Political News

పవన్ సహా కీలక మంత్రుల బ్లాక్ లో అగ్ని కీలలు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అగ్ని కీలలు చుట్టుముట్టేశాయి. ప్రమాదం జరిగిన గదిలోని పరికరాలన్నింటినీ అగ్ని కీలలు దహించి వేశాయి. ఈ ప్రమాదం చోటుచేసుకున్న బ్లాక్ లోనే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీ ఉంది. అయితే ప్రమాదం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ కావడంతో పవన్ పేషికేమీ నష్టం వాటిల్లలేదు.

సచివాలయంలోని రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీ ఉంది. పవన్ ఫేషీతో పాటుగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరుల పేషీలు ఉన్నాయి. ఈ లెక్కన కీలక శాఖల మంత్రుల పేషీలన్నీ కూడా ఈ బ్లాక్ లోనే ఉన్నాయి. నిప్పు రవ్వలు ఎక్కడి నుంచి పడ్డాయో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఆ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుండి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి.

సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాటరీలు పెట్టే గదిలో ఈ ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. బ్యాటరీల కారణంగానే మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే…హోం మంత్రి అనిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. అంతేకాకుండా జరిగిన నష్టంపైనా ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Satya

Recent Posts

అర్జున్ సినిమాని ఎగబడి చూస్తారు

మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…

48 minutes ago

గుర్తుకొస్తున్నాయి…: పవన్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్‌తో పాటు కనిపిస్తున్నది…

2 hours ago

షో క్యాన్సిల్ చేసినందుకు కొరడా దెబ్బ

సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…

2 hours ago

సిట్ అదుపులో CI నాగరాజు

ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…

2 hours ago

వెంటిలేటర్ పై ఉన్న పద్మనాభం గుర్తు లేరా జగన్?

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…

3 hours ago

ఓడిన చోటే గెలిచి చూపించింది

శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…

4 hours ago