Political News

అందరికీ ఈ జిల్లా నేతలు ఆదర్శం… ఎందుకంటే?

నిజమే… తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన రాజకీయ నేతలు అందరికీ ఆదర్శమని చెప్పాలి. ఎందుకంటే.. పార్టీలు వేరైనా… తమ జిల్లా విషయానికి వచ్చేసరికి వారంతా ఏకతాటిపైకి వచ్చేస్తారు. అందరూ ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతారు. ఫలితంగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వారు జిల్లాకు కావాల్సిన మేర నిధులు సాధించుకుంటారు. పనులూ నిర్ణీత సమయంలోగానే పూర్తి చేసుకుంటారు. ఇక రాజకీయ వైరం అంటారా?…అది ఎన్నికల వరకేనట. ఆ తర్వాత జిల్లా సమగ్రాభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేస్తామని ఆ జిల్లా నేతలు చెబుతున్నారు.

కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలు ఇప్పుడు రాష్ట్రంలోని 3 ప్రధాన పార్టీల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక ఇదే జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ రాష్ట్ర కేబినెట్ లో కీలక మంత్రిగా కొనసాగుతున్నారు. మరోవైపు కరీంనగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న గంగుల కమలాకర్ బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన మంత్రిగా కూడా కొనసాగారు.

ఇలా ఈ మూడు పార్టీలకు చెందిన కీలక నేతల మధ్య అంతటి సఖ్యత ఎప్పుడు కనిపించిందంటే.. కరీంనగర్ లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ శుక్రవారం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక మీద ఖట్టర్ తో పాటు స్థానిక ఎంపీ హోదాలో కేంద్ర మంత్రి బండి సంజయ్, స్థానిక ఎమ్మెల్యే హోదాలో గంగుల కమలాకర్, జిల్లాకు చెందిన మంత్రి హోదాలో పొన్నం ప్రభాకర్య ఆసీనులయ్యారు. ఇక తెలంగాణ కేబినెట్ లో మరో కీలక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా ఈ వేదిక మీద కనిపించారు.

ఈ సందర్భంగా మైకు అందుకున్న బండి సంజయ్… తనకూ పొన్నం ప్రభాకర్ కు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని ప్రకటించారు. అదే సమయంలో గంగుల కమలాకర్ తో కొంత గ్యాప్ ఉండేదని, అది కూడా ఈ సమావేశంతో పోయినట్టేనని వ్యాఖ్యానించారు. మొత్తంగా పార్టీలు వేరైనా పొన్నం, గంగులలతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని, ఇకపై రాదని కూడా బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. అంతటితో ఆగని బండి… తమ మధ్య ఉన్న స్నేహ బంధాన్ని పొరుగు జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి ఎప్పుడో గమనించారని కూడా అన్నారు. ఖమ్మం జిల్లాలో నిత్యం పార్టీల మధ్య గొడవలు జరుగుతాయని, కరీంనగర్ లో అలాంటి గొడవలే ఉండవని పొంగులేటి గతంలో చాలా సార్లు వ్యాఖ్యానించారని కూడా సంజయ్ గుర్తు చేశారు. సంజయ్ నోట ఈ వ్యాఖ్యలు విన్నంతనే సభకు హాజరైన జనం చప్పట్లతో తమ నేతలకు అభివాదం తెలిపారు.

This post was last modified on January 24, 2025 3:33 pm

Share
Show comments

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

30 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

59 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

లోకేష్ కోసం వెళ్ళని చంద్రబాబు ఏపీ కోసం వచ్చారు

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago