తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పార్టీలో సంస్థాగతంగా పనిచేస్తున్న వారిని గత పది సంవత్సరాల కాలంలో పక్కన పెట్టారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో పార్టీకి అండదండగా ఉన్న కార్యకర్తలను, క్షేత్రస్థాయి నాయకులను కూడా విస్మరించారు… అన్న వాదన బలంగా వినిపించింది. ఫలితంగా గత ఎన్నికల సమయంలో ఈ వాదన బలంగా పనిచేసింది. ఇప్పుడు కూడా అదే అసంతృప్తి పార్టీ నాయకులు కార్యకర్తలలో కనిపిస్తోంది.
దీనిని ఎంత మేరకు తగ్గించుకుంటే అంత మంచిదన్న ధోరణి బీఆర్ ఎస్ పార్టీలో కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. అదే సమయంలో క్షేత్రస్థాయి నాయకులకు ముఖ్యంగా జిల్లా స్థాయి నాయకులకు రాష్ట్రస్థాయిలో, మండల స్థాయి నాయకులకు జిల్లా స్థాయిలో పదవులు ఇచ్చే దిశగా పార్టీ ఆలోచన చేస్తోంది. వచ్చే ఎన్నికల సమయానికి పోటీ తీవ్రంగా ఉండడంతో పాటు కెసిఆర్ కుమార్తె కవిత యాంటీగా మారిన నేపథ్యంలో ఆమె దూకుడు కూడా ఎక్కువగా ఉంటుందన్న చర్చ నడుస్తోంది.
ఈ క్రమంలో పార్టీని ప్రక్షాళన చేయడంతో పాటు ఆది నుంచి పార్టీలో జెండా మోసిన వారికి పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నారు. నిజానికి కెసిఆర్ హయాంలో ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఉన్న గుర్తింపు పార్టీలో ఉన్న వారికి లేకుండా పోయింది అన్న వాదన బలంగా వినిపించింది. జెండా మోసి, ఉద్యమ సమయంలో నిరసన వ్యక్తం చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన వారిని పక్కన పెట్టారన్న చర్చ కూడా నడిచింది. ఇది తీవ్ర అసంతృప్తికి దారి తీసింది.
అదేవిధంగా కుటుంబ పాలన ముద్ర కూడా కేసీఆర్ పై పడింది. ఇక అవినీతి ఆరోపణలు, ఇతర అంశాలు కూడా ప్రభావం చూపించాయి. ఈ క్రమంలో ఇప్పటికైనా పార్టీని ప్రక్షాళన చేయకపోతే కవితతో పాటు ప్రస్తుత ప్రభుత్వ ప్రభావాన్ని కూడా ఎదుర్కొనలేని పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యం లేదన్న బలమైన చర్చ నడుస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకొని బీఆర్ఎస్ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలనేది పార్టీ తీసుకున్న నిర్ణయం అని తెలుస్తోంది.
ఈ క్రమంలోని మండల, జిల్లా స్థాయిలో నాయకత్వం మార్పు దిశగా త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. తద్వారా వచ్చే ఎన్నికల నాటికి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేదిశగా అడుగులు పడుతున్నాయి. మరి ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.
This post was last modified on April 13, 2026 6:38 pm
ఆయా షేర్ అంటూ పాటల నుంచే సంచలనాలు మొదలుపెట్టిన ది ప్యారడైజ్ సినిమా దానికి తగ్గట్టే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్…
మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ) ఎన్నికలపై ప్రధాన పార్టీల కార్యకర్తల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. కార్పొరేషన్ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు…
అమెరికాలో గ్రీన్కార్డ్ కోసం ఎదురుచూస్తున్న కాగ్నిజెంట్ ఉద్యోగులకు మరో సమస్య ఎదురైంది. అమెరికా కార్మిక శాఖ కాగ్నిజెంట్ నుంచి వచ్చే…
ఐక్యరాజ్య సమితి విడుదల చేసిన కొత్త మ్యాప్ వివాదాస్పదంగా మారింది. భారత దేశంలో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ ని స్వతంత్ర…
కరోనా సమయంలో ‘‘భలే మంచి ఓటీటీ బేరము’’ అని పాడుకున్నాయి టాలీవుడ్ నిర్మాణ సంస్థలు. మిగతా భాషల చిత్రాలకు కూడా…
రాష్ట్రంలో కూటమి సర్కారు ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయింది. అయితే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్లీ అధికారం ఎవరికి దక్కుతుంది? అనే…