ఒక కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ట్రెండు ఇండియన్ సినిమాలో గట్టిగానే నడుస్తోందిప్పుడు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో బాహుబలి కథ రెండు భాగాలకే ముగిసినా.. ఇంకో పార్ట్ గురించి పెద్ద చర్చ నడిచింది. కానీ ప్రస్తుతానికి అలాంటి సంకేతాలేమీ లేవు. కేజీఎఫ్ కథ రెండు భాగాలతో ముగిసినట్లు కనిపించినా.. మూడో చాప్టర్ గురించి కూడా సంకేతాలు వచ్చాయి. భవిష్యత్తులో మూడో భాగం వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
ఇప్పుడు రెండో భాగంతో ముస్తాబవుతున్న పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి పుష్ప యూనిట్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం.. ఆ ప్రచారం కొంచెం బయటికి కూడా రావడం గమనార్హం.
పుష్పను ఒక సినిమాగా తీయాలని మొదలుపెట్టి.. మధ్యలో ఆ కథను విస్తరించి రెండు భాగాలు చేశాడు సుకుమార్. ఇప్పుడు సెకండ్ పార్ట్ చిత్రీకరణ మధ్యలో ఉండగా.. ఆయనకు మూడో భాగం మీద మనసు మళ్లినట్లు చెబుతున్నారు. పుష్ప పాత్ర జనాలకు విపరీతంగా ఎక్కేసిన నేపథ్యంలో ఆ పాత్రను రెండో భాగంతో వదిలేయకూడదని.. కథను మరి కాస్త పొడిగించి భవిష్యత్తులో మూడో భాగం కూడా తీయాలనే చర్చ సుకుమార్ అండ్ టీంలో నడుస్తున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తోంది.
పుష్ప-2లో అయితే మూడో పార్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చి వదులుతారని.. భవిష్యత్తులో కుదిరితే మూడో భాగం తీస్తారని అంటున్నారు. ఈ ప్రచారం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
This post was last modified on April 13, 2023 10:30 am
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…