Trends

పేద విద్యార్థిని బలిగొన్న మంచి మార్కులు

మరో విద్యా కుసుమం నేల రాలింది. ర్యాంకులు, మార్కుల ఉరితాడుకు నిరుపేద విద్యార్థి బలయ్యాడు. ఏమాత్రం సామాజిక స్పహ లేకుండా అనుచితంగా ప్రవర్తించిన ఒక మహిళా లెక్చరర్ చేసిన పాపం నిరుపేద కుటుంబంలో విషాదం నింపింది.

జోగుళాంబ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన నేతిబొట్టు బుచ్చన్న, రేణమ్మ దంపతులకు ఇద్దరు సంతానం. వ్యవసాయ చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్న ఈ దంపతులు రెక్కలు ముక్కలు చేసుకొని పిల్లలను చదివించుకుంటున్నారు. వారి రెండో కుమారుడు రెండో కుమారుడు తరుణ్ (17)జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తొలి నుంచి చదువులో రాణించే తరుణ్ ఇంటర్ 440 మార్కులకు గాను 434 మార్కులు సాధించిన జిల్లాలో రెండో ర్యాంక్ సాధించాడు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి ప్రభుత్వ కాలేజీలో చదువుతూ జిల్లా ర్యాంకు సాధించిన తరుణ్ ను గ్రామస్టులు అభినందనలు తెలిపారు.

ఫస్ట్ ర్యాంకర్ తో పోలుస్తూ అవమానించిన లెక్చరర్…
ర్యాంకులు, మార్కులతో సంబంధం లేకుండా విద్యార్థులను ప్రోత్సాహించాలన్న కనీస విజ్ఞత లోపించిన ఒక మహిళా లెక్చరర్ తరుణ్ ను అవమానించడం మొదలుపెట్టింది. తరచుగా 435 మార్కులు సాధించిన విద్యార్థితో పోల్చడం, దూషిస్తూ నలుగురి ముందు కించపరిచడం చేస్తుంది. అలా హేళన చేయవద్దని తరుణ్ బతిమాలాడు, అభ్యంతరం వ్యక్తం చేసాడు.

దాంతో అహం దెబ్బతిన్న లెక్చరర్ విద్యార్థుల ముందు చేయి చేసుకోవడమే కాకుండా నీవేమైనా మంత్రి కొడుకువా అంటూ మాట్లాడ్డంతో తరుణ్ హృదయం గాయపడింది. లెక్చరర్ వేధింపులను తట్టుకోలేక చావే నయమని భావించాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని మరణించాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కన్న బిడ్డ మృతితో బుచ్చన్న దంపతులు విషాదంలో మునిగిపోయారు.

లెక్చరర్ తీరుపై ఆగ్రహం..
మహిళా లెక్చరర్ వ్యవహరించిన తీరు పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నత విద్యావంతురాలైనప్పటికి చాలా చీప్ గా బిహేవ్ చేశారని నేటిజన్లు మండి పడుతున్నారు. తరుణ్ ఆత్మహత్యకు కారకురాలైన లెక్చరర్ మీద హత్య కేసు నమోదు చేయాలని కొత్తపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

పోలికలు వద్దని చెప్పినా…
విద్యార్థులను ఒకరితో మరొకరిని పోల్చవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. దీనివల్ల విద్యార్థులు మానసికంగా కుంగి పోతారని, తామెందుకూ పనికిరామని ఆత్మన్యూన్యత గురవుతారని విశ్లేషిస్తున్నారు. దాంతో ఆత్మహత్యలకు పాలడతారని చెబుతున్నారు. విద్యార్థులను ఇరులతో పోల్చడం సామాజిక నేరంగా పరిగణించాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.

This post was last modified on July 29, 2026 11:16 am

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

1 hour ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

11 hours ago