కేజీఎఫ్ అనే ఒకే ఒక్క సినిమాతో కోట్లాది మంది మనసులు దోచి.. ఇండియాలో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయిపోయాడు ప్రశాంత్ నీల్. ఇది రెండు భాగాలుగా విడుదలైనప్పటికీ.. కథగా చూసుకుంటే ఒక్కటే. దీని కంటే ముందు కన్నడలో ‘ఉగ్రం’ అనే సినిమాతో హిట్ కొట్టాడు కానీ.. కర్ణాటకను దాటి ఎక్కడా దాని గురించి తెలియదు. ఐతే ‘కేజీఎఫ్’ సినిమాలో ఎలివేషన్ సీన్లు, యాక్షన్ ఘట్టాలను అతను ప్రెజెంట్ చేసిన విధానం.. ఈ సినిమా సాధించిన అసాధారణ విజయం చూసి తనతో పని చేయడానికి ఇండియాలోని టాప్ స్టార్లు పోటీ పడ్డారు. వారిలో ముందుగా ప్రభాస్.. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్లతో సినిమాలు ఓకే చేశాడు ప్రశాంత్.
‘కేజీఎఫ్’ను చూసి ప్రశాంత్ మీద ఒక అంచనాకు రాలేమని.. ప్రభాస్తో చేస్తున్న ‘సలార్’ రిలీజైతే కానీ ప్రశాంత్ అసలు సత్తా ఏంటో తెలియదని అంటున్న వారూ లేకపోలేదు. కానీ ఇండస్ట్రీ జనాలు మాత్రం ప్రశాంత్ మీద చాలా నమ్మకంతో ఉన్నారు.
ప్రశాంత్ ఎప్పుడు ఖాళీ అవుతాడో తెలియకున్నా అతడికి అడ్వాన్స్ ఇచ్చి ఒక సినిమాకు కమిట్మెంట్ తీసేసుకున్నాడు టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాలోనూ ప్రభాసే హీరో కావడం విశేషం. తాజాగా ‘శాకుంతలం’ ప్రమోషన్ల కోసం మీడియాను కలిసి దిల్ రాజు.. ప్రశాంత్-ప్రభాస్ సినిమా గురించి ఓపెన్ అయ్యాడు. ఎన్టీఆర్ సినిమా అయ్యాక ప్రశాంత్ చేసే చిత్రం ఇదే అని.. ఈ సినిమాకు కథ కూడా రెడీ అయిందని రాజు వెల్లడించడం విశేషం. ఇంత వరకు బాగానే ఉంది కానీ.. ప్రభాస్తో ప్రశాంత్ తీయబోయేది పౌరాణిక చిత్రం అని రాజు వెల్లడించడమే ఆశ్చర్యం కలిగించే విషయం.
‘బాహుబలి’లో రాజు పాత్రలో అదరగొట్టిన ప్రభాస్ను పౌరాణిక చిత్రంలో చూడటంలో ఏ ఇబ్బందీ లేదు. కానీ ఉగ్రం, కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ప్రశాంత్ శైలి మీద ఒక అంచనాకు వచ్చేశారు ప్రేక్షకులు. అతడి సినిమాలన్నీ ఒక తరహాలో కనిపిస్తున్నాయి. ఇలాంటి దర్శకుడు పౌరాణిక చిత్రాన్ని డీల్ చేయగలడా అన్న సందేహాలు కలుగుతున్నాయి. అతను ఇప్పుడు తీస్తున్న సినిమాలను బట్టి చూస్తే మాత్రం పౌరాణికం సూటవుతుందని అస్సలు అనిపించడం లేదు. ఈ తరంలో రాజమౌళి మినహా ఎవరూ అలాంటి సినిమా తీయలేరనే అభిప్రాయం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. మరి రాజు చేయబోతున్న రిస్క్ ఏమాత్రం వర్కవుటవుతుందో చూడాలి.
This post was last modified on April 12, 2023 10:04 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…