ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈ రోజు విడుదలవుతున్న ఆదిత్య 369 సరికొత్త హంగులతో థియేటర్లలో అడుగు పెట్టేసింది. ప్రమోషన్ల విషయంలో నిర్మాణ సంస్థ శ్రీదేవి మూవీస్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ఫలితాలు ఇచ్చేలాగే ఉంది. ఈ సినిమా కథకు కేంద్ర బిందువైన టైం మెషీన్ ని ప్రత్యేకంగా తయారు చేయించి హైదరాబాద్ ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రదర్శనకు ఉంచడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. టీవీ, యూట్యూబ్, ఓటిటిలో ఉచితంగా చూసే వెసులుబాటు ఉన్న ఒక పాత సినిమాకు ఇంత పబ్లిసిటీ చేయడం చిన్న విషయం కాదు. 4కె రెజల్యూషన్ కావడంతో ఫ్యాన్స్ బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు.
ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే దానికి స్వయంగా హీరో బాలకృష్ణ హాజరయ్యారు. గతంలో సింహాద్రికి ఇలాంటి వేడుక చేశారు కానీ దానికి జూనియర్ ఎన్టీఆర్ రాలేదు. విశ్వక్ సేన్ ని గెస్టుగా తీసుకొచ్చి కానిచ్చారు. కానీ ఆదిత్య 369 ఈ విషయంలోనూ ప్రత్యేకత సంతరించుకుంది. పోస్టర్లు, ట్రైలర్, సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన విశేషాలు, నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ఇస్తున్న ఇంటర్వ్యూలు ఆసక్తి పెరిగేలా చేశాయి. ఇప్పుడు టీనేజ్ లో ఉన్న కుర్రాళ్ళు, మూడు పదుల వయసులో ఉన్న యువకులు ఈ మూవీని థియేటర్లలో చూసి ఉండరు. అనుభూతి చెందడానికి ఇదో మంచి అవకాశం.
ఇండియాలోనో మొదటి సైన్స్ ఫిక్షన్ గా పేరు తెచ్చుకున్న ఆదిత్య 369లో బాలకృష్ణ డ్యూయల్ రోల్, ఇళయరాజా అద్భుతమైన పాటలు బీజీఎమ్, అమ్రిష్ పూరి విలనీ, తెలుగు తెరకు అప్పటిదాకా పరిచయం లేని కాలయంత్రమనే కొత్త కాన్సెప్ట్ ఇవన్నీ కలిసి ఆడియన్స్ ని థ్రిల్ చేశాయి. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తన కెరీర్ బెస్ట్ చిత్రాల్లో దీనికి ప్రత్యేక స్థానం ఇస్తారు. ఈ సినిమాకు సీక్వెల్ గా ఆదిత్య 999 తీస్తామని, త్వరలోనే దానికి సంబంధించిన ప్రకటన ఉంటుందని పలు సందర్భాల్లో చెబుతూ వచ్చిన బాలకృష్ణ ఈ ఏడాది లేదా వచ్చే సంవత్సరం స్వీయ దర్శకత్వంలోనే తెరకెక్కించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
This post was last modified on April 4, 2025 10:35 am
ఏపీ ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వాన్ని చక్కటి సమన్వయంతో ముందుకు నడిపిస్తున్న చంద్రబాబుకు 10 నెలలు పూర్తయ్యాయి. గత ఏడాది జూన్…
వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీకి చెందిన చాలా మంది నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. వాటిలో టీడీపీ…
యాంకర్ గా ఒకవైపు కెరీర్ నడిపించుకుంటూనే అప్పుడప్పుడు సోలో హీరోగా సినిమాలు చేసుకుంటున్న సుడిగాలి సుధీర్ తాజాగా ఒక వివాదంలో…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ మంగళవారం ఉదయం అగ్ని ప్రమాదంలో…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బుధవారం ఏపీ హైకోర్టు షాకిచ్చింది. అక్రమ మైనింగ్ కేసులో…
ఏప్రిల్ 25 నుంచి వాయిదా పడ్డాక కన్నప్ప ఎప్పుడు వస్తుందనే దాని గురించి మంచు ఫ్యాన్స్ కన్నా ప్రభాస్ అభిమానులు…