Movie News

ఫ్లెక్సీ టికెట్ ధరలు నిజంగా మేలు చేస్తాయా

టాలీవుడ్ నిర్మాతలు త్వరలోనే ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు ఒక విన్నపం చేయబోతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక తరహాలో ఏపీ తెలంగాణలో ఫ్లెక్సి టికెట్ ధరల పద్దతిని అమలు చేయాలని కోరతారట. అంటే 100 నుంచి 1000 రూపాయల మధ్య ఎంత రేట్ పెట్టాలనేది ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రత్యేకంగా ఎలాంటి జిఓలు అవసరం ఉండదు. నేరుగా ధరలు పెంచుకుని బుకింగ్స్ ఓపెన్ చేసుకోవచ్చు.

వినడానికి బాగానే ఉంది ఈ పద్దతి హైదరాబాద్ లాంటి నగరాలకు వర్కౌట్ అయినా బిసి సెంటర్స్ లో అంత సులభంగా స్పందన తెచ్చుకుంటుందని చెప్పడానికి లేదు. ఎందుకంటే రెగ్యులర్ రేట్లకే జనాలు థియేటర్లకు రావడం మానేశారు. కంటెంట్ ఏదో ఎక్స్ ట్రాడినరిగా ఉందని టాక్ వస్తే తప్ప టికెట్లు బుక్ చేసుకుని బయటికి రావడం లేదు. అలాంటిది ఇప్పుడు పర్మిషన్లు లేకుండా డైరెక్ట్ గా పెంపు తీసుకునే ఛాన్స్ ఉందంటే ఏం జరుగుతుందో వేరే చెప్పాలా.

ఇందులో ఒక రిస్క్ పొంచి ఉంది. ఇలాంటి సిస్టమ్ వస్తే కనక మల్టీప్లెక్సులకు పగ్గాలు ఉండవు. వీకెండ్స్ లో భారీగా పెంచేస్తారు. ఉదాహరణకు శని ఆదివారాలు 500 రూపాయలు ఉన్న టికెట్ రేట్ బుధవారానికి 1000 రూపాయలకు పెరగవచ్చు. క్రేజ్ ఉన్న స్టార్ హీరోలవి హిట్ టాక్ ని బట్టి రోజు అధిక ధరలను ముక్కుపిండి వసూలు చేసుకోవచ్చు. బెంగళూరు, ముంబై మల్టీప్లెక్సుల్లో కొన్ని హాలీవుడ్ మూవీస్ మొదటి రోజు టికెట్ రెండు వేల రూపాయల దాకా ఉంటోంది.

ఇప్పుడు హైదరాబాద్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురుకావొచ్చు. కానీ నియంత్రణ లేని టికెట్ రేట్ల వల్ల చివరికి దాన్ని భరించే బాధ్యత థియేటర్ కు వచ్చే మధ్య తరగతి ప్రేక్షకుల మీద ఉంటుంది. ఇప్పటికే మిడిల్ క్లాస్ బ్యాచ్ లు సినిమాలకు రావడం బాగా తగ్గించాయి. ఇప్పుడు కనక క్యాప్ ఎత్తేసి ఫ్లెక్సీ ప్రైజింగ్ పేరుతో కొత్త ఎత్తుగడ వేస్తే ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. ప్రతి సినిమాను థియేటర్ లోనే ఎక్స్ పీరియన్స్ చేయాలనుకునే, హార్డ్ కోర్ లవర్స్ కు మాత్రం ఇది శరాఘాతమే.

Kumar

Recent Posts

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

46 minutes ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

7 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

7 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

7 hours ago

అతిథిని ఎక్కువగా అంచనా వేశారు

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…

8 hours ago

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…

9 hours ago