Political News

బీజేపీ రథయాత్రపై ‘పంచాయితి’ ఎఫెక్ట్

బీజేపీ నిర్వహించాలని అనుకున్న రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల ధ్వంసం తదితర కారణాలతో బీజేపీ రథయాత్ర చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్రకు రూటుమ్యాపు కూడా రెడీ చేసుకున్నది. యాత్ర కోసం పోలీసులను అనుమతి కూడా కోరారు.

అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవటంతో రథయాత్రకు బ్రేకులుపడ్డాయి. సుప్రింకోర్టు తీర్పు వల్ల పంచాయితి ఎన్నికలను ఆటంకాలు తొలగిపోవటంతో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజైపోయింది. పైగా ఏకగ్రీవాలు జరక్కుండా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయటంతో దాదాపు అన్నీ పంచాయితిల్లోను ఎన్నికలు అనివార్యమయ్యేట్లుంది.

ఈ నేపధ్యంలోనే బీజేపీ+జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో నామినేషన్లపై దృష్టిపెట్టాయి. మొదటిదశలో ఎన్నికలు జరగబోయే ప్రతి పంచాయితిలోను మిత్రపక్షాల తరపున నామినేషన్ల వేయించాలని ఇఫ్పటికే డిసైడ్ చేశాయి. అందుకనే ఎన్నికల్లో పోటీ చేయటానికి ప్రాధాన్యత ఇచ్చి రథయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.

ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్ర ప్రారంభమైతే రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట గొడవలు జరగటం ఖాయమనే అందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ మతపరమైన రాజకీయాల జోరు పెంచింది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి హిందుమతానికి వ్యతిరేకమనే నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ నినాదం కారణంగా గొడవలు జరుగుతాయని అనుకున్నారు. అయితే పంచాయితి ఎన్నికల కారణంగా రథయాత్ర వాయిదా పడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

This post was last modified on January 28, 2021 11:25 am

Share

Recent Posts

బుల్లితెర కాలక్షేపానికి ఢోకా లేదు

ఈ వారం థియేటర్లో కొత్త రిలీజులు అరడజను పైనే ఉన్నాయి. స్ట్రెయిట్, డబ్బింగ్ అన్నీ కలిపి వాటి వాటి స్థాయిలో…

32 minutes ago

రాకా గురించి సడెన్ డిస్కషన్లేంటి?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కొత్త చిత్రం ‘రాకా’ను అభిమానులు కోరుకున్నట్లుగా ప్రమోట్ చేయట్లేదనే కంప్లైంట్ ఉంది. ఈ…

2 hours ago

ఈవెంట్లకే రాని నయన్ థియేటర్ విజిట్ చేసిందా?

సౌత్ ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ ఇమేజ్ సంపాదించిన అతి కొద్ది మంది కథానాయికల్లో నయనతార ఒకరు. ఒక వైపు…

2 hours ago

నేపాల్ వరదల్లో చిక్కుకొని… 9 రోజుల తర్వాత బయటకు…

నేపాల్ వరదలు సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వేలాది మంది పౌరులు, పాఠశాల విద్యార్థులు గల్లంతయ్యారు. రోజులు గడుస్తున్నా…

3 hours ago

దమ్ముంటే పరకాలలో పోటీచేయాలి – సుస్మిత సవాల్

కొండా సురేఖ వివాదం కాంగ్రెస్ పార్టీని ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. కొండా సురేఖ బర్తరఫ్ తర్వాత ఆమె కూతురు…

3 hours ago

తాప్సి ఎంత కొత్తగా ట్రై చేసినా

ఝుమ్మంది నాదం, మిస్టర్ పర్ఫెక్ట్, దరువు లాంటి సినిమాలతో తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న తాప్సి కొన్నేళ్లుగా పూర్తిగా బాలీవుడ్ కే…

5 hours ago