Political News

బీజేపీ రథయాత్రపై ‘పంచాయితి’ ఎఫెక్ట్

బీజేపీ నిర్వహించాలని అనుకున్న రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల ధ్వంసం తదితర కారణాలతో బీజేపీ రథయాత్ర చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్రకు రూటుమ్యాపు కూడా రెడీ చేసుకున్నది. యాత్ర కోసం పోలీసులను అనుమతి కూడా కోరారు.

అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవటంతో రథయాత్రకు బ్రేకులుపడ్డాయి. సుప్రింకోర్టు తీర్పు వల్ల పంచాయితి ఎన్నికలను ఆటంకాలు తొలగిపోవటంతో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజైపోయింది. పైగా ఏకగ్రీవాలు జరక్కుండా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయటంతో దాదాపు అన్నీ పంచాయితిల్లోను ఎన్నికలు అనివార్యమయ్యేట్లుంది.

ఈ నేపధ్యంలోనే బీజేపీ+జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో నామినేషన్లపై దృష్టిపెట్టాయి. మొదటిదశలో ఎన్నికలు జరగబోయే ప్రతి పంచాయితిలోను మిత్రపక్షాల తరపున నామినేషన్ల వేయించాలని ఇఫ్పటికే డిసైడ్ చేశాయి. అందుకనే ఎన్నికల్లో పోటీ చేయటానికి ప్రాధాన్యత ఇచ్చి రథయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.

ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్ర ప్రారంభమైతే రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట గొడవలు జరగటం ఖాయమనే అందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ మతపరమైన రాజకీయాల జోరు పెంచింది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి హిందుమతానికి వ్యతిరేకమనే నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ నినాదం కారణంగా గొడవలు జరుగుతాయని అనుకున్నారు. అయితే పంచాయితి ఎన్నికల కారణంగా రథయాత్ర వాయిదా పడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

This post was last modified on January 28, 2021 11:25 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

బీజేపీలో పార్టీ కార్యాలయంలో మల్లారెడ్డి కోడలు

టీడీపీతో రాజకీయం మొదలుపెట్టి...ఆపై బీఆర్ఎస్ లో చేరి సక్సెస్ ఫుల్ రాజకీయవేత్తగా ఎదిగిన మాజీ మంత్రి మల్లారెడ్డి త్వరలోనే మరోమారు పార్టీ…

37 minutes ago

అనంతబాబు అరెస్టు… తర్వాతేంటి?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి…

1 hour ago

సింగపూర్ క్లాసులు.. ఇక్కడ పాలన

రాష్ట్రానికి చెందిన పలువురు మంత్రులు సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పర్యటన శుక్రవారం తో ముగియ‌నుంది. మూడు రోజుల పర్యటనలో…

1 hour ago

రజనీ షారుఖ్.. రీవేంజ్ కాదు కానీ…

సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబినేషన్లు సెట్స్ పైకి వెళ్లకముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తాయి. ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్,…

2 hours ago

బాలయ్య దర్శకులకు అసలైన సవాల్

​నందమూరి బాలకృష్ణ స్పీడ్ ను అందుకోవడం ఇప్పుడున్న కుర్ర హీరోలకు కూడా కష్టమే అనిపిస్తోంది. అఖండ 2 ఫ్లాప్ అయినా…

2 hours ago

విజయ్ నియోజకవర్గంలో రాత్రి 1 వరకు ఓటింగ్…

త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా జ‌రిగింది. వాస్త‌వానికి గ‌తంలో కొన్ని కొన్ని చెదురుమొదురు ఘ‌ట‌న‌లు జ‌రిగేవి. తాజాగా…

3 hours ago