Trends

మేరియుపోల్ ను ఆక్రమించుకున్న రష్యా

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధం ప్రారంభమైన దాదాపు 50 రోజుల తర్వాత రష్యా సైన్యం ఉక్రెయిన్లోని కీలకమైన నగరమైన మేరియుపోల్ ను ఆక్రమించుకున్నది. నగరం తమ స్వాదీనమైందని రష్యా ప్రకటిస్తే లేదు లేదు తమ సైన్యం ఇంకా పోరాడుతోందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తే నగరంలో ఎక్కడచూసినా రష్యా సైన్యమే కనబడుతోంది. దాంతో నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకున్నట్లే కనబడుతోంది.

ఉక్రెయిన్ సైన్యం తమకు లొంగిపోతే వాళ్ళందరికీ క్షమాబిక్ష పెడతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించటం కీలకపరిణామంగా కనిపిస్తోంది. తమకు దొరికిన 1464 మంది ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా సైన్యం మేరియుపోల్ ఉక్కు కర్మాగారంలో బంధించినట్లు సమాచారం. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా పట్టుసాధించటానికి బాగా అవకాశముంది. ఎలాగైనా మేరియుపోల్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చాలా రోజులుగా ఎంతో పోరాటంచేసింది.

ఈ పోరాటంలో వేలాదిమంది సైనికులు చనిపోయినా పట్టువదలకుండా ప్రయత్నించి చివరకు నగరాన్ని స్వాధీనంచేసుకున్నది. ఇదే సమయంలో రష్యా చేతిలోకి వెళ్ళిపోయిన నగరాన్ని తిరిగి స్వాధీనంచేసుకునేందుకు ప్రపంచదేశాలు తమకు ఆయుధాలివ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ఆ నగరంలో చిక్కుకుపోయిన వేలాదిమంది జనాలను రక్షించుకునేందుకు అమెరికా, బ్రిటన్, స్వీడన్ తో చర్చలు జరుపుతున్నారు.

ఈ విషయం ఇలాగుంటే కీవ్, లివివ్, ఖర్కీవ్ తదితర నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. క్షిపణులు, బాంబులతో రష్యా వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే రష్యా వైమానికి దాడుల కారణంగా ఉక్రెయిన్లోని చాలా నగరాలు ధ్వంసం అయిపోయాయి. సైనిక శిబిరాలతో పాటు ప్రభుత్వ ఆఫీసులు, ప్రజల ఆవాసాలతో సహా ధ్వంసం అయిపోతున్నాయి. మొత్తానికి యుద్ధం మొదలైన ఇంతకాలానికి మేరియుపోల్ ను రష్యా స్వాధీనం చేసుకోవటం చాలా కీలకమనే చెప్పాలి.

This post was last modified on April 18, 2022 4:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వేమిరెడ్డి చిట్టా విప్పేస్తున్నారా?

నెల్లూరు పార్ల‌మెంటు స‌భ్యుడు వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి వ్య‌వ‌హారం వైసీపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీ వ‌ల వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి,…

4 hours ago

ఐపీఎస్ సునీల్.. అలా రిటైర్ కావాల్సిందేనా?

వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్‌ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…

9 hours ago

అమరావతిలో కొత్త నిర్ణయం: పేదలకు నష్టం లేకుండా మార్పు

జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…

10 hours ago

మరి కొద్ది గంటల్లో పెళ్లి.. అక్కచెల్లెళ్లు మృతి?

రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్‌పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…

10 hours ago

ప‌వ‌న్‌కు షారుఖ్ రేంజిలో ఇస్తామ‌న్నా..

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌క‌ట‌న‌లు చేస్తానంటే ఆయ‌న‌కు భారీ పారితోష‌కం ఇవ్వ‌డానికి బోలెడ‌న్ని కంపెనీలు ముందుకు వ‌స్తాయి. కానీ…

10 hours ago

కోర్టు హీరోయిన్ నెమ్మదిగా నడవాలంట

గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…

10 hours ago