ఈ ఉదయం ‘పుష్ప’ టీం పెద్ద షాకే ఇచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్ల కలయికలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘పుష్ప’ షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. సుకుమార్ ఓ సినిమాను ఎలా చెక్కుతాడో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ చిత్రం ఇంత త్వరగా విడుదలవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఈ ఏడాది ఆ చిత్రం విడుదల కాదని అనుకున్న వాళ్లూ ఉన్నారు. కొంచెం వేగం చూపించినా దసరా సమయానికి కానీ సినిమా రెడీ కాదని అనుకుంటున్నారు. అలాంటిది ఆగస్టు 13కే రిలీజ్ అనేసరికి నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పుడు డేట్ ఇచ్చినా.. దాన్ని అందుకుంటారన్న గ్యారెంటీ లేదు అని అభిప్రాయపడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఐతే హీరో అల్లు అర్జున్, నిర్మాతల ఒత్తిడికి సుకుమార్ తలొగ్గక తప్పలేదన్నది ఇన్ సైడ్ టాక్.
సుకుమార్ ఇంతకుముందు ఏ సినిమాలకూ లేని స్థాయిలో ‘పుష్ప’ను వేగం చూపిస్తున్నాడట. రోజువారీ తీసే సన్నివేశాల సంఖ్య, ఫుటేజ్ పెరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. ఈలోపు ప్రి ప్రొడక్షన్ దశలోనే కోట్లు ఖర్చయిపోయాయి. లాక్ డౌన్ టైంలో పని లేకున్నా టీం అంతటికీ జీతాలివ్వాల్సి వచ్చింది. షూటింగ్ కూడా నెమ్మదిగా చేస్తే ఖర్చు బాగా ఎక్కువైపోతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ‘అల వైకుంఠపురములో’కు ముందు చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీకి.. ఆ సినిమా తర్వాత కూడా చాలానే విరామం వచ్చింది. దీని వల్ల తనకెంతో నష్టం జరుగుతోందని అర్థం చేసుకున్న బన్నీ.. ‘పుష్ప’ మేకింగ్ ఆలస్యం కాకూడదని గట్టిగా ఫిక్సయ్యాడట. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసి మే కల్లా ఖాళీ అయిపోతుండటంతో సాధ్యమైనంత త్వరగా ఆయనతో తాను చేయాల్సిన సినిమాను మొదలుపెట్టాలని.. ఆయనకు కూడా ‘ఆచార్య’కు ముందు చాలా విరామం వచ్చిన నేపథ్యంలో తన కోసం వెయిట్ చేయించొద్దని బన్నీ నిర్ణయించుకున్నాడట. అందుకే నిర్మాతలతో కలిసి సుక్కు మీద ఒత్తిడి తెచ్చి తన వైపు నుంచి ఎంత టైమ్ ఇవ్వడానికైనా, ఎంత కష్టపడటానికైనా సిద్ధమని చెప్పి సినిమాను ఆగస్టు 13నే విడుదల చేసేలా ప్లాన్ చేయించి, ప్రకటన చేయించినట్లు సమాచారం. డేట్ ఇచ్చేయడంతో ఇక సుక్కు ఆలస్యం చేయకుండా జూన్ నెలాఖరుకల్లా షూటింగ్ ముగించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది.
This post was last modified on January 28, 2021 2:15 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…