కరోనా వైరస్ జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వస్తే చాలా ప్రమాదం అని.. దాని వ్యాప్తి ఉద్ధృతంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అప్పటికి ఎంతమందికి ఈ వైరస్ ఉందో కానీ.. ఇప్పుడు వారిలో వేలమంది కరోనా బాధితులుగా మారారు. ఈ నేపథ్యంలోనే లాక్ డౌన్ ప్రకటించి అందరూ ఇంటిపట్టున ఉండేలా చూస్తోంది ప్రభుత్వం. ఉన్నత, మధ్యతరగతి జనాల్లో అవగాహన ఉంటుంది. సాధ్యమైనంత వరకు లాక్ డౌన్ పాటిస్తారు.
ఇళ్లు, మనుషుల మధ్య దూరం పాటించేందుకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ వర్గాలున్న చోట్ల ఎవరికైనా వైరస్ వచ్చినా.. వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో ఉండదు. కానీ పెద్ద ఎత్తున పేదలు నివసించే మురికివాడల్లో వైరస్ ప్రబలితే నష్టం ఊహించని స్థాయిలో ఉంటుంది. అందుకే అలాంటి చోట్ల వైరస్ ఎవరికీ సోకకూడదని ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి.
కానీ దేశంలోనే అతి పెద్దదైన మురికివాడలో ఇప్పుడు కరోనా కేసులు రెండు బయటపడటం కలకలం రేపుతోంది. ముంబయి సిటీలోని ధారావి మురికివాడలో ఇద్దరికి కరోనా ఉన్నట్లు తేలింది. ఇక్కడ రెండు కిలోమీటర్ల ప్రాంతంలో ఏకంగా 20 లక్షల మంది జనాలుంటారు. చిన్న ఇంట్లో ఎనిమిది మంది నివసిస్తారు. అక్కడ జన సాంద్రత ఎలా ఉంటుందనేది ‘కాలా’, ‘గల్లీ బాయ్’ లాంటి సినిమాల్లో చూసే ఉంటారు.
అక్కడ సోషల్ డిస్టన్స్ పాటించడం దాదాపు అసాధ్యం. అక్కడ శానిటైజేషన్ పనులు చేపట్టడం.. జనాలు ఈ విషయంలో అవగాహనతో ఉండటం కూడా కష్టమే. అలాంటి చోట రెండు కరోనా కేసులు బయటపడటంతో వాళ్లు ఇంకెంతమందికి అంటించారో.. కొన్ని రోజుల తర్వాత అక్కడ కరోనా కేసులు ఏ స్థాయిలో పెరుగుతాయో.. ఎంతమంది ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందో అన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక కరోనా కేసులున్నది మహారాష్ట్రలోనే అన్న సంగతి తెలిసిందే.
This post was last modified on April 9, 2020 6:52 pm
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…
‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…
ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…
ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా ఎయిర్పోర్టులు గందరగోళంగా మారడంతో కేంద్రం దిగివచ్చింది. ప్రయాణికుల కష్టాలు చూడలేకనో, లేక ఇండిగో లాబీయింగ్కు…
ఎన్నికలు ఏవైనా.. ప్రజలకు 'ఫ్రీ బీస్' ఉండాల్సిందే. అవి స్థానికమా.. అసెంబ్లీనా, పార్లమెంటా? అనే విషయంతో సంబంధం లేకుండా పోయింది.…