కన్నడ సినిమా చరిత్రలోనే ఎన్నడూ లేని భారీ వసూళ్లను కేజీఎఫ్-2 సొంతం చేసుకుంటుంటే.. ఆ చిత్ర హీరోకు వచ్చిన కష్టమేంటి అనిపిస్తోందా? అయితే ఇది అతడి భవిష్యత్తకు సంబంధించిన విషయంలెండి. కన్నడ సినిమాలు కర్ణాటక దాటి రిలీజవడమే గగనం అంటే.. మూడున్నరేళ్ల కిందట కేజీఎఫ్ దేశవ్యాప్తంగా అలాంటిలాంటి సంచలనం రేపలేదు. ఇప్పుడు చాప్టర్-2 అంతకుమించిన విజయం అందుకుంటోంది. ఈ చిత్రంతో యశ్ ఇమేజే మారిపోయింది. దేశవ్యాప్తంగా అతడి క్రేజ్ మామూలుగా లేదు. కానీ ఈ సినిమాతో వచ్చే ఇమేజ్, ఫాలోయింగ్, మార్కెట్ను అతను ఎంతమేర ఉపయోగించుకుంటాడన్నదే ఇప్పుడు సందేహంగా మారింది.
ప్రశాంత్ కాకుండా అతడి ఇమేజ్ను సరిగ్గా ఉపయోగించుకుని, తన స్థాయికి తగ్గ సినిమాను అందించే దర్శకుడెవరూ శాండిల్వుడ్లో కనిపించడం లేదు. యశ్కు కేజీఎఫ్ స్థాయి హిట్ పడాలంటే మళ్లీ ప్రశాంతే అతడితో సినిమా తీయాలి. కానీ ప్రశాంత్ సలార్, ఎన్టీఆర్ సినిమాలతో బిజీ అయిపోతున్నాడు. ఆ తర్వాత మరి కొందరు టాలీవుడ్ సూపర్ స్టార్లు తనతో సినిమా కోసం ట్రై చేస్తున్నారు. కాబట్టి రాబోయే కొన్నేళ్లలో ప్రశాంత్.. యశ్తో సినిమా చేసే ఛాన్స్ లేదు. కేజీఎఫ్కు సరితూగే సినిమా కాదు కదా.. దానికి దరిదాపుల్లో నిలిచే సినిమా తీసే దర్శకుడు కూడా ఎవరూ కన్నడలో కనిపించడం లేదు.
మరి టాలీవుడ్ స్టార్ దర్శకులెవరైనా అతడితో సినిమాలు చేస్తారా అంటే అందరూ బిజీనే. వారికి ఇక్కడ చాలా కమిట్మెంట్లు ఉన్నాయి. మరి యశ్కు బాలీవుడ్కు వెళ్లి అక్కడి దర్శకులతో సినిమాలు చేస్తాడా అన్నదీ సందేహమే. టాలీవుడ్లో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉండి కూడా ప్రభాస్ బాహుబలి తర్వాత తన కెరీర్ను సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. తర్వాతి రెండు సినిమాలతో దెబ్బ తిన్నాడు. అలాంటిది కన్నడలో ప్రశాంత్ కాకుండా యశ్ ఇమేజ్ను సరిగ్గా ఉపయోగించుకునే దర్శకుడే కనిపించకపోవడం అతడికి మైనస్సే.
This post was last modified on April 18, 2022 8:50 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…