సోషల్ మీడియాలో ఏదైనా పుకారు మొదలైందంటే క్షణాల్లో ఊరువాడా దాటేసి ప్రపంచం మొత్తానికి చేరిపోతోంది. అది నిజమో కాదో అర్థం చేసుకునేలోపే డ్యామేజవుతున్న సందర్భాలు బోలెడు. తాజాగా రామ్ చరణ్ 16 నుంచి సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తప్పుకున్నారనే వార్త మెగా ఫ్యాన్స్ లో ఖంగారు పుట్టించింది.
షూటింగ్ గాడిలో పడుతున్న టైంలో ఇలాంటి షాక్ ఏంటని టెన్షన్ పడ్డారు. కానీ అలాంటిదేమీ లేదని యూనిట్ మాట. రెహమాన్ స్థానంలో దేవిశ్రీ ప్రసాద్ వస్తున్నాడనేది ఎవరో కావాలని పుట్టించారని, మూడు పాటలు రెహమాన్ రికార్డింగ్ చేశాక నిర్ణయం మార్చుకునే సమస్యే ఉండదని చెబుతున్నారు.
ఇందులో లాజిక్ ఉంది. రెహమాన్ పని మొదలుపెట్టాక అర్ధాంతరంగా వదిలేసిన ప్రాజెక్టులు చాలా అరుదు. ఇటీవలే సూర్య 45 నుంచి తప్పుకున్నది నిజమే. కానీ దానికసలు మ్యూజిక్ సిట్టింగ్స్ జరగలేదు. వ్యక్తిగత కారణాల వల్ల దానికి టైం కేటాయించలేనని భావించి డ్రాప్ అయ్యాడు. కానీ ఆర్సి 16కి ఆ సమస్య లేదు.
గత ఏడాది మూడు సాంగ్స్ అయిపోయాయి. వాటి చిత్రీకరణ కూడా త్వరలోనే జరగనుంది. సగం ఆల్బమ్ తన పేరు, మిగిలిన సగం ఇంకొకరికి షేర్ చేసే ఉద్దేశం రెహమాన్ కు ఎప్పుడూ ఉండదు. అందులోనూ దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన కథ విపరీతంగా నచ్చేసింది కాబట్టి వద్దనే ఛాన్స్ ఉండదు.
అసలే గేమ్ ఛేంజర్ ఫలితం నుంచి మెల్లగా కోలుకుంటున్న అభిమానుల ఆశలన్నీ ఆర్సి 16 మీదే ఉన్నాయి. స్టోరీ లీక్స్, బయట పలు సందర్భాల్లో బుచ్చిబాబు ఇచ్చిన ఎలివేషన్స్, పెద్ద క్యాస్టింగ్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తున్నాయి. వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది దసరాకే రిలీజ్ చేసే సాధ్యాసాధ్యాలను టీమ్ పరిశీలనలో పెట్టింది.
జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ విలేజ్ డ్రామాకు పెద్ది అనే వర్కింగ్ టైటిల్ పెట్టుకున్నారు. ఇదే ఫైనల్ అయినా ఆశ్చర్యం లేదు. శివరాజ్ కుమార్, జగపతిబాబు లాంటి భారీ తారాగణం ఆర్సి 16లో భాగం పంచుకుంటున్నారు. రంగస్థలం తరహా నేపథ్యం ఉంటుందట.
This post was last modified on January 24, 2025 2:32 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…