Trends

విశాఖ‌కు ఇదేం ఖ‌ర్మ‌!

ఏపీలో ఐటీ న‌గ‌రంగా భాసిల్లాల‌ని కోరుకుంటున్న విశాఖ‌ప‌ట్నంపై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయ‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రోవైపు ప్ర‌భుత్వం దీనిని పాల‌నా రాజధాని చేస్తామ‌ని చెబుతోంది. అంటే.. ఒక‌ర‌కంగా.. ఇటు ఐటీ, అటు పాల‌న రాజ‌ధాని పేరిట విశాఖ వెలుగులు మ‌రింత విరాజిల్లాలి. కానీ, న‌గ‌రం స‌హా జిల్లాపై అనేక నీలినీడ‌లుక‌మ్ముకున్నాయి. కొన్నాళ్ల కింద‌ట అధికార పార్టీ నాయ‌కుల‌పై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. స‌రే.. ఇవి ఎలా ఉన్నా.. ఇటీవ‌ల జ‌రిగిన ఎంపీ కుటుంబం కిడ్నాప్‌, రెండు రోజుల కింద‌ట ఓ పోలీసు అధికారి(ఆర్ ఐ స్వ‌ర్ణ‌ల‌త‌) జ‌రిపిన దందా వ్య‌వ‌హారం న‌గ‌రంపై విమ‌ర్శ‌లు పెల్లుబికేలా చేసింది.

ఇవ‌న్నీ ఇలా ఉంటే, తాజాగా నేవీ ఉద్యోగి చిన్నారిపై జ‌రిగిన అత్యాచారం, అనంత‌రం లైంగిక వేధింపులు న‌గ‌ర ప్ర‌తిష్ఠ‌ను మ‌రింత మ‌స‌క‌బారేలా చేస్తున్నాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. గ‌తంలో ఎప్పుడూ న‌గ‌రంలో ఇంత ఘోరాలు చోటు చేసుకోలేద‌ని మెజారిటీ వ‌ర్గాలు అభిప్రాయ‌ప‌డుతున్నాయి. తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న‌లో ముక్కుప‌చ్చ‌లార‌ని చిన్నారిని స్కూల్ అటెండ‌ర్ అత్యాచారం చేయ‌డం.. దానిని వీడియో తీసి స్నేహితుల‌కు షేర్ చేయ‌డం..వారు కూడా పిల్ల‌ను బెదిరించి లైంగికంగా ఇబ్బందులు పెట్ట‌డం వంటివి సంచ‌ల‌నంగా మారాయి.

ఏం జ‌రిగిందంటే..

విశాఖలోని 104 ఏరియాకు చెందిన సత్యరావు ఓ స్కూల్‌లో అటెండర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే స్కూల్‌లో చ‌దువుతున్న నేవీ ఉద్యోగి చిన్నారిపై అత‌ని క‌న్ను ప‌డింది. ఆ చిన్నారి కుటుంబం ఉండే అపార్ట్‌మెంట్‌లోనే ఇతడూ నివాసం ఉంటున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అంతటితో ఆగకుండా వివస్త్రను చేసి మొబైల్‌లో వీడియో తీసి ఆ దృశ్యాలను తన మిత్రులకు పంపాడు. వారు కూడా బాలికను బెదిరించి గత నెల 3వ తేదీ నుంచి 23 తేదీ వరకు పలుమార్లు లైంగికంగా బాలికను వేధించి చిత్ర హింసలకు గురి చేశారు.

బాధిత చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విశాఖ ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు సత్యారావును అదుపులోకి తీసుకుని పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. బాధితురాలికి విశాఖ కేజీహెచ్‌లో వైద్య పరీక్షలు నిర్వహించారు. సత్యారావు పనిచేసే స్కూల్‌లోనే బాలిక చదువుతుండటం, తాను ఉండే అపార్ట్‌మెంట్‌లోనే బాధిత బాలిక ఉండటంతో నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టేందుకు అవకాశం చిక్కిందని పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘ‌ట‌న‌తో విశాఖ ఉలిక్కి ప‌డింది. ప్ర‌శాంత న‌గ‌రానికి ఇదేం ఖ‌ర్మ‌ అంటూ ప్ర‌జ‌లు త‌ల ప‌ట్టుకుంటున్నారు.

This post was last modified on July 10, 2023 1:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

6 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

7 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

7 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

7 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

8 hours ago

సూపర్ 8లో టీమిండియాకు సఫారీ షాక్

టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…

8 hours ago