సోషల్ మీడియాలో ఏదైనా పుకారు మొదలైందంటే క్షణాల్లో ఊరువాడా దాటేసి ప్రపంచం మొత్తానికి చేరిపోతోంది. అది నిజమో కాదో అర్థం చేసుకునేలోపే డ్యామేజవుతున్న సందర్భాలు బోలెడు. తాజాగా రామ్ చరణ్ 16 నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్నారనే వార్త మెగా ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది.
షూటింగ్ గాడిలో పడుతున్న టైంలో ఇలాంటి షాక్ ఏంటని టెన్షన్ పడ్డారు. కానీ అలాంటిదేమీ లేదని యూనిట్ మాట. రెహమాన్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ వస్తున్నాడనేది ఎవరో కావాలని పుట్టించారని, మూడు పాటలు రెహమాన్ రికార్డింగ్ చేశాక నిర్ణయం మార్చుకునే సమస్యే ఉండదని చెబుతున్నారు.
ఇందులో లాజిక్ ఉంది. రెహమాన్ పని మొదలుపెట్టాక అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులు చాలా అరుదు. ఇటీవలే సూర్య 45 నుంచి తప్పుకున్నది నిజమే. కానీ దానికసలు మ్యూజిక్ సిట్టింగ్స్ జరగలేదు. వ్యక్తిగత కారణాల వల్ల దానికి టైం కేటాయించలేనని భావించి డ్రాప్ అయ్యాడు. కానీ ఆర్సి 16కి ఆ సమస్య లేదు.
గత ఏడాది మూడు సాంగ్స్ అయిపోయాయి. వాటి చిత్రీకరణ కూడా త్వరలోనే జరగనుంది. సగం ఆల్బమ్ తన పేరు, మిగిలిన సగం ఇంకొకరికి షేర్ చేసే ఉద్దేశం రెహమాన్ కు ఎప్పుడూ ఉండదు. అందులోనూ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ విపరీతంగా నచ్చేసింది కాబట్టి వద్దనే ఛాన్స్ ఉండదు.
అసలే గేమ్ ఛేంజర్ ఫలితం నుంచి మెల్లగా కోలుకుంటున్న అభిమానుల ఆశలన్నీ ఆర్సి 16 మీదే ఉన్నాయి. స్టోరీ లీక్స్, బయట పలు సందర్భాల్లో బుచ్చిబాబు ఇచ్చిన ఎలివేషన్స్, పెద్ద క్యాస్టింగ్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాలను టీమ్ పరిశీలనలో పెట్టింది.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విలేజ్ డ్రామాకు పెద్ది అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇదే ఫైనల్ అయినా ఆశ్చర్యం లేదు. శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి భారీ తారాగణం ఆర్సి 16లో భాగం పంచుకుంటున్నారు. రంగస్థలం తరహా నేపథ్యం ఉంటుందట.
This post was last modified on January 24, 2025 2:32 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…