ఎంత హీరోలతో పని చేస్తున్నా సరే ఆయా దర్శకులకు అంత సులభంగా వాళ్ళ ప్రేమ, అభిమానం దొరకదు. ఒక్కసారి దాన్ని దక్కించుకున్నారంటే ఆకాశమే హద్దుగా అది పెరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు కె విశ్వనాథ్ – కమల్ హాసన్, కోదండరామిరెడ్డి – చిరంజీవి, కోడి రామకృష్ణ – బాలకృష్ణ లాంటి జంట ద్వయాలను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు బుచ్చిబాబు కూడా అలాంటి అదృష్టానికి నోచుకున్నాడు. ఇటీవలే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తనకో అపురూప కానుక అందింది. పవిత్రమైన దేవుడి పాదుకలు కూడిన హనుమాన్ చాలీసా బాక్సులో పొందుపరిచి చరణ్, ఉపాసన తనకు పంపించారు.
అందులో ఒక లేఖ ఉంది. నా జీవితంలో క్లిష్టమైన సందర్భాల్లో హనుమంతుడు తనకు తోడుగా ఉన్నాడని, నలభై పడిలో అడుగు పెడుతున్న తనకు ఈ సందర్భంగా నీతో ఆ బలాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో ఇది పంపుతున్నానని రామ్ చరణ్ సంతకం చేయడం విశేషం. ఉపాసన, చరణ్ సంయుక్తంగా రాసిన మరో లెటర్ లో కూడా వాళ్ళెంత బుచ్చిబాబుని అభిమానిస్తున్నారో అందులో వ్యక్త పరిచారు. ఇంత బహిరంగంగా కేవలం ఒక్క సినిమా అనుభవమున్న దర్శకుడిని చరణ్ నమ్మడం ఇదే మొదటిసారని చెప్పాలి. అసలు పెద్ది ఇంకా రిలీజ్ కాకుండానే ఈ స్థాయిలో బాండింగ్ ఏర్పడటం ఘనతే.
ఇప్పుడు అందరి కళ్ళు ఏప్రిల్ 8 శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ కాబోయే పెద్ది టీజర్ మీద ఉన్నాయి. నిర్మాత రవిశంకర్ ఇప్పటికే దీని గురించి ఓ రేంజ్ లో ఊరించారు. ఒక్క షాట్ ని వెయ్యి సార్లు చూస్తారనే మాట అభిమానుల అంచనాలను ఎక్కడికో తీసుకెళ్లాయి. బుచ్చిబాబు మీద మెగా ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ అంతకు మించే ఉంది. గేమ్ ఛేంజర్ గాయాన్ని పూర్తిగా మాన్పే గొప్ప సినిమా ఇస్తాడని ఎదురు చూస్తున్న వైనం సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ విలేజ్ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా శివరాజ్ కుమార్ క్యామియో చాలా ప్రత్యేకంగా ఉంటుందట.
This post was last modified on April 4, 2025 10:41 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…