రేపు శ్రీనివాస మంగాపురం విడుదల కానుంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం మొదటి వారసుడిగా తన మీద పెద్ద బాధ్యత ఉంది. మహేష్ బాబు రాజకుమారుడు విడుదలైన జూలై 30 దీన్ని రిలీజ్ చేయడం సమర్పకులు అశ్వినిదత్ సెంటిమెంట్ గా భావిస్తున్నారు. ఈ విషయాన్ని మహేష్ తన వీడియో బైట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే అన్న కొడుకు కోసం మహేష్ బాబు ప్రత్యక్షంగా ఎలాంటి ఈవెంట్ లో పాల్గొనకపోవడం కొన్ని విమర్శలు తెచ్చి పెట్టింది.
జయకృష్ణ తండ్రి రమేష్ బాబు కొన్నేళ్ల క్రితం కాలం చేశారు. తాత కృష్ణ చనిపోయి సంవత్సరాలు దాటేసింది. నాన్నమ్మ కూడా లేదు. తల్లికి సినిమా రంగంతో నేరుగా పరిచయం ఆశించలేం. సో ఎటు చూసినా తోడు ఉండాల్సింది బాబాయ్ మహేష్ బాబే. ఏదైనా వేడుకకు ప్రత్యక్షంగా వచ్చి నాలుగు మాటలు చెప్పి ఉంటే బజ్ పెరిగేదని వినిపిస్తున్న కామెంట్స్ లో నిజం లేకపోలేదు. ఎందుకంటే గుంటూరు కారం తర్వాత సూపర్ స్టార్ ని వారణాసికి తప్ప వేరే పబ్లిక్ ఈవెంట్ లో చూడలేదు.
సరే మహేష్ ఇబ్బందులు ఏమైనా ఉండొచ్చు కానీ ఇప్పుడు ఘట్టమనేని ఫ్యాన్స్ రంగంలోకి దిగి శ్రీనివాస మంగాపురంకు మైలేజ్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. కొన్ని చోట్ల ఉదయం బెనిఫిట్ షోలు తద్వారా సెలెబ్రేషన్స్ తో పాటు కుర్రాడికి తమ సపోర్ట్ ఉందనే సందేశం ఇస్తున్నారు. సీనియర్ అభిమానులకు రమేష్ బాబు బాగా గుర్తు. సామ్రాట్ నుంచి ఎన్ కౌంటర్ దాకా ఆయన నటించిన ఎన్నో సినిమాలు చూసి ఒక నటుడిగా కృష్ణగారబ్బాయిగా ఆ గౌరవాన్ని ఇప్పటికీ పెట్టుకున్నారు.
సో ఇక ఆసలు బాధ్యత దర్శకుడు అజయ్ భూపతి మీద ఉంది. కమర్షియల్ ఫార్మాట్ లో ప్రేమకథ చెప్పబోతున్న వైనం ట్రైలర్ లో కనిపించేసింది. మోహన్ బాబు అంతటి సీనియర్ హీరో ప్రత్యేక పాత్ర చేయడానికి ఒప్పుకున్నారంటే మ్యాటర్ ఉండే ఉంటుంది. జివి ప్రకాష్ కుమార్ స్వరపరిచిన పాటలు మరీ వైరల్ కాకపోవడంతో బజ్ కొంచెం అటుఇటు అవుతోంది. సీనియర్ హీరోయిన్ రవీనాటాండన్ కూతురు రష తదాని ఈ సినిమాతోనే పరిచయమవుతూ డెబ్యూనే పెద్ద బ్రేకవుతుందని ఎదురు చూస్తోంది.
This post was last modified on July 29, 2026 11:00 am
స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…
తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…
ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్ను పక్కన పెడితే.. అల్లు…
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…
పిల్లల విషయంలో తల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్యవహరించాలో చెప్పే ఉదంతమిది. విద్యార్థులను క్రమశిక్షణలో పెట్టాలని, వారిలో భయం పెంచాలని…
హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…