వేలంటైన్స్ డే వీకెండ్లో తెలుగులో మూడు పేరున్న చిత్రాలు రిలీజయ్యాయి. ఐతే అందులో ‘ఫంకీ’, ‘సీతాపయనం’ ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన తెచ్చుకోలేకపోయాయి. కానీ ‘కపుల్ ఫ్రెండ్లీ’ అనే ప్రేమకథా చిత్రం మాత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. రెండేళ్లకు పైగా సినిమానే చేయని సంతోష్ శోభన్, తన తొలి చిత్రం ‘దేవకీ నందన వసుదేవ’తో షాక్ తిన్న మానస వారణాసి జంటగా తమిళ దర్శకుడైన అశ్విన్ చంద్రశేఖర్ తొలి ప్రయత్నంగా రూపొందించిన చిత్రమిది.
యువి క్రియేషన్స్ అధినేతలతో కలిసి ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాడు. ముందు రోజు పెయిడ్ ప్రిమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజు ఆ చిత్రానికి మంచి ఆక్యుపెన్సీలు కనిపించాయి. రెండు కోట్ల మేర గ్రాస్ కూడా కలెక్ట్ చేసింది శనివారం ఈ చిత్రం.
ఆదివారం జరిగిన సక్సెస్ ప్రెస్ మీట్లో నిర్మాత ధీరజ్ మొగిలినేని.. ఆసక్తికర ప్రకటన చేశారు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీతో మళ్లీ తామే ఇంకో లవ్ స్టోరీ చేయబోతున్నామని.. వచ్చే వాలంటైన్స్ డేకే అది కూడా రిలీజవుతుందని ధీరజ్ తెలిపాడు. మామూలుగా సంక్రాంతి విషయంలో ఇలాంటి క్రేజ్ ఉంటుంది, ఇలా ముందుగానే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తుంటారు. కానీ ధీరజ్ మాత్రం వేలంటైన్స్ డేకి ఇదే కాంబినేషన్లో సినిమా ఉంటుందని.. అది కూడా లవ్ స్టోరీనే అని చెప్పాడు.
ఐతే దర్శకుడు కూడా అశ్వినేనా కాదా అన్నది మాత్రం ధీరజ్ వెల్లడించాడు. యువి అధినేతలతో కలిసి ఈ చిత్రాన్ని తానే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. ఐతే ఈలోపు సంతోష్ శోభన్, మానస వారణాసి కావాలంటే వేరే సినిమాలు చేసుకోవచ్చని.. కానీ వచ్చే ప్రేమికుల దినోత్సవానికి మాత్రం తమ కలయికలో సినిమా రిలీజవుతుందని చెప్పాడు.
This post was last modified on February 15, 2026 5:59 pm
గత వారం పది రోజులుగా తెరచాటునే ఉన్న `కోవా బన్` వివాదం.. రెండురోజుల నుంచి తీవ్రస్థాయిలో రాజకీయ రంగు పులుముకుంది.…
ఒక సినిమా ఫలితంలో దర్శకత్వం తర్వాత ప్రధానంగా బాధ్యత వహించే విభాగం ఎడిటింగ్. పైకి ఏదో కత్తిరింపులు అతికింపులు అనే…
మాస్ రాజా రవితేజ చివరి హిట్ ఏది అంటే ఆయన అభిమానులు కూడా తడుముకునే పరిస్థితి. 2022లో వచ్చిన ‘ధమాకా’…
నయనతార కథానాయికగా పరిచయం అయి రెండు దశాబ్దాలు దాటిపోయింది. ఇన్నేళ్ల తర్వాత కూడా తమిళ, తెలుగు భాషల్లో అగ్ర కథానాయికగా…
ఫీల్ గుడ్ ప్రేమకథలు సక్సెస్ కావాలంటే హీరో హీరోయిన్ల పెర్ఫార్మన్స్ చాలా కీలకం. ఏ ఒక్కరు తేడా చేసినా అవుట్…
రాష్ట్ర ప్రభుత్వం వద్ద భూములు లేవని.. ఎవరికీ ఇచ్చే పరిస్థితి కూడా లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం…