పోయే ప్రాణం ఊరికే పోదు. అందుకు కారణమైనోడి సంగతి తేలుస్తుంది. అందుకే..అర్థాంతంగా చచ్చిపోయినోళ్లు అందుకు కారణమైనోళ్లు చట్టం కంట్లో ఏదోలాపడటం మామూలే. అయినా.. ఒక మనిషితో కలిసి ఉండటం ఇష్టం లేకుంటే.. విడిగా వచ్చేసి బతికేస్తే సరిపోతుంది. లేదంటే.. చట్టబద్ధంగా విడాకులు తీసుకున్నా అక్కడితో ఆ విషయం ముగుస్తుంది. అంతేకానీ.. ఏ మాత్రం తప్పు చేయని వారిని చంపేయటానికి మించిన దుర్మార్గం మరొకటి ఉండదు. ఇటీవల కాలంలో పరాయి మోజులో …
Read More »కోడి చేసిన మర్డర్..
ఇదో సంచలనం! విస్మయకరం! కోడి పుంజు.. అనే జీవి.. ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిందట! సదరు వ్యక్తి పొట్టలో కత్తి పెట్టి పొడిచి పొడిచి చంపిందట!! దీంతో దానిని వెంటనే అరెస్టు చేసి కేసు కట్టేశారట.. మన పోలీసులు. ఇక, ఇతర కేసుల్లో ఇంత ఫాస్ట్గా ఉంటారో ఉండరో తెలియదు కానీ.. ఈ కేసులో మాత్రం చాలా ఫాస్ట్గా FIR కట్టేశారు. అంతేకాదు.. సదరు వ్యక్తిని హత్య చేసినందున …
Read More »కేసు ఓడిపోయిన నీరవ్ మోడీ.. భారత్కు రాక తప్పదు
భారత బ్యాంకుల దగ్గర వేల కోట్ల అప్పులు తీసుకోవడం.. వాటిని తిరిగి చెల్లించకుండా విదేశాలకు పారిపోవడం.. అక్కడి కోర్టులకు ఏవేవో కారణాలు చెప్పి కేసులను సాగదీయడం.. ఇండియాకు చిక్కకుండా తప్పించుకోవడం.. ఇదీ కొందరు ఘరానా మోసగాళ్ల తీరు. ఈ విషయంలో విజయ్ మాల్యా దారి చూపిస్తే అతణ్ని అనుసరిస్తూ మరో వైట్ కాలర్ మోసగాడు నీరవ్ మోదీ కొన్నేళ్ల కింద బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి యూకేకు పారిపోయి అక్కడే …
Read More »ఒట్టి చేతులతో చిరుతను చంపేశాడు
ఒక మనిషి చిరుత చేతికి చిక్కాడంటే అంతే సంగతులు. చేతిలో ఏదైనా ఆయుధం ఉన్నా కూడా ప్రాణాలతో బయటపడటం కష్టమే. అలాంటిది ఒట్టి చేతులతో ఒక మనిషి చిరుతను చంపేశాడంటే నమ్మశక్యంగా అనిపించదు. అతనేమీ అడవుల్లో జంతువులతో తిరిగే టార్జాన్ టైపూ కాదు. మన మధ్య తిరిగే ఒక సామాన్యుడు. పైగా నడి వయస్కుడు. ఆ యోధుడి పేరు.. రాజగోపాల్ నాయక్. కర్ణాటకకు చెందిన ఈ వ్యక్తి తన భార్యా …
Read More »పెళ్లి పేరు చెప్పి రూ.11 కోట్లు కొట్టేసిన కిలేడీ
చూసినంతనే ఆకట్టుకునే రూపం. దానికి తగ్గట్లు ఆహార్యం.. స్టైల్ గా ఉండే ఆమె చేసిన మోసం గురించి తెలిసిన పోలీసులు సైతం షాక్ తింటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటమే కాదు.. ఒక వ్యక్తి వద్ద నుంచి ఏకంగా రూ.11 కోట్లు నాకించేసిన వైనం సంచలనంగా మారింది.హైదరాబాద్ శివారులోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జల్సాలకు …
Read More »ఘట్కేసర్: కిడ్నాప్ డ్రామా ఆడి చివరికి ఆత్మహత్య
సంచలనం రేపిన ఘట్కేసర్ విద్యార్థిని వ్యవహారం చివరికి విషాదాంతం అయింది. తనను నలుగురు ఆటోడ్రైవర్లు కిడ్నాప్ చేశారని, అత్యాచారానికి పాల్పడ్డారని రెండు వారాల కిందట ఘట్కేసర్కు చెందిన బీఫార్మసీ విద్యార్థిని ఆరోపించడం, చివరికి ఆమె చెప్పిందంతా కట్టుకథ అని పోలీసులు తేల్చడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి తీవ్ర విమర్శల పాలైన విద్యార్థిని తదనంతర పరిణామాలతో తీవ్రంగా కలత చెంది ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె సోమవారం …
Read More »అమెరికాపై కరోనా దెబ్బ మామూలుగా లేదుగా
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బ అగ్రరాజ్యం అమెరికా మీద మామూలుగా పడలేదు. యావత్ ప్రపంచంలో కరోనా దెబ్బకు బాగా దెబ్బతిన్న దేశం ఏదైనా ఉంటే అమెరికాను మొదట చెప్పుకోవాలి. అగ్రరాజ్యంలో కరోనా దెబ్బకు సుమారు 2.8 కోట్లమంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. ఇదే సమయంలో 5 లక్షలమంది చనిపోయారు. ఇవి కాకుండా సుమారు 4 కోట్లమందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోయారు. ఒక ప్రాణాంతక వైరస్ కారణంగా అమెరికా …
Read More »వేలంలో సన్రైజర్స్.. జోకులే జోకులు
ఇండియన్ ప్రిమియర్ లీగ్ కొత్త సీజన్ ముంగిట ప్రతిసారీ వేలం జరగడం మామూలే. ముందు ఏడాది ఫెయిలైన ఆటగాళ్లు కొందరిని విడిచిపెట్టి ఆ స్థానాలను భర్తీ చేసుకోవడం కోసం, అలాగే కొత్త అవసరాల కోసం ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంఛైజీలు సిద్ధమవుతాయి. ఈ సారి నిజానికి మూడేళ్లకోసారి జరిగే మెగా వేలం నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా గత సీజన్ వాయిదా పడి అక్టోబరులో జరగడం, తర్వాతి ఐపీఎల్కు …
Read More »ఆర్సీబీ బాగుపడదా.. ఫెయిల్యూర్ ప్లేయర్కి 14.25 కోట్లు
పేరు గొప్ప ఊరు దిబ్బ.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్థానానికి ఈ సామెత చక్కగా సరిపోతుంది. విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్ సహా స్టార్ ఆటగాళ్లతో ఎప్పుడూ కళకళలాడిపోతూ కనిపిస్తుందీ జట్టు. కానీ ఈ ఇద్దరు మినహాయిస్తే ఈ జట్టుకు ఆడే స్టార్ల ఆట అంతంతమాత్రంగా ఉంటుంది. కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ కూడా అంత నిలకడగా ఏమీ ఆడట్లేదు. ఐపీఎల్ వేలం వచ్చిన ప్రతిసారీ కొందరు స్టార్ల కోసం …
Read More »పెట్రోల్ సెంచరీ.. క్రికెటర్ పేలిపోయే పంచ్
ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. కానీ ఇది సంతోషించాల్సిన రోజేమీ కాదు. దేశంలో కొన్ని నెలలుగా శరవేగంగా పెరుగుతున్న పెట్రోలు ధర.. ఇప్పుడు కొన్ని నగరాల్లో ఏకంగా రూ.100 మార్కును టచ్ చేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ పెట్రోలు, డీజిలు ధరలు పెరగడం మామూలే కానీ.. మోడీ సర్కారు హయాంలో, ముఖ్యంగా రెండోసారి అధికారంలోకి వచ్చాక అసాధారణంగా రేట్లు పెరుగుతూ వచ్చాయి. గత రెండు నెలల్లోనే అసాధారణంగా …
Read More »స్వతంత్ర భారతంలో తొలిసారి ఉరిశిక్ష ఆ మహిళకే
దేశంలో ఉరిశిక్షలు కొత్తేం కాదు. కానీ.. స్వతంత్ర భారతంలో ఒక మహిళకు ఉరిశిక్షను అమలు చేసే చెత్త రికార్డును ఒక మహిళ తన పేరిట రాయించుకోనున్నారా? అంత దారుణమైన నేరం ఆమేం చేసింది? లాంటి ప్రశ్నలకు సమాధానంగా షబ్నమ్ ను చెప్పాలి. ఉత్తరప్రదేశ్ కు చెందిన ఆమె.. దేశంలో ఉరిశిక్ష అమలు కానున్న మహిళగా రికార్డుల్లోకి ఎక్కనున్నారు. అమ్రోహా ప్రాంతానికి చెందిన ఆమె.. ప్రియుడు కోసం తన కుటుంబానికి చెందిన …
Read More »హైకోర్టు జడ్జికే కండోమ్ లు పంపింది.. ఎందుకంటే?
ఇటీవల కాలంలో మరే న్యాయమూర్తి ఆదేశాలు చర్చకు రానంత ఎక్కువగా ఒక కేసు విషయంలో మహిళా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారటమేకాదు.. కొత్త చర్చకు తెర తీసింది. పోక్సో చట్టం కింద నమోదైన కేసును విచారించే క్రమంలో జడ్జి పుష్ప గనేడివాలా చేసిన వ్యాఖ్యలపై పెద్ద రగడే చోటుచేసుకుంది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్ట్రన్ ఫ్రమ్ సెక్సువల్ ఆఫెన్సెన్ పై ఆమె చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. శరీరాన్ని …
Read More »
Gulte Telugu Telugu Political and Movie News Updates