వివాహం ముందు, తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకునే విధానం ఈ మధ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలోని అచ్యుతాపురం సెజ్ లోని క్వాంటమ్ కంపెనీలోని బాత్ రూంలో శిశువు కనిపించడం.. కలకలం సృష్టించింది. క్వాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతికి ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ యువతి.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన మీద సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే.. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు యువతి కోసం.. గాలించారు. అయితే… అప్పటికే ఆమె కంపెనీ నుంచి వెళ్లిపోయింది. దీంతో శిశువును చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు అప్పగించి.. కేసు ను దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. ఇటీవల తమిళనాడులో కూడా.. ఇలాంటి ఘటనే ఒకటి తెరమీదికి వచ్చింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి ఆస్పత్రికి వెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో ఘోరం చేసింది. తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో కొన్ని రోజుల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్ రూమ్ క్లీనింగ్ చేసేందుకు వెళ్ళాడు. అక్కడ టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ సరిగా పనిచేయడం లేదు. దీంతో అతను దానిని తెరవడానికి ప్రయత్నించారు. మూత గట్టిగా వేసి ఉంది. కాసేపు ప్రయత్నించడంతో మూత తెరవగలిగాడు. కానీ అందులో కనిపించిన దృశ్యం అతన్ని షాక్ కు గురి చేసింది.
ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక పసిబిడ్డ మృతదేహం కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశాడు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని చూశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సిబ్బందిని విచారణ చేయడం మొదలుపెట్టారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
దీంతో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేయడానికి సీసీటీవీ వీడియోలను పరిశీలించారు. చేతిలో పసికందుతో వచ్చిన ఒక యువతి ఖాళీ చేతులతో వెళ్లడం గమనించారు. ఆ యువతిని గాలించి అరెస్టు చేశారు. ఆమె తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన ప్రియదర్శిని(23). పెళ్లి కాకుండానే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందని భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకునేందుకు ఫ్లష్ ట్యాంకులో ఆ పసిబిడ్డని పెట్టేసి ట్యాంకు మూత పెట్టి మూసేసింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది.
This post was last modified on October 26, 2022 1:52 pm
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం ఏడాది నుంచి ఎంతగా చర్చనీయాంశం అయిందో తెలిసిందే. ఈ లడ్డులో జంతు కొవ్వులు కలిశాయని…
నాంపల్లిలోని తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ కార్యాలయంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఆ కార్యాలయంలోని కంప్యూటర్ ల్యాబ్ లో చెలరేగిన…
‘కేజీఎఫ్’ హీరో యశ్ కొత్త సినిమా ‘టాక్సిక్’ తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను అగ్ర నిర్మాత దిల్ రాజు సొంతం…
నిన్న అరడజనుకు పైగా విడుదలైన సినిమాల్లో అంతో ఇంతో కొంచెం సౌండ్ చేసిన వాటిలో యూఫోరియాది మొదటి స్థానం. కారణం…
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…