Movie News

అఖండ 2లో అనూహ్యమైన మార్పు

హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లు పూర్తి చేసుకుని మరో బ్లాస్టింగ్ మూవీ కోసం రెడీ అవుతున్న బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శీను కొన్ని వారాల క్రితం అఖండ 2కి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. బాలయ్య కెరీర్ లో మొట్టమొదటి సీక్వెల్ గా దీని మీద మామూలు అంచనాలు లేవు.

ఇటీవలే డాకూ సక్సెస్ మీట్ లో తమన్ మాట్లాడుతూ ఇంటర్వెల్ కే మీ టికెట్ డబ్బులకు న్యాయం జరుగుతుందని చెప్పడం చూస్తే కంటెంట్ ఏ రేంజ్ లో డిజైన్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రయాగరాజ్ కుంభమేళాకు వెళ్లి మరీ కొన్ని సీన్లు షూట్ చేసుకు రావడం బట్టి అఘోరా విశ్వరూపం పదింతలు ఎక్కువ ఉంటుందని అనిపిస్తోంది.

తాజాగా అఖండ 2లో ఒక అనూహ్యమైన మార్పు జరిగినట్టు సమాచారం. హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని లాక్ చేశారని తెలిసింది. ముందైతే ప్రగ్య జైస్వాల్ నే అనుకున్నారు. ఓపెనింగ్ పూజ కి కూడా వచ్చింది. కానీ ఇప్పుడు తన స్థానంలో సంయుక్తని తీసుకొచ్చారని ఫిలిం నగర్ టాక్.

కథ ప్రకారమైతే చిన్న బాలయ్య భార్యగా ప్రగ్యకు మొదటి భాగంలో బాగానే ప్రాధాన్యం దక్కింది. వీళ్ళ కూతురిని కాపాడే బాధ్యతే అఘోరాగా పెద్ద బాలయ్య తీసుకుంటాడు. ఇక్కడ అఖండ 1 ముగిసింది. రెండో భాగంలో ఆ పాప పెద్దయ్యాక ఏర్పడ్డ ప్రమాదాలను ఎలా కాచుకుంటారనే దాని మీద రెండో పార్ట్ ని సిద్ధం చేశారని ఆల్రెడీ ఒక లీక్ ఉంది.

సో సంయుక్త పాత్ర ప్రస్తుతానికి సస్పెన్స్. కారణం ఏదైనా ఈ అమ్మాయికిది పెద్ద ఆఫరని చెప్పాలి. సీనియర్ హీరోలతో ఇప్పటిదాకా తను జట్టు కట్టలేదు. సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, నిఖిల్, ధనుష్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ లతో కలిసి నటించింది. కానీ నిన్నటి జనరేషన్ స్టార్లతో మాత్రం ఇదే మొదటిసారి అవుతుంది.

క్యారెక్టర్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. సెప్టెంబర్ 25 విడుదల తేదీ లాక్ చేసుకున్న అఖండ 2 తాండవంని ఆ డేట్ కే రిలీజ్ చేసేందుకు టీమ్ పక్కా ప్లానింగ్ తో ఉంది. ఏదైనా పరిస్థితుల ప్రభావం వల్ల మార్పులు జరిగితే చెప్పలేం కానీ లేదంటే దసరా పండక్కు బాలయ్య మాస్ చూడొచ్చు.

This post was last modified on January 24, 2025 2:57 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

30 minutes ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

2 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

2 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago