సంక్రాంతి తెలుగు వారికే కాదు.. తమిళులకూ చాలా ప్రత్యేకం. ఇక్కడలాగే అక్కడా ఈ పండక్కి భారీ చిత్రాలు రిలీజవుతుంటాయి. ఐతే ఈ ఏడాది విజయ్ సినిమా జననాయగన్తో తమిళ బాక్సాఫీస్ వేడెక్కిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ చిత్రం అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంది. దీంతో అందరి చూపూ శివకార్తికేయన్ సినిమా పరాశక్తి మీదే నిలిచాయి.
ఇరుది సుట్రు (తెలుగులో గురు), సూరారై పొట్రు (ఆకాశం నీ హద్దురా) లాంటి కల్ట్ మూవీస్ అందించిన సుధ కొంగర డైరెక్ట్ చేయడం.. జయం రవి విలన్ పాత్ర చేయడం.. శ్రీలీల కథానాయికగా నటించడం, వింటేజ్ టచ్ ఉన్న కథ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది.
ఐతే తమిళ క్రిటిక్స్ మాత్రం ఎప్పట్లాగే ఈ సినిమాను కూడా భుజానికెత్తుకుని మోశారు. 3 ప్లస్ రేటింగ్స్ ఇచ్చారు. సంక్రాంతికి రిలీజైన మిగతా సినిమాలన్నీ చిన్నవే కావడంతో దీనికే ఎక్కువ థియేటర్లను కొనసాగించారు.
హిందీ వ్యతిరేక ఉద్యమం.. తమిళుల ఆత్మాభిమానం, భాష, సంస్కృతి చుట్టూ తిరిగిన సినిమా కావడంతో తమిళ జనాలు ఈ సినిమా ఫ్లాప్ అని ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. పీఆర్ టీమ్స్, తమిళ మీడియా వాళ్లు కూడా ఈ సినిమాకు హైప్ ఇస్తూనే సాగారు. కలెక్షన్లను కూడా పెంచి చూపిస్తూ బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేశారు. చివరికి చూస్తే.. పరాశక్తి పెద్ద డిజాస్టర్ అని తేలింది.
మూడో వారం నుంచి ఈ సినిమాకు వసూళ్లే లేవు. చెప్పుకోదగ్గ షేర్ రాలేదు. జీవా సినిమా తలైవర్ తంబి తలైమయిల్ దీనిపై స్పష్టమైన ఆధిపత్యం చలాయించింది. పరాశక్తి థియేట్రికల్ రన్ అయిపోవడంతో ఆ సినిమా లెక్కలన్నీ బయటికి వచ్చాయి.
ఈ చిత్రం మీద రూ.150 కోట్ల బడ్జెట్ పెట్టారు నిర్మాతలు. వరల్డ్ వైడ్ ఈ సినిమాకు వచ్చిన గ్రాస్ కలెక్షన్లు రూ.85 కోట్లని తేలింది. షేర్ చూస్తే రూ.50 కోట్ల లోపే. అంటే పెట్టుబడిలో థియేటర్ల నుంచి వచ్చింది మూడో వంతు మాత్రమే. నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం కలుపుకున్నా కూడా నిర్మాతలకు భారీ నష్టం తప్పట్లేదు. కాబట్టి బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే ఇది డిజాస్టరే.
This post was last modified on February 2, 2026 10:27 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…