Movie News

ఎటెటో వెళ్తున్న జన నాయకుడు గొడవ

సినిమా విడుదల ఎప్పుడో తేలకుండానే పైరసీ బారిన పడిన జన నాయకుడు గొడవ రకరకాల మలుపులు తిరుగుతోంది. ముందు లాయర్ తరపున వార్నింగ్ సోషల్ మీడియాలో వచ్చింది. ఆ తర్వాత నిర్మాణ సంస్థ హెచ్చరిక చేసింది. విజయ్ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు కొన్ని వందల సంఖ్యలో ఉన్న లింకులు తీయించడంలో తమ వంతు కృషి చేశారు. తమిళనాడు నిర్మాతల మండలి ఈ ఘటనను ఖండిస్తూ సదరు ప్రొడ్యూసర్ కు సంఘీభావం తెలిపింది.

దర్శకులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఒక్కొకరుగా తమ గళం విప్పుతున్నారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం బయటికి వచ్చి జన నాయగన్ ఎప్పుడు రిలీజ్ చేసినా ఎక్కువ స్క్రీన్లు ఇచ్చేలా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఎడిటర్స్ సంఘం విచారాన్ని వ్యక్తం చేస్తూ ఇది తమ విభాగంలో జరిగిన తప్పు కాదని, ఒకవేళ ఎడిటర్ అలా చేయాలని అనుకుంటే వాటర్ మార్క్ ఎందుకు వేసుకుంటాడని ప్రశ్నించడం కొత్త చర్చకు దారి తీసింది.

నిజానిజాలు పోలీసుల విచారణలో తెలుస్తాయి కానీ ఈలోగానే రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ముందైతే ఈ మూవీకి సెన్సార్ లాంఛనం అత్యవసరంగా పూర్తి చేయాలి. జరిగిన నష్టాన్ని ఎవరూ భర్తీ చేయలేరు కానీ ఏప్రిల్ 24 విడుదల చేసేందుకు అన్ని రకాలుగా కష్టపడాలి. ఇలా రోజుకో మీటింగ్ తో డ్యామేజ్ రిపేర్ చేయలేరు కానీ హైప్ తగ్గకుండా చూసుకోవాలి.

ఇదంతా ఎలా ఉన్నా అసలు నిందితులు దొరుకుతారా లేరా అనే దాని మీద అనుమానాలు అలాగే కొనసాగుతున్నాయి. ఇప్పటిదాకా పైరసీ చరిత్రలో పట్టుబడిన వాళ్ళు చాలా కొద్దిమందే ఉన్నారు. జన నాయకుడుతో సంబంధం లేకపోయినా ఇతర పైరసీ కేసుల్లో ఉన్న ఐబొమ్మ రవి సైతం బెయిలు మీద బయటికి వచ్చాడు. విజయ్ సినిమాని లీక్ చేసింది ఎవరైనా సరే వాళ్లకు కఠిన శిక్ష విధిస్తే తప్ప భవిష్యత్తులో ఇలాంటి తప్పు చేయడానికి మిగిలినవాళ్లు భయపడతారు.

This post was last modified on April 13, 2026 10:21 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Jana Nayagan

Recent Posts

ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ మార‌బోతున్నాడా?

సూర్య‌కుమార్ యాద‌వ్ ఎందుకు ఉన్నాడు? శ్రేయ‌స్ అయ్య‌ర్ ఎందుకు లేడు? భార‌త టీ20 జ‌ట్టు విష‌యంలో చాలా రోజులుగా అభిమానుల‌ను…

2 minutes ago

విజయ్ కి మద్దతు.. కాంగ్రెస్ కు పెద్ద లాసే?

తమిళనాడు రాజకీయాల్లో ఏర్పడ్డ కొత్త సమీకరణాలు దేశ రాజకీయాల్లో పెను మార్పునకు దారి తీశాయని చెప్పక తప్పదు. మరో మూడేళ్లలో…

2 hours ago

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

8 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

8 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

10 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

11 hours ago