సంక్రాంతి తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా ప్రత్యేకం. ఇక్కడలాగే అక్కడా ఈ పండక్కి భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఐతే ఈ ఏడాది విజయ్ సినిమా జననాయగన్తో తమిళ బాక్సాఫీస్ వేడెక్కిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో అందరి చూపూ శివకార్తికేయన్ సినిమా పరాశక్తి మీదే నిలిచాయి.
ఇరుది సుట్రు (తెలుగులో గురు), సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) లాంటి కల్ట్ మూవీస్ అందించిన సుధ కొంగర డైరెక్ట్ చేయడం.. జయం రవి విలన్ పాత్ర చేయడం.. శ్రీలీల కథానాయికగా నటించడం, వింటేజ్ టచ్ ఉన్న కథ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
ఐతే తమిళ క్రిటిక్స్ మాత్రం ఎప్పట్లాగే ఈ సినిమాను కూడా భుజానికెత్తుకుని మోశారు. 3 ప్లస్ రేటింగ్స్ ఇచ్చారు. సంక్రాంతికి రిలీజైన మిగతా సినిమాలన్నీ చిన్నవే కావడంతో దీనికే ఎక్కువ థియేటర్లను కొనసాగించారు.
హిందీ వ్యతిరేక ఉద్యమం.. తమిళుల ఆత్మాభిమానం, భాష, సంస్కృతి చుట్టూ తిరిగిన సినిమా కావడంతో తమిళ జనాలు ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. పీఆర్ టీమ్స్, తమిళ మీడియా వాళ్లు కూడా ఈ సినిమాకు హైప్ ఇస్తూనే సాగారు. కలెక్షన్లను కూడా పెంచి చూపిస్తూ బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేశారు. చివరికి చూస్తే.. పరాశక్తి పెద్ద డిజాస్టర్ అని తేలింది.
మూడో వారం నుంచి ఈ సినిమాకు వసూళ్లే లేవు. చెప్పుకోదగ్గ షేర్ రాలేదు. జీవా సినిమా తలైవర్ తంబి తలైమయిల్ దీనిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది. పరాశక్తి థియేట్రికల్ రన్ అయిపోవడంతో ఆ సినిమా లెక్కలన్నీ బయటికి వచ్చాయి.
ఈ చిత్రం మీద రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్లు రూ.85 కోట్లని తేలింది. షేర్ చూస్తే రూ.50 కోట్ల లోపే. అంటే పెట్టుబడిలో థియేటర్ల నుంచి వచ్చింది మూడో వంతు మాత్రమే. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కలుపుకున్నా కూడా నిర్మాతలకు భారీ నష్టం తప్పట్లేదు. కాబట్టి బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే ఇది డిజాస్టరే.
This post was last modified on February 2, 2026 10:27 am
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…