హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు పూర్తి చేసుకుని మరో బ్లాస్టింగ్ మూవీ కోసం రెడీ అవుతున్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కొన్ని వారాల క్రితం అఖండ 2కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో మొట్టమొదటి సీక్వెల్ గా దీని మీద మామూలు అంచనాలు లేవు.
ఇటీవలే డాకూ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ ఇంటర్వెల్ కే మీ టికెట్ డబ్బులకు న్యాయం జరుగుతుందని చెప్పడం చూస్తే కంటెంట్ ఏ రేంజ్ లో డిజైన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లి మరీ కొన్ని సీన్లు షూట్ చేసుకు రావడం బట్టి అఘోరా విశ్వరూపం పదింతలు ఎక్కువ ఉంటుందని అనిపిస్తోంది.
తాజాగా అఖండ 2లో ఒక అనూహ్యమైన మార్పు జరిగినట్టు సమాచారం. హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని లాక్ చేశారని తెలిసింది. ముందైతే ప్రగ్య జైస్వాల్ నే అనుకున్నారు. ఓపెనింగ్ పూజ కి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు తన స్థానంలో సంయుక్తని తీసుకొచ్చారని ఫిలిం నగర్ టాక్.
కథ ప్రకారమైతే చిన్న బాలయ్య భార్యగా ప్రగ్యకు మొదటి భాగంలో బాగానే ప్రాధాన్యం దక్కింది. వీళ్ళ కూతురిని కాపాడే బాధ్యతే అఘోరాగా పెద్ద బాలయ్య తీసుకుంటాడు. ఇక్కడ అఖండ 1 ముగిసింది. రెండో భాగంలో ఆ పాప పెద్దయ్యాక ఏర్పడ్డ ప్రమాదాలను ఎలా కాచుకుంటారనే దాని మీద రెండో పార్ట్ ని సిద్ధం చేశారని ఆల్రెడీ ఒక లీక్ ఉంది.
సో సంయుక్త పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. కారణం ఏదైనా ఈ అమ్మాయికిది పెద్ద ఆఫరని చెప్పాలి. సీనియర్ హీరోలతో ఇప్పటిదాకా తను జట్టు కట్టలేదు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నిఖిల్, ధనుష్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లతో కలిసి నటించింది. కానీ నిన్నటి జనరేషన్ స్టార్లతో మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది.
క్యారెక్టర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. సెప్టెంబర్ 25 విడుదల తేదీ లాక్ చేసుకున్న అఖండ 2 తాండవంని ఆ డేట్ కే రిలీజ్ చేసేందుకు టీమ్ పక్కా ప్లానింగ్ తో ఉంది. ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల మార్పులు జరిగితే చెప్పలేం కానీ లేదంటే దసరా పండక్కు బాలయ్య మాస్ చూడొచ్చు.
This post was last modified on January 24, 2025 2:57 pm
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…
ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు ఎగ్గొట్టిన మాజీ సీఎం జగన్…తాపీగా ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. బడ్జెట్ లో…
ఫంకీ ఫలితం త్వరగా తేలిపోవడంతో హీరో విశ్వక్ సేన్, నిర్మాణ సంస్థ సితార హఠాత్తుగా సైలెంటైపోయాయి. ఊరికే లేనిపోని హడావిడి…
వైసీపీ మాజీ ఎంపీ, ఆ పార్టీ మాజీ నేత రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారం జగన్ హయాంలో దేశవ్యాప్తంగా సంచలనం…