నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి తన మూలాలు మరవని నేత. కళాకారులకు ఆయనో వరం. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో కళాకారులకు ఇచ్చిన హామిని నిలబెట్టుకొని పేద కళా కారుల కంటి దీపంలా నిలిచారు.
15 మందికి ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేపాక్షి సంస్థ సంయుక్తంగా ఈ ఏడాది జులై 7 వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్త కళా మహోత్సవం -2026 నిర్వహించారు. వేడుకలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో కళా కారులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొండపల్లి, నరసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.
పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 143 మంది లేస్, నేత కళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 15 మందికి కేటారాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. త్వరలోనే వీరికి ఆపరేషన్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 110 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందజేయనున్నట్లు చెప్పారు.
పవన్ కళ్యాణ్ సేవలకు సలాం…
ఏదైనా వేడుకలు, ప్రారంభోత్సవాలకు వచ్చినప్పుడు ప్రజా ప్రతినిధులు రకరకాల హామీలు ఇవ్వడం సహజం. హస్త కళా మహోత్సవానికి వచ్చిన డీసీఎం పవన్ కళ్యాణ్ కూడా అలాగే హామీలు ఇస్తున్నట్లు అక్కడికి వచ్చిన కళాకారులు భావించారు. వారం తిరగక ముందే కళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, కేటారక్ట్ ఆపరేషసన్లకు సిద్ధం చేయడం కళాకారులకు విస్మయం కలిగిస్తుంది. ఇలాంటి నాయకుడు వుంటే ప్రజలకు భరోసా ఉంటుందని నేత కళాకారులు చెప్పుకుంటున్నారు.
This post was last modified on August 1, 2026 6:01 am
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…
సీఎం రేవంత్ రెడ్డిపై, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన…
నందమూరి అభిమానుల ఎదురు చూపులను రెన్యూవల్ చేయడమే తప్ప ఎంట్రీ ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా దోబూచులాడుతున్న మోక్షజ్ఞ మరోసారి వార్తల్లోకి…