వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాయి. కానీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే ప్రేమకథా చిత్రం మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. రెండేళ్లకు పైగా సినిమానే చేయని సంతోష్ శోభన్, తన తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’తో షాక్ తిన్న మానస వారణాసి జంటగా తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ తొలి ప్రయత్నంగా రూపొందించిన చిత్రమిది.
యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఆ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. రెండు కోట్ల మేర గ్రాస్ కూడా కలెక్ట్ చేసింది శనివారం ఈ చిత్రం.
ఆదివారం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని.. ఆసక్తికర ప్రకటన చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీతో మళ్లీ తామే ఇంకో లవ్ స్టోరీ చేయబోతున్నామని.. వచ్చే వాలంటైన్స్ డేకే అది కూడా రిలీజవుతుందని ధీరజ్ తెలిపాడు. మామూలుగా సంక్రాంతి విషయంలో ఇలాంటి క్రేజ్ ఉంటుంది, ఇలా ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. కానీ ధీరజ్ మాత్రం వేలంటైన్స్ డేకి ఇదే కాంబినేషన్లో సినిమా ఉంటుందని.. అది కూడా లవ్ స్టోరీనే అని చెప్పాడు.
ఐతే దర్శకుడు కూడా అశ్వినేనా కాదా అన్నది మాత్రం ధీరజ్ వెల్లడించాడు. యువి అధినేతలతో కలిసి ఈ చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఐతే ఈలోపు సంతోష్ శోభన్, మానస వారణాసి కావాలంటే వేరే సినిమాలు చేసుకోవచ్చని.. కానీ వచ్చే ప్రేమికుల దినోత్సవానికి మాత్రం తమ కలయికలో సినిమా రిలీజవుతుందని చెప్పాడు.
This post was last modified on February 15, 2026 5:59 pm
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ కు ఒక అలవాటు ఉంది.. అదే 'స్లో స్టార్ట్ అండ్ డెడ్లీ ఫినిష్'. ఈ…
నాని ప్యారడైజ్ మీద అంచనాల గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ 21 విడుదల కోసం అభిమానులే కాదు మూవీ…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తో 40 ఏళ్ల బంధాన్ని వీడి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లో చేరిన సీనియర్…
ఒక డిజాస్టర్ పడితే చాలు దర్శకుడి ట్రాక్ రికార్డు గతంలో ఎంత ఉందనేది నిర్మాతలు పట్టించుకోరు. అందులోనూ వెటరన్ డైరెక్టర్స్…
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఏపీ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఏపీ సచివాలయంలో సెక్షన్ ఆఫీసర్ గా…