Trends

పేద విద్యార్థిని బలిగొన్న మంచి మార్కులు

మరో విద్యా కుసుమం నేల రాలింది. ర్యాంకులు, మార్కుల ఉరితాడుకు నిరుపేద విద్యార్థి బలయ్యాడు. ఏమాత్రం సామాజిక స్పహ లేకుండా అనుచితంగా ప్రవర్తించిన ఒక మహిళా లెక్చరర్ చేసిన పాపం నిరుపేద కుటుంబంలో విషాదం నింపింది.

జోగుళాంబ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు బుచ్చన్న, రేణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వ్యవసాయ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నారు. వారి రెండో కుమారుడు రెండో కుమారుడు తరుణ్ (17)జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తొలి నుంచి చదువులో రాణించే తరుణ్ ఇంటర్ 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించిన జిల్లాలో రెండో ర్యాంక్ సాధించాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ కాలేజీలో చదువుతూ జిల్లా ర్యాంకు సాధించిన తరుణ్ ను గ్రామస్టులు అభినందనలు తెలిపారు.

ఫస్ట్ ర్యాంకర్ తో పోలుస్తూ అవమానించిన లెక్చరర్…
ర్యాంకులు, మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థులను ప్రోత్సాహించాలన్న కనీస విజ్ఞత లోపించిన ఒక మహిళా లెక్చరర్ తరుణ్ ను అవమానించడం మొదలుపెట్టింది. తరచుగా 435 మార్కులు సాధించిన విద్యార్థితో పోల్చడం, దూషిస్తూ నలుగురి ముందు కించపరిచడం చేస్తుంది. అలా హేళన చేయవద్దని తరుణ్ బతిమాలాడు, అభ్యంతరం వ్యక్తం చేసాడు.

దాంతో అహం దెబ్బతిన్న లెక్చరర్ విద్యార్థుల ముందు చేయి చేసుకోవడమే కాకుండా నీవేమైనా మంత్రి కొడుకువా అంటూ మాట్లాడ్డంతో తరుణ్ హృదయం గాయపడింది. లెక్చరర్ వేధింపులను తట్టుకోలేక చావే నయమని భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్న బిడ్డ మృతితో బుచ్చన్న దంపతులు విషాదంలో మునిగిపోయారు.

లెక్చరర్ తీరుపై ఆగ్రహం..
మహిళా లెక్చరర్ వ్యవహరించిన తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యావంతురాలైనప్పటికి చాలా చీప్ గా బిహేవ్ చేశారని నేటిజన్లు మండి పడుతున్నారు. తరుణ్ ఆత్మహత్యకు కారకురాలైన లెక్చరర్ మీద హత్య కేసు నమోదు చేయాలని కొత్తపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

పోలికలు వద్దని చెప్పినా…
విద్యార్థులను ఒకరితో మరొకరిని పోల్చవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మానసికంగా కుంగి పోతారని, తామెందుకూ పనికిరామని ఆత్మన్యూన్యత గురవుతారని విశ్లేషిస్తున్నారు. దాంతో ఆత్మహత్యలకు పాలడతారని చెబుతున్నారు. విద్యార్థులను ఇరులతో పోల్చడం సామాజిక నేరంగా పరిగణించాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on July 29, 2026 11:16 am

Share

Recent Posts

కుర్రాడికి అభిమానుల అండ దొరికిందా

రేపు శ్రీనివాస మంగాపురం విడుదల కానుంది. ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం మొదటి వారసుడిగా తన మీద పెద్ద…

48 minutes ago

తెలంగాణాలో కొనసాగుతున్న ‘హైడ్రా’మా

తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసికట్టుగా హైడ్రామా కొనసాగిస్తున్నారు. ఉన్నత న్యాయస్థానం కమిషనర్ రంగనాధ్ ను తొలగించాలని ఆదేశించడమే…

2 hours ago

లోకేష్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కేంద్రంగా రాజకీయాలు పరిభ్రమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం…

3 hours ago

బోండా గండం గట్టేక్కినట్లే

గుంటూరులో జరిగిన ముద్రగడ పద్మనాభం వర్ధంతి సభలో విజయవాడ ఎమ్మెల్యే బోండా ఉమా వ్యవహారం ఇపుడు తెలుగునాట చర్చనీయంశంగా మారింది.…

12 hours ago

అల్లు అర్జున్ ప్లానింగ్ అందరికీ రాదు

స్టార్ హీరోలు ఎవరికైనా అభిమానులుంటారు. కానీ వాళ్ళతో ఒక ప్రణాళికాబద్ధమైన సంబంధాన్ని ఏర్పరుచుకోవడం అందరి వల్ల కాదు. సీనియర్లలో చిరంజీవి…

13 hours ago

సాలీడు మనిషి వణుకు పుట్టిస్తున్నాడు

ఎల్లుండి విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ షాకవుతోంది. ఈ సిరీస్…

14 hours ago