Political News

ప్రతిపక్షాలు కేసీయార్ కు హ్యాండిచ్చాయా ?

జాతీయస్ధాయిలో తాజాగా మొదలైన రాజకీయ పరిణామాల్లో ఇపుడిదే హాట్ టాపిక్ అయ్యింది. దేశంలో పెరిగిపోతున్న మత విద్వేషాలు, విద్వేష ప్రకటన తదితరాలపై దేశంలోని ప్రతిపక్షాల అధినేతలు నరేంద్రమోడికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో 13 పార్టీల అధినేతల సంతకాలున్నాయి. అందులో కేసీయార్ సంతకం మాత్రం ఎక్కడా కనబడలేదు. దీనికి కారణం ఏమిటంటే అన్నీ పార్టీలు కేసీయార్ ను అసలు సంప్రదించనే లేదని తాజా సమాచారం.

నరేంద్రమోడి ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంటని బీజేపీయేతర, కాంగ్రెసేతర ఫ్రంట్ ఏర్పాటుకు తాజా పరిణామాలు పెద్ద బ్రేకు వేసేట్లుగానే ఉంది. ఇప్పటికే కేసీయార్ ను ఏ పార్టీ కూడా నమ్మటంలేదు. కాంగ్రెస్ లేకుండా జాతీయస్ధాయిలో ఫ్రంట్ సాధ్యం కాదన్న శరద్ పవార్, ఉద్ధత్ థాక్రే వాదనకు మెల్లిగా సానుకూలత కనిపిస్తోంది. వీళ్ళ వాదనతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఏకీభవించినట్లు సమాచారం.

కాంగ్రెస్ తో కలిసేందుకు ఆప్ అధినేత కేజ్రీవాల్ సంకేతాలు పంపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈమధ్యనే ఢిల్లీలో కేసీయార్ పెద్ద షో చేసినా ప్రతిపక్షాల అధినేతలు ఎవరు పెద్దగా కనబడలేదు. అంటే అందరు మాట్లాడుకునే కేసీయార్ ను దూరం పెట్టారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే జాతీయస్ధాయిలో చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీయే బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం. అలాంటి పార్టీని దూరంగాపెట్టి జాతీయ స్ధాయిలో ఫ్రంట్ ఏర్పాటు సాధ్యంకాదని చాలా ప్రతిపక్షాలు అంగీకరిస్తున్నాయి.

ఇదే విషయాన్ని ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివశేన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ పదే పదే చెబుతున్నారు. బీజేపీ వ్యతిరేక పోరాటానికి తానే నాయకత్వం వహిస్తానంటు ఇంతకాలం చెబుతున్న మమతాబెనర్జీ కూడా తాజాగా కాంగ్రెస్ లేకుండా పోరాటాలు సాధ్యంకాదని అంగీకరించారు. ప్రతిపక్షాల్లో ఐక్యత లేకపోతే అంతిమంగా లబ్దిపొందేది బీజేపీ మాత్రమే అని మొత్తానికి మమతాబెనర్జీ, కేజ్రీవాల్ లాంటివాళ్ళు అంగీకరించారు. ఇలాంటి అనేక కారణాల వల్ల, ట్రాక్ రికార్డు కారణంగానే 13 పార్టీలు కేసీయార్ సంతకం అవసరం లేదని తేల్చుకున్నాయట. అందుకనే ఎవరు కేసీయార్ ను కలుపుకుని వెళ్ళటానికి ఇష్టపడలేదు. కాబట్టి కేసీయార్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలకు మిగిలిన పార్టీలు హ్యాండిచ్చినట్లే అనిపిస్తోంది.

This post was last modified on April 18, 2022 4:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగార్జున మీద రీసెర్చ్ చేయాలన్న సేతుపతి

అక్కినేని నాగార్జున ప్రస్తుతం 67వ పడిలో ఉన్నారు. ఆయన ఎవరో తెలియని వాళ్లకు ఆయన్ని చూపించి తన వయసెంత అంటే 40-45 మధ్య చెబుతారేమో. నిజానికి ఆ…

6 minutes ago

రాష్ట్రంలో జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లు

ఏపీ సీఎం చంద్ర‌బాబు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రాన్ని త్వ‌ర‌లోనే జోన్లు, రీజియన్లు, కారిడార్లు, క్లస్టర్లు, హబ్‌లుగా విభజించుకుని అభివృద్ధి…

11 minutes ago

మోగ్లీకి ఊహించని పరీక్ష

బాక్సాఫీస్ పరిణామాలు సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో మలుపులు తిరుగుతున్నాయి. డిసెంబర్ 5 అఖండ 2 వాయిదా పడింది. క్రిస్మస్ కు…

49 minutes ago

కొడాలి నాని రీ ఎంట్రీ.. ఇంటర్వెల్ తర్వాత..?

తెలుగు రాజకీయాల్లో కొడాలి నానిది ఓ డిఫరెంట్ స్టైల్. ప్రత్యర్ధులపై దూకుడుగా మాట్లాడే ఆయన వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.…

57 minutes ago

అమెరికాలో ఆగని లోకేష్ వేట

పెట్టుబ‌డిదారులకు ఏపీ స్వ‌ర్గ ధామంగా మారుతుంద‌ని.. మంత్రి నారా లోకేష్ తెలిపారు. అమెరికా ప‌ర్యటన‌లో ఉన్న మంత్రి.. పెట్టుబ‌డి దారుల‌తో…

3 hours ago

అఖండ-2… మళ్లీ ఇక్కడ టెన్షనేనా?

డిసెంబరు 5 నుంచి వాయిదా పడ్డ నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రం ‘అఖండ-2’ను మరీ ఆలస్యం చేయకుండా వారం వ్యవధిలోనే…

3 hours ago