Political News

ప‌వ‌న్ ఒక్క ఆలోచ‌న‌… 5 వేల కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు!

ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. అట‌వీశాఖ మంత్రిగా కూడా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న చేసిన ఒకే ఒక్క ఆలోచ‌న.. 5 వేల క‌ళాకార కుటుంబాల క‌ళ్ల‌లో మెరుపులు మెరిపించింది. చిన్న‌, సూక్ష్మ‌స్థాయి క‌ళారూపాల‌ను రూపొందించే క‌ళాకారులు తూర్పు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల్లో ఎక్కువ‌గా ఉన్నారు. వీరు రూపొందించే క‌ళాకృతుల‌కు దేశ‌విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. అయితే.. వీరు ఉప‌యోగించే `క‌ల‌ప‌` ల‌భించ‌క‌పోవ‌డం.. భారీ ధ‌ర‌లు ప‌లుకుతుండ‌డంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స‌మ‌స్య‌పై గ‌త ఏడాది క‌ళాకారులు ప‌వ‌న్‌ క‌ల్యాణ్‌ను క‌లిసి విన్న‌వించారు.

అనంత‌రం.. ఏడాది కాలంలోనే వారి కోరిక నెర‌వేరుస్తూ.. ఏకంగా క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్‌(క‌ళాకారులు వినియోగించే క‌ల‌ప నిల్వ కేంద్రం)కు ప‌వ‌న్ క‌ల్యాణ్ శ్రీకారం చుట్టారు. తాజాగా శ‌నివారం త‌న స‌తీమ‌ణి అన్నా కొణిదెల‌తో క‌లిసి తూర్పుగోదావ‌రి జిల్లాలోని ధ‌వ‌ళేశ్వ‌రంలో ఈ బ్యాంకును ప్రారంభించారు. హ‌స్త క‌ళ‌ల‌(హ్యాండీ క్రాఫ్ట్‌) ప‌రిర‌క్ష‌ణే ధ్యేయంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రంలోనే ప్ర‌ద‌ర్శ‌న‌కు ప్ర‌త్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా క‌ళాకారుల‌కు అవ‌స‌ర‌మైన క్రాఫ్ట్ ఉడ్‌ను కూడా అందుబాటులో ఉంచుతారు. ప్ర‌స్తుతం 30 క్యూబిక్ మీట‌ర్ల మేర‌కు క‌ల‌ప‌ను అందుబాటులో ఉంచారు.

రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల‌కు పైగా కుటుంబాలు.. క్రాఫ్ట్ ఉడ్ క‌ళ‌పైనే ఆధార‌ప‌డి జీవిస్తున్నాయి. పిల్ల‌లు ఆడుకునే బొమ్మ‌ల నుంచి కానుక‌లు, బ‌హుమ‌తులుగా ఇచ్చుకునే పెద్ద సైజు బొమ్మ‌ల వ‌ర‌కు వీరు రూపొందిస్తారు. అయితే.. వీటికి వినియోగించే క‌ల‌ప భిన్నంగా ఉంటుంది. ఇది అట‌వీ ప్రాంతాల్లో అరుదుగా ల‌భిస్తోంది. దీంతో వీటి ధ‌ర‌లు భారీగా ఉండ‌డంతోపాటు.. ఎగుమ‌తి అయిపోతోంది. ఈ స‌మ‌స్య‌పై దృష్టి పెట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. ఉడ్ బ్యాంకు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. దీంతో తొలిసారి ఈ బ్యాంకు ఏర్పాటు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక నుంచి ఈ బ్యాంకు ద్వారా త‌క్కువ ధ‌ర‌ల‌కే క‌ళాకారుల‌కు ఉడ్ ల‌భిస్తుంది. రాయితీలు ఇచ్చేందుకు కూడా ప్ర‌భుత్వం త‌ర‌ఫున కృషి చేయ‌నున్నారు.

ఆస‌క్తిగా తిల‌కించిన అన్నా..

ధ‌వ‌ళేశ్వ‌రంలో ఏర్పాటు చేసిన క్రాఫ్ట్ ఉడ్ బ్యాంక్ కేంద్రాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌న స‌తీమ‌ణితో క‌లిసి ప్రారంభించారు. అనంత‌రం.. ఎగ్జిబిష‌న్‌ను కూడా ఇరువురూ తిల‌కించారు. అగ్గిపెట్టెలో ఇమిడి పోయే క‌ళాకృతుల‌ను చూసి ఇరువురు మంత్ర ముగ్ధుల‌య్యారు. వాటిని ఆస‌క్తిగా తిల‌కించిన అన్నా కొణిదెల క‌ళాకారుల‌కు రుసుము ఇచ్చి వాటిని కొనుగోలు చేశారు. ఎగ్జిబిష‌న్‌ను ఆస‌క్తిగా క‌లియ‌దిరిగి మ‌రీ చూశారు. ఈ సంద‌ర్భంగా కళాకారుల‌తో ప‌వ‌న్ దంప‌తులు ముచ్చ‌టించారు. వారి కుటుంబాలు, ఆదాయం, ప్ర‌భుత్వ ప్రోత్సాహ‌కం.. ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ ఇలా.. అన్ని విష‌యాలు తెలుసుకున్నారు. 

This post was last modified on August 15, 2026 8:16 pm

Share

Recent Posts

రాహుల్ రాముడైతే… జగ్గారెడ్డి హనుమంతుడు

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని జగ్గారెడ్డి వ్యవహార శైలి గురించి తెలిసిందే. తన…

26 minutes ago

కేటీఆర్ బిడ్డ చదువుకోవడానికి గొప్ప కాలేజీ లేదా

‘‘రేపు నా బిడ్డను డ్రాప్ చేయడానికి అమెరికా వెళ్లాలి...ఇక్కడే చదువుకోవచ్చు కదా అని అడిగితే...అంత గొప్ప కాలేజీలు ఇక్కడ ఎక్కడున్నాయి…

40 minutes ago

సంక్రాంతికి సంబరాలు… ఏటిగట్టుకి సవాళ్లు

గత ఏడాది విడుదల కావాల్సిన సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఎట్టకేలకు కొత్త…

2 hours ago

ఫౌజీ నిజాల మీద గాలి పుకార్లు

ప్రభాస్ ఫౌజీ మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పనక్కర్లేదు. రాజా సాబ్ డిజాస్టర్ తర్వాత ఈ ఏడాది ఆ…

2 hours ago

గవర్నర్ విందుకు హాజరు కాలేని పవన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. కాకినాడ లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న ఆయనకు తీవ్ర…

3 hours ago

విజయ్, త్రిషల గోల మళ్లీ మొదలు!

తమిళనాడు సీఎం విజయ్, సినీ నటి త్రిషల మధ్య రిలేషన్ షిప్ గురించి రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న సంగతి…

4 hours ago