మూడేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియానికి ఐపీఎల్ సందడి తిరిగి రావడంతో హైదరాబాద్ క్రికెట్ అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సీజన్లో తొమ్మిది మ్యాచ్లను ఉప్పల్ స్టేడియంలో ఆడుతోంది సన్రైజర్స్ హైదరాబాద్. ఐతే ఉప్పల్ స్టేడియంలో గతంతో పోలిస్తే అంతర్జాతీయ మ్యాచ్లు తగ్గిపోవడం ఇక్కడి అభిమానులకు కొంత నిరాశ కలిగించే విషయమే. కానీ ఈ ఏడాది చివర్లో జరిగే ప్రతిష్టాత్మక వన్డే ప్రపంచకప్ వేదికల్లో ఒకటిగా ఉప్పల్ స్టేడియం ఉండటం అభిమానులకు ఆనందాన్నిచ్చే విషయమే.
అంతకుమించిన ఆనందం ఏంటంటే.. ఆ టోర్నీ జరిగే సమయానికి ఉప్పల్ స్టేడియం కొత్త రూపు సంతరించుకోనుంది. ఈ టోర్నీ బీసీసీఐ దేశంలోని ఐదు క్రికెట్ స్టేడియాల్నిపునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. ఈ మేరకు రూ.500 కోట్ల నిధులు కూడా కేటాయించింది. ఈ ఐదు స్టేడియాల్లో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం కూడా ఉండటం విశేషం.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం రెనోవేషన్ కోసం రూ.100 కోట్లు కేటాయించిన బీసీసీఐ.. ఉప్పల్ స్టేడియం కోసం రూ.117.17 కోట్లు, కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం కోసం రూ.127.47 కోట్లు, మొహాలిలోని పీసీఏ స్టేడియం కోసం రూ.79.46 కోట్లు, ముంబయిలోని వాంఖడే స్టేడియం కోసం రూ.78.82 కోట్లు కేటాయించింది. ఒకేసారి రూ.117 కోట్లతో పునరుద్ధరణ పనులు అంటే.. ఉప్పల్ స్టేడియం రూపు రేఖలు మారిపోవడం ఖాయం.
స్టేడియంలో సగం స్టాండ్స్కే పైకప్పులు ఉన్నాయి. ప్రపంచకప్ సమయానికి మొత్తం స్టేడియం అంతా పైకప్పులు రావడం పక్కా. అంతే కాక స్టేడియంలో సీటింగ్, ఇతర వసతులను కూడా మెరుగుపరచనున్నారు. మొత్తం పని అయ్యాక దేశంలోనే అత్యుత్తమ స్టేడియాల్లో ఒకటిగా ఉప్పల్ మైదానంలో మారడం ఖాయం. కాకపోతే అవినీతికి పేరుపడ్డ హెచ్సీఏలో ఈ నిధులను ఎక్కడ పక్కదారి పట్టిస్తారో అన్న సందేహాలు అభిమానుల్లో కలుగుతున్నాయి.
This post was last modified on April 12, 2023 10:09 pm
వైసిపి అధినేత జగన్ ప్రకటించిన `ప్లాన్ బి` పెద్దగా వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. రాష్ట్ర రాజధాని విషయంలో ప్రజలు…
నిజమేనండోయ్... భానుడి భగభగలు అప్పుడే మొదలైపోయాయి. మార్చి మాసంలో అప్పుడప్పుడు చిరు జల్లులతో పెద్దగా ఎండ ప్రభావం అయితే పెద్దగా…
చేసినవి తక్కువ సినిమాలే అయినా దర్శకుడిగా మంచి గుర్తింపే ఉంది చందూ మొండేటికి. తొలి చిత్రం ‘కార్తికేయ’తోనే అతను బలమైన…
వైసీపీ అధినేత జగన్ కు ఆయన సోదరి వైఎస్ షర్మిల కంటిలో నలుసులా మారిన సంగతి తెలిసిందే. ఏపీ కాంగ్రెస్…
వైసీపీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వెక్కివెక్కి ఏడ్చారు.…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.…