బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్ ఉన్నవి రాకపోవడం, వచ్చిన వాటి పట్ల అంతగా ఉత్సాహం కనిపించకపోవడం వల్ల రెగ్యులర్ ఆడియన్స్ సైతం టికెట్లు కొనడం లేదు. ఈ నేపథ్యంలో ఇంకో శుక్రవారం అయితే మొదలయ్యింది కానీ ఎగ్జిబిటర్ల ఆకలి కేకల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. కూల్ సమ్మర్ అంటూ హడావిడి చేసిన గోదారి గట్టుపైన ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సుమంత్ ప్రభాస్ కు పెద్దగా ఇమేజ్ లేకపోవడం వల్ల ఏమంత హైప్ లేదు. ముందురోజు రాత్రి హైదరాబాద్ లో ప్రీమియర్లు వేశారు. టాక్ మిక్స్డ్ గా ఉన్నా ఏ మేరకు నిలబడుతుందనేది వీకెండ్ అయ్యాక క్లారిటీ వస్తుంది. ఇదే సుమంత్ ప్రభాస్ మేం ఫేమస్ కి మూడేళ్ళ క్రితం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ శాతం మెయిన్ సెంటర్స్ లో ప్రీమియర్లు వేస్తే ఈసారి హైదరాబాద్ తో పాటు 8 కేంద్రాలకు పరిమితం చేయడం గమనార్హం. రవిబాబు రేజర్ కూడా ఏమంత ప్రభావం చూపించలేక ఓపెనింగ్స్ విషయంలో వెనుకబడి ఉంది. సతి లీలావతిది అదే కథ.
ఈ సినిమాలన్నీ బాగున్నాయా లేదా అనేది కాదు డిస్కషన్. అసలు మొదటి రోజు ఖచ్చితంగా సినిమాలు చూసే అలవాటున్న జనాలు సైతం థియేటర్లకు ఎందుకు దూరంగా ఉన్నారనేది. ఎండలు, ఐపీఎల్ ప్రభావం ఉంది కానీ పూర్తిగా అయితే కాదు. సరైన మూవీ ఉందంటే ఇప్పటికిప్పుడు హౌస్ ఫుల్స్ పెట్టేంత ప్రేమ తెలుగు ఆడియన్స్ ది. టాక్ కొంచెం అటు ఇటు ఊగినా కూడా డెకాయిట్ తెచ్చిన కలెక్షన్లే దానికి నిదర్శనం. శేష్ బ్రాండ్ తాలూకు ఫలితం అది.
గతంతో పోలిస్తే ఇప్పటి పబ్లిక్ మారిపోయిన మాట వాస్తవమే. ఓటిటిలు, పైరసీ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. అయితే ఎగ్జైట్ మెంట్ అనిపించేలా ఎవరూ సరైన కంటెంట్ తో రాకపోవడమే అసలు సమస్య. జూన్ 4 ఇంకా పాతిక రోజుల దూరంలో ఉంది. అప్పటిదాకా థియేటర్ ఫీడింగ్ జరగాలి. ఇవాళ వచ్చినవి ఒక వారం దాకా ఎంతో కొంత నిలబడితే ఊరట దక్కుతుంది. లేదంటే కథ మళ్ళీ మొదటికే వస్తుంది. ముందైతే రిలీజ్ డే మార్నింగ్ షో హౌస్ ఫుల్ చేసే సినిమా జూన్ 4 కన్నా ముందు వస్తుందో రాదో చూడాలి.
టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…
టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్…
టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…