ఒక కథను రెండు మూడు భాగాలుగా చెప్పే ట్రెండు ఇండియన్ సినిమాలో గట్టిగానే నడుస్తోందిప్పుడు. బాహుబలి, కేజీఎఫ్, పుష్ప.. ఇలా ఈ వరుసలో చాలా సినిమాలే ఉన్నాయి. ఇందులో బాహుబలి కథ రెండు భాగాలకే ముగిసినా.. ఇంకో పార్ట్ గురించి పెద్ద చర్చ నడిచింది. కానీ ప్రస్తుతానికి అలాంటి సంకేతాలేమీ లేవు. కేజీఎఫ్ కథ రెండు భాగాలతో ముగిసినట్లు కనిపించినా.. మూడో చాప్టర్ గురించి కూడా సంకేతాలు వచ్చాయి. భవిష్యత్తులో మూడో భాగం వచ్చే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
ఇప్పుడు రెండో భాగంతో ముస్తాబవుతున్న పుష్ప సినిమాకు మూడో భాగం ఉంటుందనే ప్రచారం ఆసక్తి రేకెత్తిస్తోంది. దీని గురించి పుష్ప యూనిట్ వర్గాల్లో చర్చ జరుగుతుండటం.. ఆ ప్రచారం కొంచెం బయటికి కూడా రావడం గమనార్హం.
పుష్పను ఒక సినిమాగా తీయాలని మొదలుపెట్టి.. మధ్యలో ఆ కథను విస్తరించి రెండు భాగాలు చేశాడు సుకుమార్. ఇప్పుడు సెకండ్ పార్ట్ చిత్రీకరణ మధ్యలో ఉండగా.. ఆయనకు మూడో భాగం మీద మనసు మళ్లినట్లు చెబుతున్నారు. పుష్ప పాత్ర జనాలకు విపరీతంగా ఎక్కేసిన నేపథ్యంలో ఆ పాత్రను రెండో భాగంతో వదిలేయకూడదని.. కథను మరి కాస్త పొడిగించి భవిష్యత్తులో మూడో భాగం కూడా తీయాలనే చర్చ సుకుమార్ అండ్ టీంలో నడుస్తున్నట్లుగా ఒక ప్రచారం నడుస్తోంది.
పుష్ప-2లో అయితే మూడో పార్ట్ గురించి చిన్న హింట్ ఇచ్చి వదులుతారని.. భవిష్యత్తులో కుదిరితే మూడో భాగం తీస్తారని అంటున్నారు. ఈ ప్రచారం ఎంత వరకు నిజమవుతుందో చూడాలి.
అవినీతికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. తెలంగాణలో అవినీతి మరింతగా రాజ్యమేలుతోందని చెప్పక తప్పదు. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న ఘటనలే…
మాజీ సీఎం జగన్ మీడియా ముందుకు వస్తే చాలు…ఆయన నోటి నుంచి ఏం ఆణిముత్యాలు రాలుతాయో అని టీడీపీ, జనసేనకు…
పాము పగబట్టడం విన్నాం... మనిషిపై మరో మనిషి పగబట్టడడమూ చూశాం. కానీ ఓ ఏనుగు పగబట్టడం... అది కూడా ఏళ్ల…
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…