Movie News

రెహమాన్ వదిలిపెట్టే సమస్యే లేదు!!

సోషల్ మీడియాలో ఏదైనా పుకారు మొదలైందంటే క్షణాల్లో ఊరువాడా దాటేసి ప్రపంచం మొత్తానికి చేరిపోతోంది. అది నిజమో కాదో అర్థం చేసుకునేలోపే డ్యామేజవుతున్న సందర్భాలు బోలెడు. తాజాగా రామ్ చరణ్ 16 నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్నారనే వార్త మెగా ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది.

షూటింగ్ గాడిలో పడుతున్న టైంలో ఇలాంటి షాక్ ఏంటని టెన్షన్ పడ్డారు. కానీ అలాంటిదేమీ లేదని యూనిట్ మాట. రెహమాన్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ వస్తున్నాడనేది ఎవరో కావాలని పుట్టించారని, మూడు పాటలు రెహమాన్ రికార్డింగ్ చేశాక నిర్ణయం మార్చుకునే సమస్యే ఉండదని చెబుతున్నారు.

ఇందులో లాజిక్ ఉంది. రెహమాన్ పని మొదలుపెట్టాక అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులు చాలా అరుదు. ఇటీవలే సూర్య 45 నుంచి తప్పుకున్నది నిజమే. కానీ దానికసలు మ్యూజిక్ సిట్టింగ్స్ జరగలేదు. వ్యక్తిగత కారణాల వల్ల దానికి టైం కేటాయించలేనని భావించి డ్రాప్ అయ్యాడు. కానీ ఆర్సి 16కి ఆ సమస్య లేదు.

గత ఏడాది మూడు సాంగ్స్ అయిపోయాయి. వాటి చిత్రీకరణ కూడా త్వరలోనే జరగనుంది. సగం ఆల్బమ్ తన పేరు, మిగిలిన సగం ఇంకొకరికి షేర్ చేసే ఉద్దేశం రెహమాన్ కు ఎప్పుడూ ఉండదు. అందులోనూ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ విపరీతంగా నచ్చేసింది కాబట్టి వద్దనే ఛాన్స్ ఉండదు.

అసలే గేమ్ ఛేంజర్ ఫలితం నుంచి మెల్లగా కోలుకుంటున్న అభిమానుల ఆశలన్నీ ఆర్సి 16 మీదే ఉన్నాయి. స్టోరీ లీక్స్, బయట పలు సందర్భాల్లో బుచ్చిబాబు ఇచ్చిన ఎలివేషన్స్, పెద్ద క్యాస్టింగ్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాలను టీమ్ పరిశీలనలో పెట్టింది.

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విలేజ్ డ్రామాకు పెద్ది అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇదే ఫైనల్ అయినా ఆశ్చర్యం లేదు. శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి భారీ తారాగణం ఆర్సి 16లో భాగం పంచుకుంటున్నారు. రంగస్థలం తరహా నేపథ్యం ఉంటుందట.

This post was last modified on January 24, 2025 2:32 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఐమాక్స్ వస్తే మన పరిస్తితి కూడా ఇంతేనా?

దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…

1 hour ago

పవన్ చొరవతో తెలంగాణ ఆలయానికి రూ.30 కోట్లు?

జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…

3 hours ago

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

3 hours ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

3 hours ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

4 hours ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

4 hours ago