కరోనా అక్కడ సోకింది.. ఎన్ని ప్రాణాలు పోతాయో

కరోనా వైరస్ జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వస్తే చాలా ప్రమాదం అని.. దాని వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అప్పటికి ఎంతమందికి ఈ వైరస్ ఉందో కానీ.. ఇప్పుడు వారిలో వేలమంది కరోనా బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ప్రకటించి అందరూ ఇంటిపట్టున ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. ఉన్నత, మధ్యతరగతి జనాల్లో అవగాహన ఉంటుంది. సాధ్యమైనంత వరకు లాక్ డౌన్ పాటిస్తారు.

ఇళ్లు, మనుషుల మధ్య దూరం పాటించేందుకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ వర్గాలున్న చోట్ల ఎవరికైనా వైరస్ వచ్చినా.. వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉండదు. కానీ పెద్ద ఎత్తున పేదలు నివసించే మురికివాడల్లో వైరస్ ప్రబలితే నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. అందుకే అలాంటి చోట్ల వైరస్ ఎవరికీ సోకకూడదని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.

కానీ దేశంలోనే అతి పెద్దదైన మురికివాడలో ఇప్పుడు కరోనా కేసులు రెండు బయటపడటం కలకలం రేపుతోంది. ముంబయి సిటీలోని ధారావి మురికివాడలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇక్కడ రెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఏకంగా 20 లక్షల మంది జనాలుంటారు. చిన్న ఇంట్లో ఎనిమిది మంది నివసిస్తారు. అక్కడ జన సాంద్రత ఎలా ఉంటుందనేది ‘కాలా’, ‘గల్లీ బాయ్’ లాంటి సినిమాల్లో చూసే ఉంటారు.

అక్కడ సోషల్ డిస్టన్స్ పాటించడం దాదాపు అసాధ్యం. అక్కడ శానిటైజేషన్ పనులు చేపట్టడం.. జనాలు ఈ విషయంలో అవగాహనతో ఉండటం కూడా కష్టమే. అలాంటి చోట రెండు కరోనా కేసులు బయటపడటంతో వాళ్లు ఇంకెంతమందికి అంటించారో.. కొన్ని రోజుల తర్వాత అక్కడ కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో.. ఎంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్నది మహారాష్ట్రలోనే అన్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 9, 2020 6:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు…

1 hour ago

అసలు విషయం దాచేసిన రావిపూడి

నిన్న సాయంత్రం అనిల్ రావిపూడి కొత్త సినిమా అనౌన్స్ మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎవరూ ఊహించని విధంగా వెంకటేష్, కళ్యాణ్…

1 hour ago

ఎన్నిక‌ల వేళ‌… ఇన్‌ఫ్లుయెన్స‌ర్లదే `రాజ‌కీయం`!

ప‌దిమందిని మెప్పించ‌గ‌ల మాట నేర్పు ఉందా? సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌జ‌లను ఆక‌ర్షించ‌గ‌ల నైపుణ్యం ఉందా? అయితే.. రాజకీయాల‌న్నీ మీవే!. త్వ‌ర‌లోనే..…

2 hours ago

రఘురామను మళ్ళీ గిల్లుతున్న సునీల్ కుమార్

“జస్ట్ అలా పడిపోతేనే రెండు చోట్ల ఎముకలు విరిగాయి. నిజంగా కస్టడీలో ఎవరైనా కొట్టి ఉంటే ఎన్ని ఫ్రాక్చర్లు ఉండాలి?…

2 hours ago

న‌గ‌రిలో రోజా VS భాను… ఇదో స‌రికొత్త వార్‌…

ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వ‌ర్గం నగ‌రిలో ఏం జ‌రుగుతోంది? నాయ‌కులు ఏం చేస్తున్నారు? అంటే.. అంతా ప్ర‌స్తుతం సైలెంట్‌గానే…

7 hours ago

ఆయ‌నో మ‌ర్రి చెట్టు: టీడీపీ కామెంట్‌.. !

కొంద‌రు నాయ‌కులు తాము ఎదుగుతూ.. తోటి వారిని ఎదిగేలా స‌హ‌క‌రిస్తారు. ఇది ఎక్క‌డైనా ఉంటుంది. అయితే.. కొన్ని కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో…

14 hours ago