Trends

మేరియుపోల్ ను ఆక్రమించుకున్న రష్యా

ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలకమైన పరిణామం చోటు చేసుకున్నది. యుద్ధం ప్రారంభమైన దాదాపు 50 రోజుల తర్వాత రష్యా సైన్యం ఉక్రెయిన్లోని కీలకమైన నగరమైన మేరియుపోల్ ను ఆక్రమించుకున్నది. నగరం తమ స్వాదీనమైందని రష్యా ప్రకటిస్తే లేదు లేదు తమ సైన్యం ఇంకా పోరాడుతోందని ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. అయితే క్షేత్రస్ధాయిలో పరిస్ధితులను చూస్తే నగరంలో ఎక్కడచూసినా రష్యా సైన్యమే కనబడుతోంది. దాంతో నగరాన్ని రష్యా సైన్యం ఆక్రమించుకున్నట్లే కనబడుతోంది.

ఉక్రెయిన్ సైన్యం తమకు లొంగిపోతే వాళ్ళందరికీ క్షమాబిక్ష పెడతామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించటం కీలకపరిణామంగా కనిపిస్తోంది. తమకు దొరికిన 1464 మంది ఉక్రెయిన్ సైన్యాన్ని రష్యా సైన్యం మేరియుపోల్ ఉక్కు కర్మాగారంలో బంధించినట్లు సమాచారం. తాజా పరిణామాలతో ఉక్రెయిన్ తూర్పు ప్రాంతంపై రష్యా పట్టుసాధించటానికి బాగా అవకాశముంది. ఎలాగైనా మేరియుపోల్ ను స్వాధీనం చేసుకునేందుకు రష్యా చాలా రోజులుగా ఎంతో పోరాటంచేసింది.

ఈ పోరాటంలో వేలాదిమంది సైనికులు చనిపోయినా పట్టువదలకుండా ప్రయత్నించి చివరకు నగరాన్ని స్వాధీనంచేసుకున్నది. ఇదే సమయంలో రష్యా చేతిలోకి వెళ్ళిపోయిన నగరాన్ని తిరిగి స్వాధీనంచేసుకునేందుకు ప్రపంచదేశాలు తమకు ఆయుధాలివ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ విజ్ఞప్తి చేశారు. ఆ నగరంలో చిక్కుకుపోయిన వేలాదిమంది జనాలను రక్షించుకునేందుకు అమెరికా, బ్రిటన్, స్వీడన్ తో చర్చలు జరుపుతున్నారు.

ఈ విషయం ఇలాగుంటే కీవ్, లివివ్, ఖర్కీవ్ తదితర నగరాలపై రష్యా సైన్యం విరుచుకుపడుతోంది. క్షిపణులు, బాంబులతో రష్యా వైమానిక దళాలు విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే రష్యా వైమానికి దాడుల కారణంగా ఉక్రెయిన్లోని చాలా నగరాలు ధ్వంసం అయిపోయాయి. సైనిక శిబిరాలతో పాటు ప్రభుత్వ ఆఫీసులు, ప్రజల ఆవాసాలతో సహా ధ్వంసం అయిపోతున్నాయి. మొత్తానికి యుద్ధం మొదలైన ఇంతకాలానికి మేరియుపోల్ ను రష్యా స్వాధీనం చేసుకోవటం చాలా కీలకమనే చెప్పాలి.

This post was last modified on April 18, 2022 4:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆఫ్గనిస్తాన్ మాఫియాలో ‘డ్రాగన్’ మారణహోమం

దేవర బ్లాక్ బస్టర్ తర్వాత వార్ 2 విపరీతంగా నిరాశ పరచడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఆశలన్నీ ప్యాన్ ఇండియా…

2 hours ago

చిక్కుల్లో విజ‌య్‌… ఎల్‌టీటీఈ ప్ర‌భాక‌ర‌న్‌కు నివాళి!

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి, టీవీకే అధిప‌తి విజ‌య్ రాజకీయ విమ‌ర్శ‌ల‌కు కేంద్రంగా మారారు. ఆయ‌న‌ను కార్న‌ర్ చేస్తూ.. బీజేపీస‌హా ఇత‌ర పార్టీలు…

2 hours ago

రాంబాబు స్థానంలో జార్జ్ కుట్టిని చూడగలరా

ఇంకో రెండు రోజుల్లో దృశ్యం 3 విడుదల కానుంది. ఒరిజినల్ వెర్షన్ తో పాటు తెలుగు డబ్బింగ్ రిలీజ్ కానుండటంతో…

2 hours ago

తగ్గని జోగి దూకుడు

వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జోగి రమేష్ తన దూకుడును ఏమాత్రం తగ్గించడం లేదు. వాస్తవానికి ఆయన అగ్రిగోల్డ్ కేసులోను…

2 hours ago

చేప‌ల పులుసు పెట్టి.. మ‌త్స్యకారుల‌ను ఫిదా చేసిన చంద్ర‌బాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌త్స్య‌కారుల మ‌న‌సు దోచుకున్నారు. నెల్లూరు జిల్లా కావ‌లి నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టించిన ఆయ‌న మ‌త్స‌కార సేవ‌లో కార్య‌క్ర‌మంలో…

3 hours ago

ప్రాంతీయ పార్టీల్లో టీడీపీదే అగ్రస్థానం

దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలదే ఆధిపత్యం కనిపిస్తున్నా.. రాష్ట్రాల రాజకీయాలను ప్రభావితం చేసేది మాత్రం ఇప్పటికీ ప్రాంతీయ పార్టీలేనని తాజా…

4 hours ago