ఉత్కంఠ పోరుతో సాగుతుందనుకున్న ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ నీరసంగా జరిగింది. 175 పరుగులు చేసిన భారత్ సేన.. పాక్ ను కేవలం 114 పరుగులకే చిత్తు చేసింది. నిజానికి మ్యాచ్ ఇంకొంచం త్వరగా ముగిచేది. హార్దిక్ బౌలింగ్ చేస్తున్న ఓవర్ లో కుల్దీప్ యాదవ్ ఆఖరి క్యాచ్ ను వదలడం వల్ల ఇంకాస్త సమయం పట్టింది.
అయితే ఈ క్యాచ్ వదిలే తరుణంలో కుల్దీప్ చేతిలో పడిన బంతి బౌండరీ అవతల పడి చేతులారా పాక్ కు సిక్స్ ఇచ్చినట్టయింది. దీంతో మ్యాచ్ అయిన వెంటనే హార్దిక్ కుల్దీప్ పై నిప్పులు చెరిగాడు. సహజంగానే హార్దిక్ ఎప్పుడూ అగ్రెసివ్ గా ఉంటాడు. ఇలాంటి తప్పులు జరిగినప్పుడు మరింత తీవ్రంగా స్పందిస్తాడు.
అతనికి తోడు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా కుల్దీప్ పై సీరియస్ కావడం మరింత చర్చకు దారి తీసింది. ఎంత గెలిచే మ్యాచ్ అయినా.. అంత నిర్లక్షం జట్టుకు మంచిది కాదని కొంతమంది అభిప్రాయం తెలుపుతుంటే మరి కొంతమంది మాత్రం ఇటువంటి పొరపాట్లు సహజమని, అందరి ముందు అలా అవమానించడం సరైన పద్ధతి కాదని ఖండిస్తున్నారు.
Image – Cricbuzz
మెగాస్టార్ చిరంజీవి సినిమా రహస్యాలను లీక్ చేయడంలో ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. ‘ఆచార్య’ సినిమా టైటిల్ను అనుకోకుండా రివీల్…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి… టీడీపీ ఎమ్మెల్యే, టాలీవుడ్ అగ్ర నటుడు నందమూరి…
"ఏనుగు పోతుంటే చూడరు.. చీమ కుడితే గగ్గోలు పెడతారు" అనే సామెత రాజకీయాలకు కూడా సరిగ్గా సరిపోతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.…
ఇటీవలే విడుదలైన వంద దేవుళ్ళులో కథ మొత్తం ఆర్టిస్ట్ స్వసిక చుట్టూ నడుస్తుంది. భర్తను కోల్పోయి పెళ్లీడుకొచ్చిన ఇద్దరు పిల్లల…
కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…
అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…