వివాహం ముందు, తర్వాత అక్రమ సంబంధాలు పెట్టుకునే విధానం ఈ మధ్య పెరుగుతోంది. తాజాగా ఏపీలోని అచ్యుతాపురం సెజ్ లోని క్వాంటమ్ కంపెనీలోని బాత్ రూంలో శిశువు కనిపించడం.. కలకలం సృష్టించింది. క్వాంటమ్ కంపెనీలో పనిచేస్తున్న ఓ యువతికి ప్రసవం జరిగింది. పెళ్లి కాకుండా ప్రసవించడంతో ఆ యువతి.. శిశువును అక్కడే వదిలి వెళ్లిపోయింది. ఈ ఘటన మీద సిబ్బంది, పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే.. రంగంలోకి దిగిన పోలీసులు.. సదరు యువతి కోసం.. గాలించారు. అయితే… అప్పటికే ఆమె కంపెనీ నుంచి వెళ్లిపోయింది. దీంతో శిశువును చైల్డ్ వెల్ఫేర్ సంస్థకు అప్పగించి.. కేసు ను దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు.. ఇటీవల తమిళనాడులో కూడా.. ఇలాంటి ఘటనే ఒకటి తెరమీదికి వచ్చింది. పెళ్లి కాకుండానే ఒక బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి ఆస్పత్రికి వెళ్లి తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో ఘోరం చేసింది. తమిళనాడులోని తంజావూరు మెడికల్ కాలేజీలోని ఐసీయూ వార్డులో కొన్ని రోజుల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు ఆస్పత్రి బాత్ రూమ్ క్లీనింగ్ చేసేందుకు వెళ్ళాడు. అక్కడ టాయిలెట్ ఫ్లష్ ట్యాంక్ సరిగా పనిచేయడం లేదు. దీంతో అతను దానిని తెరవడానికి ప్రయత్నించారు. మూత గట్టిగా వేసి ఉంది. కాసేపు ప్రయత్నించడంతో మూత తెరవగలిగాడు. కానీ అందులో కనిపించిన దృశ్యం అతన్ని షాక్ కు గురి చేసింది.
ఆ ఫ్లష్ ట్యాంక్ లో ఒక పసిబిడ్డ మృతదేహం కనిపించింది. వెంటనే అతను ఈ విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యానికి తెలియజేశాడు. వాళ్లు హుటాహుటిన అక్కడికి చేరుకుని చూశారు. తరువాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని సిబ్బందిని విచారణ చేయడం మొదలుపెట్టారు. ఈ విచారణలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
దీంతో పోలీసులు కేసు విచారణను ముమ్మరం చేయడానికి సీసీటీవీ వీడియోలను పరిశీలించారు. చేతిలో పసికందుతో వచ్చిన ఒక యువతి ఖాళీ చేతులతో వెళ్లడం గమనించారు. ఆ యువతిని గాలించి అరెస్టు చేశారు. ఆమె తమిళనాడులోని బుదలూర్ పట్టణానికి చెందిన ప్రియదర్శిని(23). పెళ్లి కాకుండానే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఈ విషయం బయటకు తెలిస్తే తన జీవితం నాశనమవుతుందని భయంతో ఆ పసిబిడ్డను వదిలించుకునేందుకు ఫ్లష్ ట్యాంకులో ఆ పసిబిడ్డని పెట్టేసి ట్యాంకు మూత పెట్టి మూసేసింది. దీంతో ఆ బిడ్డ ఊపిరాడక చనిపోయింది.
పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…
ధనుష్ కొత్త సినిమా పేరు 'ఓం'గా ఫిక్సయ్యింది. అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్…
తెలుగులో ఇప్పుడు నిర్మాతల పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా మారిందో తెలిసిందే. నిలకడగా విజయాలు అందుకుని, లాభాలు దక్కించుకునే నిర్మాతలు అరుదైపోయారు.…
విజయవాడలో కనిపించకుండా పోయిన గాదె సాయికృష్ణ వ్యవహారం అంతకంతకూ జఠిలంగా మారుతోంది. సాయికృష్ణ బతికి లేడని, అతడిని పోలీసులే అంతమొందించారని…
తప్పు చేసిన నేతలు ఎప్పటికైనా ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చెప్పడానికి పల్నాడు జిల్లాలో జరిగిన ఈ ఘటన ఉదాహరణగా…
మా ఇంటి బంగారం అడ్వాన్స్ బుకింగ్స్ ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి మూడేళ్ళ గ్యాప్ తర్వాత ఒక హీరోయిన్ ఫిమేల్…