Movie News

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ కథనర్ ది వైల్డ్ సార్సరర్. ఇది మల్లువుడ్ డెబ్యూ కూడా. జయసూర్య హీరోగా నటించాడు. ఎప్పుడో వందల సంవత్సరాల క్రితం జరిగిన తొమ్మిదో శతాబ్దపు వీరుడి కథను తీసుకున్నారు. నిర్మాణం రెండు సంవత్సరాలకు పైగానే జరిగింది. టీజర్ వచ్చి నెల దాటేసింది. 4 మిలియన్ల వ్యూస్ ఉన్నాయి.

అనుష్కని చూపించి చూపించకుండా కేవలం ఒక్క షాట్ కి పరిమితం చేసి నిరాశ పరిచినా ఇందులో స్వీటీ చేసింది చాలా ముఖ్యమైన పాత్ర. స్టంట్స్ తో పాటు అడ్వెంచర్లు కూడా చేయించారట దర్శకుడు రోజిన్ థామస్. సరే ఇదంతా బాగానే ఉంది కానీ ఇంతకీ కథనర్ విడుదల ఎప్పుడనేది ప్రశ్నగా మిగిలింది. విఎఫ్ఎక్స్ వల్ల లేట్ అవుతోందని అంటున్నారు. కానీ ఓటిటి డీల్ ఇంకా ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్లే వాయిదా పడిందనే వెర్షన్ వినిపిస్తోంది.

ఎంత గ్రాండియర్ ఉన్నా కథనర్ కు ఇతర భాషల్లో బజ్ లేదు. కేవలం అనుష్క ఉందన్న కారణంగా ప్రేక్షకులు ఎగబడి చూడరు. అలా అయితే ఘాటీ అంత దారుణంగా బోల్తా కొట్టేది కాదు. సో హైప్ రావాలంటే ఇంకేదో చేయాలి. టీజర్ చూస్తేనేమో అర్థమే కానట్టు కట్ చేశారు. అసలే మలయాళీ పీరియాడిక్ డ్రామాలు మనకు కనెక్ట్ కావు. గతంలో మోహన్ లాల్ రెండు మూడు ప్యాన్ ఇండియా సినిమాలు మన దగ్గర ఈ కారణంగానే పట్టుమని రెండు రోజులు ఆడలేదు.

సో కథనర్ విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. ఇది రెండు భాగాలుగా వస్తోందట. ఈ ఏడాది వేసవి నుంచి దీపావళి దాకా కీలకమైన రిలీజ్ డేట్లు ఒక్కొకటిగా లాక్ అవుతున్నాయి. పెద్ది, ప్యారడైజ్, రామాయణతో పాటు టాక్సిక్ లాంటివి మంచి సీజన్స్ లో వస్తున్నాయి. వీటి మధ్య కథానార్ తట్టుకోవడం అంత సులభం కాదు. అన్నట్టు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరిగింది ఎప్పుడో తెలుసా. 2021 సంవత్సరంలో. 2023 లో షూట్ స్టార్ట్ అయ్యింది. అంటే ఆరు సంవత్సరాలు ఈ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టారన్న మాట.

Kumar

Recent Posts

కర్ణాటక సీఎం మార్పు… ఢిల్లీలో షర్మిల

దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకున్న గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్.. మరో రాష్ట్రంలో అధికార కూటమిలో భాగస్వామిగా…

48 minutes ago

జూన్ నెలలో విజయ్…….జూలైలో జూనియర్ విజయ్

కోలీవుడ్ లో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకోనుంది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చివరి సినిమాగా చెప్పబడుతున్న జన నాయగన్…

7 hours ago

కెప్టెన్‌గా రిష‌బ్ పంత్ ఔట్‌

రెండేళ్ల ముందు ఐపీఎల్ వేలంలో ఏకంగా రూ.27 కోట్ల‌తో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ టీం సొంత‌మైన ఆట‌గాడు రిష‌బ్ పంత్.…

7 hours ago

రండి తేల్చేద్దాం.. ముఖ్య నేత‌ల‌కు చంద్ర‌బాబు పిలుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. గ‌త వారం రోజులుగా మ‌హానాడు నిర్వ‌హ‌ణ‌పై దృష్టి పెట్టారు. ఇదేస‌మ‌యంలో పాల‌న ప‌రంగా కూడా స‌మీక్ష‌లు..…

8 hours ago

అతిథిని ఎక్కువగా అంచనా వేశారు

మహేష్ బాబు ఫ్లాప్ సినిమాలు సైతం రీ రిలీజ్ లోనూ రికార్డులు సృష్టించడం చూశాం. ముఖ్యంగా ఖలేజాని చూసుకుంటే దానికొచ్చిన…

9 hours ago

జ‌గ‌న్ ఇప్పుడు ఫీల‌వుతున్నారా…?

వైసీపీ అధినేత జగన్ ఆవేదన చెందుతున్నారా ? అంటే అవున‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాలు.. పార్టీని…

9 hours ago