మరో విద్యా కుసుమం నేల రాలింది. ర్యాంకులు, మార్కుల ఉరితాడుకు నిరుపేద విద్యార్థి బలయ్యాడు. ఏమాత్రం సామాజిక స్పహ లేకుండా అనుచితంగా ప్రవర్తించిన ఒక మహిళా లెక్చరర్ చేసిన పాపం నిరుపేద కుటుంబంలో విషాదం నింపింది.
జోగుళాంబ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు బుచ్చన్న, రేణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వ్యవసాయ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నారు. వారి రెండో కుమారుడు రెండో కుమారుడు తరుణ్ (17)జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తొలి నుంచి చదువులో రాణించే తరుణ్ ఇంటర్ 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించిన జిల్లాలో రెండో ర్యాంక్ సాధించాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ కాలేజీలో చదువుతూ జిల్లా ర్యాంకు సాధించిన తరుణ్ ను గ్రామస్టులు అభినందనలు తెలిపారు.
ఫస్ట్ ర్యాంకర్ తో పోలుస్తూ అవమానించిన లెక్చరర్…
ర్యాంకులు, మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థులను ప్రోత్సాహించాలన్న కనీస విజ్ఞత లోపించిన ఒక మహిళా లెక్చరర్ తరుణ్ ను అవమానించడం మొదలుపెట్టింది. తరచుగా 435 మార్కులు సాధించిన విద్యార్థితో పోల్చడం, దూషిస్తూ నలుగురి ముందు కించపరిచడం చేస్తుంది. అలా హేళన చేయవద్దని తరుణ్ బతిమాలాడు, అభ్యంతరం వ్యక్తం చేసాడు.
దాంతో అహం దెబ్బతిన్న లెక్చరర్ విద్యార్థుల ముందు చేయి చేసుకోవడమే కాకుండా నీవేమైనా మంత్రి కొడుకువా అంటూ మాట్లాడ్డంతో తరుణ్ హృదయం గాయపడింది. లెక్చరర్ వేధింపులను తట్టుకోలేక చావే నయమని భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్న బిడ్డ మృతితో బుచ్చన్న దంపతులు విషాదంలో మునిగిపోయారు.
లెక్చరర్ తీరుపై ఆగ్రహం..
మహిళా లెక్చరర్ వ్యవహరించిన తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యావంతురాలైనప్పటికి చాలా చీప్ గా బిహేవ్ చేశారని నేటిజన్లు మండి పడుతున్నారు. తరుణ్ ఆత్మహత్యకు కారకురాలైన లెక్చరర్ మీద హత్య కేసు నమోదు చేయాలని కొత్తపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.
పోలికలు వద్దని చెప్పినా…
విద్యార్థులను ఒకరితో మరొకరిని పోల్చవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మానసికంగా కుంగి పోతారని, తామెందుకూ పనికిరామని ఆత్మన్యూన్యత గురవుతారని విశ్లేషిస్తున్నారు. దాంతో ఆత్మహత్యలకు పాలడతారని చెబుతున్నారు. విద్యార్థులను ఇరులతో పోల్చడం సామాజిక నేరంగా పరిగణించాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on July 29, 2026 11:16 am
సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…
న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…
వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…
సోషల్ మీడియాలో రచ్చ లేపాలంటే సందీప్ రెడ్డి వంగ సినిమా తీయాల్సిన అవసరమే లేదని.. అతను యథాలాపంగా చిన్న కామెంట్…
తెలుగులో స్టార్ హీరోల పాత్రలకు ఏదైనా వైకల్యం పెట్టాలంటే.. ఎన్నో భయాలుండేవి ఒకప్పుడు. హీరోలు అలాంటి పాత్రలు ఒప్పుకోవడమూ కష్టంగా…
విజయవాడ మేయర్ పదవికి అన్నీ పార్టీల్లోనూ పోటీ పెరుగుతుంది. ఇంకా ఎన్నికల ప్రక్రియ మొదలుకాకుండానే మేయర్ కుర్చీ పై పలువురు…