వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. దర్శకుడు వెంకీ అట్లూరి బ్రాండ్ తో పాటు సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మాణం కావడంతో అంచనాల పరంగా ఫ్యామిలీ ఆడియన్స్ దీని మీద నమ్మకం పెట్టుకున్నారు. ఆగస్ట్ 2 చెన్నైలో గ్రాండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చేయబోతున్నారని సమాచారం. దాని తర్వాత హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేస్తారని వేరే చెప్పనక్కర్లేదు.
ఇదంతా ఓకే కానీ విశ్వనాథ్ మీద ఉన్న సాఫ్ట్ కార్నర్ ఏమిటంటే ఇదో కంప్లీట్ ఎంటర్ టైనర్ లా ఉంటుందని సామాన్య ప్రేక్షకులు భావిస్తున్నారు. అంటే ఒక కలిసుందాం రా తరహాలో ఫుల్ ప్యాకేజీ అవుతుందనే కాన్ఫిడెన్స్ తోనే బయ్యర్లు కూడా ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అయితే కేవలం టైటిల్ ని బట్టి స్టోరీ మీద అంచనాకు వచ్చేయకూడదని టీజర్ లోనే కథ చెప్పడం చూశాం. పాతికేళ్ల అమ్మాయి, నలభై వయసున్న వ్యక్తిని ప్రేమించడమే ఇందులో మెయిన్ పాయింట్.
అలాంటప్పుడు విశ్వనాథ్ ఆండ్ సన్స్ పేరు ఎందుకు పెట్టారు, పోస్టర్లలో చూపించిన చిన్న బాబు కాకుండా ఇంకెవరైనా సూర్యకు సంతానం ఉన్నారా, పిల్లల తండ్రిని మమిత బైజు ప్రేమించినట్టు వెంకీ రాసుకున్నారా లాంటి ఎన్నో ప్రశ్నలు థియేటర్లో ఎదురు చూస్తున్నాయి. రాధికా శరత్ కుమార్, రవీనాటాండన్ లాంటి సీనియర్లు ఇందులో పెద్ద పాత్రలే చేశారు. జివి ప్రకాష్ సంగీతంలో మొదటి పాట మంచి హిట్ కాగా సూర్య పాడిన రెండో సాంగ్ కు ఏమంత స్పందన లేదు.
వీరభద్రుడు / కరుప్పు బ్లాక్ బస్టర్ తో మంచి ఊపు మీద ఉన్న సూర్యకు ఇప్పుడు విశ్వనాథ్ అండ్ సన్స్ తో దాన్ని మ్యాచ్ చేయడమో లేదా క్రాస్ చేయడం ద్వారా తన మార్కెట్ ని మరింత పటిష్ట పరుచుకోవచ్చు. కానీ ఇలాంటి క్లాస్ మూవీతో ఆ స్థాయి వసూళ్లు సాధ్యమా అనేది అసలు ప్రశ్న. అల వైకుంఠపురములో తరహా ట్రీట్ మెంట్ ఉంటుంది కాబట్టి కంటెంట్ కనెక్ట్ అవుతుందా లేదానే భయం అక్కర్లేదని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అదే నిజమైతే సంతోషమే.
This post was last modified on July 29, 2026 3:33 pm
థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…
ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ…
నాలుగు రోజులు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన చెన్నై లవ్ స్టోరీ తాలూకు కబుర్లు, ట్వీట్లే కనిపించాయి. మొదటి రోజు…
ఔను… ఇది నిజమే. విద్యార్థులకు హెచ్ఐవీ పరీక్షలు తప్పనిసరి చేస్తూ కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి కారణం..…
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు.. పట్టుమని ఒక్కగంట కూడా ప్రశాంతంగా జరగడం లేదు. సభ ప్రారంభం కాగానే అధికార, ప్రతిపక్ష సభ్యుల…
ఇప్పటి వరకు పుణ్యం వస్తుందని గుండు చేయించుకున్న వాళ్ళను చూసాం కానీ ఇప్పుడు పుణ్యం 15 వేల రూపాయల గిఫ్ట్…