August 20, 2024 9:41 am
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…