Movie News

ఇదే ‘కపుల్’.. మళ్లీ వేలంటైన్స్ డేకి

వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాయి. కానీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే ప్రేమకథా చిత్రం మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. రెండేళ్లకు పైగా సినిమానే చేయని సంతోష్ శోభన్, తన తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’తో షాక్ తిన్న మానస వారణాసి జంటగా తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ తొలి ప్రయత్నంగా రూపొందించిన చిత్రమిది.

యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఆ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. రెండు కోట్ల మేర గ్రాస్ కూడా కలెక్ట్ చేసింది శనివారం ఈ చిత్రం.

ఆదివారం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని.. ఆసక్తికర ప్రకటన చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీతో మళ్లీ తామే ఇంకో లవ్ స్టోరీ చేయబోతున్నామని.. వచ్చే వాలంటైన్స్ డేకే అది కూడా రిలీజవుతుందని ధీరజ్ తెలిపాడు. మామూలుగా సంక్రాంతి విషయంలో ఇలాంటి క్రేజ్ ఉంటుంది, ఇలా ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. కానీ ధీరజ్ మాత్రం వేలంటైన్స్ డేకి ఇదే కాంబినేషన్లో సినిమా ఉంటుందని.. అది కూడా లవ్ స్టోరీనే అని చెప్పాడు.

ఐతే దర్శకుడు కూడా అశ్వినేనా కాదా అన్నది మాత్రం ధీరజ్ వెల్లడించాడు. యువి అధినేతలతో కలిసి ఈ చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఐతే ఈలోపు సంతోష్ శోభన్, మానస వారణాసి కావాలంటే వేరే సినిమాలు చేసుకోవచ్చని.. కానీ వచ్చే ప్రేమికుల దినోత్సవానికి మాత్రం తమ కలయికలో సినిమా రిలీజవుతుందని చెప్పాడు.

This post was last modified on February 15, 2026 5:59 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

1 hour ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

2 hours ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

2 hours ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

6 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

8 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

9 hours ago