టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి టికెట్ ధరల పద్దతిని అమలు చేయాలని కోరతారట. అంటే 100 నుంచి 1000 రూపాయల మధ్య ఎంత రేట్ పెట్టాలనేది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా ఎలాంటి జిఓలు అవసరం ఉండదు. నేరుగా ధరలు పెంచుకుని బుకింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు.
వినడానికి బాగానే ఉంది ఈ పద్దతి హైదరాబాద్ లాంటి నగరాలకు వర్కౌట్ అయినా బిసి సెంటర్స్ లో అంత సులభంగా స్పందన తెచ్చుకుంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే రెగ్యులర్ రేట్లకే జనాలు థియేటర్లకు రావడం మానేశారు. కంటెంట్ ఏదో ఎక్స్ ట్రాడినరిగా ఉందని టాక్ వస్తే తప్ప టికెట్లు బుక్ చేసుకుని బయటికి రావడం లేదు. అలాంటిది ఇప్పుడు పర్మిషన్లు లేకుండా డైరెక్ట్ గా పెంపు తీసుకునే ఛాన్స్ ఉందంటే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా.
ఇందులో ఒక రిస్క్ పొంచి ఉంది. ఇలాంటి సిస్టమ్ వస్తే కనక మల్టీప్లెక్సులకు పగ్గాలు ఉండవు. వీకెండ్స్ లో భారీగా పెంచేస్తారు. ఉదాహరణకు శని ఆదివారాలు 500 రూపాయలు ఉన్న టికెట్ రేట్ బుధవారానికి 1000 రూపాయలకు పెరగవచ్చు. క్రేజ్ ఉన్న స్టార్ హీరోలవి హిట్ టాక్ ని బట్టి రోజు అధిక ధరలను ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు. బెంగళూరు, ముంబై మల్టీప్లెక్సుల్లో కొన్ని హాలీవుడ్ మూవీస్ మొదటి రోజు టికెట్ రెండు వేల రూపాయల దాకా ఉంటోంది.
ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చు. కానీ నియంత్రణ లేని టికెట్ రేట్ల వల్ల చివరికి దాన్ని భరించే బాధ్యత థియేటర్ కు వచ్చే మధ్య తరగతి ప్రేక్షకుల మీద ఉంటుంది. ఇప్పటికే మిడిల్ క్లాస్ బ్యాచ్ లు సినిమాలకు రావడం బాగా తగ్గించాయి. ఇప్పుడు కనక క్యాప్ ఎత్తేసి ఫ్లెక్సీ ప్రైజింగ్ పేరుతో కొత్త ఎత్తుగడ వేస్తే ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రతి సినిమాను థియేటర్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే, హార్డ్ కోర్ లవర్స్ కు మాత్రం ఇది శరాఘాతమే.
This post was last modified on May 8, 2026 5:15 pm
అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్…
తమిళనాడు రాజకీయాలు మూడు రోజులుగా రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీవీకే పార్టీకి ప్రజలు…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు, రచ్చకు దారి తీసిన పేరు రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్. ఈయన తమిళనాడుకు ఇంచార్జ్ గవర్నర్గా…
దేశంలో ప్రజాస్వామ్యానికి, ముఖ్యంగా రాజ్యాంగానికి పెద్ద పీట వేస్తున్నామని పదే పదే చెబుతున్నా.. ఆ స్ఫూర్తి మాత్రం ఎక్కడా కనిపించడం…
పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా రాజకీయాల్లోకి వచ్చిన కొంతమంది యువ నాయకులు తమ తండ్రుల వారసత్వాన్ని నిలబెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు.…