టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి టికెట్ ధరల పద్దతిని అమలు చేయాలని కోరతారట. అంటే 100 నుంచి 1000 రూపాయల మధ్య ఎంత రేట్ పెట్టాలనేది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా ఎలాంటి జిఓలు అవసరం ఉండదు. నేరుగా ధరలు పెంచుకుని బుకింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు.
వినడానికి బాగానే ఉంది ఈ పద్దతి హైదరాబాద్ లాంటి నగరాలకు వర్కౌట్ అయినా బిసి సెంటర్స్ లో అంత సులభంగా స్పందన తెచ్చుకుంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే రెగ్యులర్ రేట్లకే జనాలు థియేటర్లకు రావడం మానేశారు. కంటెంట్ ఏదో ఎక్స్ ట్రాడినరిగా ఉందని టాక్ వస్తే తప్ప టికెట్లు బుక్ చేసుకుని బయటికి రావడం లేదు. అలాంటిది ఇప్పుడు పర్మిషన్లు లేకుండా డైరెక్ట్ గా పెంపు తీసుకునే ఛాన్స్ ఉందంటే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా.
ఇందులో ఒక రిస్క్ పొంచి ఉంది. ఇలాంటి సిస్టమ్ వస్తే కనక మల్టీప్లెక్సులకు పగ్గాలు ఉండవు. వీకెండ్స్ లో భారీగా పెంచేస్తారు. ఉదాహరణకు శని ఆదివారాలు 500 రూపాయలు ఉన్న టికెట్ రేట్ బుధవారానికి 1000 రూపాయలకు పెరగవచ్చు. క్రేజ్ ఉన్న స్టార్ హీరోలవి హిట్ టాక్ ని బట్టి రోజు అధిక ధరలను ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు. బెంగళూరు, ముంబై మల్టీప్లెక్సుల్లో కొన్ని హాలీవుడ్ మూవీస్ మొదటి రోజు టికెట్ రెండు వేల రూపాయల దాకా ఉంటోంది.
ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చు. కానీ నియంత్రణ లేని టికెట్ రేట్ల వల్ల చివరికి దాన్ని భరించే బాధ్యత థియేటర్ కు వచ్చే మధ్య తరగతి ప్రేక్షకుల మీద ఉంటుంది. ఇప్పటికే మిడిల్ క్లాస్ బ్యాచ్ లు సినిమాలకు రావడం బాగా తగ్గించాయి. ఇప్పుడు కనక క్యాప్ ఎత్తేసి ఫ్లెక్సీ ప్రైజింగ్ పేరుతో కొత్త ఎత్తుగడ వేస్తే ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రతి సినిమాను థియేటర్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే, హార్డ్ కోర్ లవర్స్ కు మాత్రం ఇది శరాఘాతమే.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…