మెగా స్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో రానున్న సంక్రాంతి సినిమా ‘వాల్తేరు వీరయ్య’ కి సంబంధించి షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. వచ్చే సంక్రాంతి పోటీ లో నిలిచిన ఈ సినిమాకు ఇంకా కొంత షూట్ బ్యాలెన్స్ ఉంది. చిరు -రవితేజ మీద కూడా చాలా సీన్స్ పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. అందుకే ఈ సినిమా కోసం రెండు యూనిట్లు పనిచేస్తున్నాయట. ఒక యూనిట్ ను ‘పంతం’ దర్శకుడు చక్రవర్తి హ్యాండిల్ చేస్తున్నాడని సమాచారం. మరో యూనిట్ తో బాబీ కొన్ని సీన్స్ తీస్తున్నాడని తెలుస్తుంది.
వాల్తేరు వీరయ్య ని సంక్రాంతికి ఎనౌన్స్ చేశారు కానీ ఈ సినిమా జనవరిలో రావడం కష్టమే అని మొన్నటి వరకూ మేకర్స్ కి డౌట్ ఉండింది. కానీ ఎప్పుడైతే బాలయ్య సినిమా కూడా సంక్రాంతి కి ఫిక్స్ అయ్యిందో అప్పటి నుండి పోటీ మొదలైంది. ఇక వీరయ్య వెనక్కి తగ్గితే ఫ్యాన్స్ ఒప్పుకోరు కనుక లాక్ చేసుకున్న సంక్రాంతికే రావాలని డిసైడ్ అయ్యారు. పైగా ఇటు బాలయ్య అటు చిరు రెండు సినిమాలకు మైత్రి నే నిర్మాణం కావడంతో ఈసారి ఒకే బేనర్ నుండి వస్తున్న రెండు బడా సినిమాలు సంక్రాంతి బరిలో నిలవడం హాట్ టాపిక్ గా మారింది.
ఇంకా రెండు సినిమాలకు సంబంధించి రిలీజ్ డేట్ ప్రకటించలేదు. త్వరలోనే రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసుకొని భారీ ఎత్తున ప్రమోషన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. రెండూ మాస్ కమర్షియల్ సినిమాలే కావడంతో ఈసారి చిరు , బాలయ్య మధ్య టఫ్ వార్ జరగనుంది. మరి సంక్రాంతి పోటీలో వీరుడుగా నిలిచే ‘వీర’ ఎవరో వేచి చూడాల్సిందే.
This post was last modified on October 26, 2022 3:13 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…