ఉత్కంఠ పోరుతో సాగుతుందనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నీరసంగా జరిగింది. 175 పరుగులు చేసిన భారత్ సేన.. పాక్ ను కేవలం 114 పరుగులకే చిత్తు చేసింది. నిజానికి మ్యాచ్ ఇంకొంచం త్వరగా ముగిచేది. హార్దిక్ బౌలింగ్ చేస్తున్న ఓవర్ లో కుల్దీప్ యాదవ్ ఆఖరి క్యాచ్ ను వదలడం వల్ల ఇంకాస్త సమయం పట్టింది.
అయితే ఈ క్యాచ్ వదిలే తరుణంలో కుల్దీప్ చేతిలో పడిన బంతి బౌండరీ అవతల పడి చేతులారా పాక్ కు సిక్స్ ఇచ్చినట్టయింది. దీంతో మ్యాచ్ అయిన వెంటనే హార్దిక్ కుల్దీప్ పై నిప్పులు చెరిగాడు. సహజంగానే హార్దిక్ ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉంటాడు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మరింత తీవ్రంగా స్పందిస్తాడు.
అతనికి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా కుల్దీప్ పై సీరియస్ కావడం మరింత చర్చకు దారి తీసింది. ఎంత గెలిచే మ్యాచ్ అయినా.. అంత నిర్లక్షం జట్టుకు మంచిది కాదని కొంతమంది అభిప్రాయం తెలుపుతుంటే మరి కొంతమంది మాత్రం ఇటువంటి పొరపాట్లు సహజమని, అందరి ముందు అలా అవమానించడం సరైన పద్ధతి కాదని ఖండిస్తున్నారు.
Image – Cricbuzz
This post was last modified on February 15, 2026 10:42 pm
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…