Categories: Political News

ట్రంప్ వార్నింగ్.. నిషేధం ఎత్తేసిన భార‌త్

క‌రోనా వైర‌స్‌కు ఉన్నంతలో మెరుగ్గా ప‌ని చేస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (మ‌లేరియాకు వాడే మందు) ఔష‌ధాన్ని స‌ర‌ఫ‌రా చేయాల‌న్న అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విన్న‌పాన్ని భార‌త్ మ‌న్నించింది. అమెరికాతో పాటు అవసరమైన ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే దిశ‌గా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమ‌తిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఎత్తివేసింది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

కరోనాకు ఇప్పటి వరకు చికిత్సంటూ ఏమీ లేదు. నాలుగు నెల‌ల కింద‌టే బ‌య‌ట‌ప‌డ్డ నావెల్ క‌రోనాకు వ్యాక్సిన్ కూడా క‌నుగొన‌లేదు. ఐతే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉన్నంత‌లో క‌రోనాకు బాగా ప‌నిచేస్తోంద‌ని ప‌రీక్ష‌ల్లో వెల్ల‌డైంది. దీంతో ఈ ఔష‌ధానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. భారత్ అవసరాలకు సరిపడేంత మందుతోపాటు అద‌నంగా నిల్వ‌లు ఉండ‌టంతో ఆ మేర‌కు ఎగుమతి చేసేందుకు ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.

ముందు ఈ ఔషధాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ సుముఖంగా లేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ స‌హా కొన్ని ఔష‌ధాల ఎగుమ‌తుల‌పై నిషేధం ఉంది. అయితే ఈ క‌ష్ట కాలంలో భార‌త్ త‌మ విన్న‌పాన్ని ఆలకించకపోతే గట్టి చర్యలు ఉంటాయని, దానికి ప్ర‌తీకారం తీర్చుకునే అవ‌కాశం కూడా ఉంద‌ని ట్రంప్ హెచ్చ‌రించాడు. ట్రంప్ హెచ్చరికల సంగతెలా ఉన్నా.. క‌రోనా ధాటికి అల్లాడుతున్న దేశాల‌కు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి చేయాలని ముందే ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది.

This post was last modified on April 9, 2020 6:52 pm

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

5 hours ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

5 hours ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

6 hours ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

6 hours ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

8 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

8 hours ago