వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్న తెలుగు దేశం పార్టీలో కొందరు పనిచేస్తుండగా.. మరికొందరు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడేసరికి ఈవాదన మరింత బలంగా వినిపిస్తోంది. ఎక్కడికక్కడ చాలా మంది నాయకులు.. తమ అంతర్గత సంభాషణల్లో ఇదే వాదనను తెరమీదికి తెస్తున్నారు.
“మేం నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. కానీ, ఈ నాలుగేళ్లలో మౌనంగా ఉన్న నాయకులు.. కనీసం పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయని నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల కేడర్కు సమాధానం చెప్పుకోలేక పోతున్నాం” అని.. మాజీ ఎమ్మెల్యే ఒకరు బాహాటంగా మీడియా ముందు వ్యాఖ్యానించా రు. మరికొందరు.. క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు చేయడంలో తెలుసుకుని టికెట్లు ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు.. నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిని చేపట్టారు. ఈ క్రమంలోనే పార్టీలో యాక్టివ్గా ఉంటున్న నాయకులు.. ఎన్టీఆర్ భవన్ కు వచ్చి.. తమ వాదనను.. విన్నపాలను అధిష్టానానికి అందజేస్తున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. అందరినీ కలుపుకొని పోయేందుకు పార్టీ అన్ని విధా లా పనిచేస్తోందని చంద్రబాబు వారికి నచ్చ జెపుతున్నారు. ప్రస్తుతం వ్యక్తులతో సంబంధం లేకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే అందరూ పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. దీనికి కొందరు సమ్మతిస్తుండగా.. మరికొందరు మాత్రం బిక్కమొహం వేసుకుని వెళ్లిపోతున్నారు. అయితే.. పార్టీ అధినేత మాత్రం గెలుపు గుర్రాలు అనే వారికి మాత్రమే టికెట్లు ఇస్తామని.. ఇందులో మొహమాటాలకు తావు లేదని తేల్చి చెబుతున్నారు.
This post was last modified on July 10, 2023 1:22 pm
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…