కరోనా అక్కడ సోకింది.. ఎన్ని ప్రాణాలు పోతాయో

కరోనా వైరస్ జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వస్తే చాలా ప్రమాదం అని.. దాని వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అప్పటికి ఎంతమందికి ఈ వైరస్ ఉందో కానీ.. ఇప్పుడు వారిలో వేలమంది కరోనా బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ప్రకటించి అందరూ ఇంటిపట్టున ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. ఉన్నత, మధ్యతరగతి జనాల్లో అవగాహన ఉంటుంది. సాధ్యమైనంత వరకు లాక్ డౌన్ పాటిస్తారు.

ఇళ్లు, మనుషుల మధ్య దూరం పాటించేందుకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ వర్గాలున్న చోట్ల ఎవరికైనా వైరస్ వచ్చినా.. వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉండదు. కానీ పెద్ద ఎత్తున పేదలు నివసించే మురికివాడల్లో వైరస్ ప్రబలితే నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. అందుకే అలాంటి చోట్ల వైరస్ ఎవరికీ సోకకూడదని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.

కానీ దేశంలోనే అతి పెద్దదైన మురికివాడలో ఇప్పుడు కరోనా కేసులు రెండు బయటపడటం కలకలం రేపుతోంది. ముంబయి సిటీలోని ధారావి మురికివాడలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇక్కడ రెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఏకంగా 20 లక్షల మంది జనాలుంటారు. చిన్న ఇంట్లో ఎనిమిది మంది నివసిస్తారు. అక్కడ జన సాంద్రత ఎలా ఉంటుందనేది ‘కాలా’, ‘గల్లీ బాయ్’ లాంటి సినిమాల్లో చూసే ఉంటారు.

అక్కడ సోషల్ డిస్టన్స్ పాటించడం దాదాపు అసాధ్యం. అక్కడ శానిటైజేషన్ పనులు చేపట్టడం.. జనాలు ఈ విషయంలో అవగాహనతో ఉండటం కూడా కష్టమే. అలాంటి చోట రెండు కరోనా కేసులు బయటపడటంతో వాళ్లు ఇంకెంతమందికి అంటించారో.. కొన్ని రోజుల తర్వాత అక్కడ కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో.. ఎంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్నది మహారాష్ట్రలోనే అన్న సంగతి తెలిసిందే.

This post was last modified on April 9, 2020 6:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వాహ్ డీసీఎం.. మధ్యాహ్నం అడిగితే సాయంత్రానికి ఆర్డర్స్

ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…

2 hours ago

తమ్ముళ్ళూ… బాబు గారి రెండో వైపు చూసి తట్టుకోగలరా?

ఏపీ సీఎం చంద్ర‌బాబును ఆ పార్టీ నాయ‌కులు ఒకే కోణంలో చూస్తున్నారా?  బాబుకు రెండో కోణం కూడా ఉంద‌న్న విష‌యాన్ని…

3 hours ago

పెమ్మ‌సానికి కీల‌క బాధ్య‌త‌.. భారీ హోంవ‌ర్క్‌.. !

గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మ‌సాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…

4 hours ago

ఇక‌… బీజేపీపై ఆశ‌లు వ‌దులుకోవాల్సిందే జ‌గ‌న్‌.. !

కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుంద‌న్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…

5 hours ago

నాటి `ప్రాభ‌వం` కోల్పోతున్న బీఆర్ ఎస్‌.. రీజ‌నేంటి?

భార‌త రాష్ట్ర‌స‌మితి(బీఆర్ఎస్‌).. ఈ పేరుకు పెద్ద ప్రాభ‌వమే ఉంది. ఒక్కొక్క‌పార్టీకి నాయ‌కుల పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…

7 hours ago

కేసీఆర్‌ను బ‌య‌ట‌కు లాగి.. క‌విత గెలవగలరా?

సెంటిమెంటుకు-రాజ‌కీయాల‌కు మ‌ధ్య స‌యామీ క‌వ‌ల‌ల‌కు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాద‌ని నాయ‌కులు రాజ‌కీయాలు చేయ‌గ‌ల‌రా?  సాధ్యంకాదు. సో..…

8 hours ago