ఓ కరోనా రోగికి అత్యవసర చికిత్స చేసినందుకు 40 మంది డాక్టర్లు క్వారంటైన్లోకి వెళ్లాల్సి వచ్చింది. పూణెలోని కడ్నీ ఏరియాకు చెందిన ఓ ఆటో డ్రైవర్ యాక్సిడెంట్కు గురై ఆసుపత్రిలో చేరాడు. మార్చి 31న తీవ్ర గాయాలతో ఉన్న ఆ ఆటోడ్రైవర్ను ఆసుపత్రిలో తీసుకొచ్చిన అతని కుటుంబ సభ్యులు… ‘అతను ఎక్కడికి వెళ్లి రాలేదని, నగరంలోనే ఉంటున్నాడని’ డాక్టర్లకు అబద్ధం చెప్పారు.
దాంతో ఎమర్జెన్సీ కేసు కింద అతన్ని ఆసుపత్రిలో చేర్చుకున్న వైద్యులు, చికిత్స అందించి ప్రాణాలను కాపాడారు. అయితే తాజాగా ఐసీయూలో ఉన్న అతనికి జ్వరం రావడంతో డాక్టర్లకు అనుమానం వచ్చి, కరోనా టెస్ట్ చేయగా పాజిటివ్గా వచ్చింది. కుటుంబసభ్యులను ఈ విషయమై నిలదీయగా… అతను నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన తబ్లిగీ జమాజ్కు వెళ్లివచ్చినట్టు తెలిపారు.
ఆ సమాధానంతో షాక్ తిన్న వైద్యులు… అతనికి చికిత్స చేసిన 40 మంది వైద్యులు, నర్సులు, మరో 30 మంది సహాయక సిబ్బంది, పేషెంట్లను క్వారంటైన్కు తరలించారు. వేర్వేరు గదులల్లో ఉంచి, వీరి సాంపిల్స్ను కూడా కరోనా పరీక్షల కోసం పంపించారు. ఆటోడ్రైవర్ మర్కజ్కు వెళ్లివచ్చిన విషయాన్ని దాచిపెట్టిన కుటుంబసభ్యులు, అతని ప్రాణాలను కాపాడిన వైద్యుల లైఫ్ను ప్రమాదంలో పడేసినట్లైంది.
This post was last modified on April 9, 2020 6:51 pm
ఇప్పుడు సినిమాల్లో క్వాలిటీ కంటెంట్, భారీతనం, బిజినెస్, కలెక్షన్స్.. ఈ కోణంలో చూస్తే బాలీవుడ్ మీద సౌత్ సినిమానే స్పష్టమైన…
ఏపీ సీఎం చంద్రబాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిల ఆసక్తికర విన్నపం చేశారు. తరచుగా కేం ద్రంపై…
తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…
‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…
గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…
ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…