Political News

బీజేపీ రథయాత్రపై ‘పంచాయితి’ ఎఫెక్ట్

బీజేపీ నిర్వహించాలని అనుకున్న రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల ధ్వంసం తదితర కారణాలతో బీజేపీ రథయాత్ర చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్రకు రూటుమ్యాపు కూడా రెడీ చేసుకున్నది. యాత్ర కోసం పోలీసులను అనుమతి కూడా కోరారు.

అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవటంతో రథయాత్రకు బ్రేకులుపడ్డాయి. సుప్రింకోర్టు తీర్పు వల్ల పంచాయితి ఎన్నికలను ఆటంకాలు తొలగిపోవటంతో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజైపోయింది. పైగా ఏకగ్రీవాలు జరక్కుండా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయటంతో దాదాపు అన్నీ పంచాయితిల్లోను ఎన్నికలు అనివార్యమయ్యేట్లుంది.

ఈ నేపధ్యంలోనే బీజేపీ+జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో నామినేషన్లపై దృష్టిపెట్టాయి. మొదటిదశలో ఎన్నికలు జరగబోయే ప్రతి పంచాయితిలోను మిత్రపక్షాల తరపున నామినేషన్ల వేయించాలని ఇఫ్పటికే డిసైడ్ చేశాయి. అందుకనే ఎన్నికల్లో పోటీ చేయటానికి ప్రాధాన్యత ఇచ్చి రథయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.

ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్ర ప్రారంభమైతే రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట గొడవలు జరగటం ఖాయమనే అందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ మతపరమైన రాజకీయాల జోరు పెంచింది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి హిందుమతానికి వ్యతిరేకమనే నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ నినాదం కారణంగా గొడవలు జరుగుతాయని అనుకున్నారు. అయితే పంచాయితి ఎన్నికల కారణంగా రథయాత్ర వాయిదా పడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

This post was last modified on January 28, 2021 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

క్వాలిటీ క్యాస్టింగ్ – పూరి జగన్నాథ్ ప్లానింగ్

మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…

58 minutes ago

ఇంజెక్షన్‌ల భయానికి చెక్ పెట్టిన కొత్త టెక్నాలజీ

ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…

2 hours ago

ఏపీలో ఎన్నిక‌.. షెడ్యూల్ విడుద‌ల‌!

ఏపీలో కీల‌క‌మైన ఓ రాజ్య‌స‌భ సీటు ఎన్నిక‌కు సంబంధించి కేంద్ర ఎన్నిక‌ల సంఘం తాజాగా షెడ్యూల్ ప్ర‌క‌టించింది. వైసీపీ నుంచి…

2 hours ago

ప్రేమకథతో తిరిగి వస్తున్న బుట్టబొమ్మ

డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…

2 hours ago

వరుసగా ఏఐ మేధావుల మరణాలు.. ఏం జరుగుతోంది?

చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…

3 hours ago

పెద్ది గురించి శివన్న….హైప్ పెంచేశాడన్నా

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది విడుదలకు ఇంకా ఏడాది సమయం ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే ట్రెండింగ్…

3 hours ago