కరోనా వైరస్కు ఉన్నంతలో మెరుగ్గా పని చేస్తున్న హైడ్రాక్సీ క్లోరోక్విన్ (మలేరియాకు వాడే మందు) ఔషధాన్ని సరఫరా చేయాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విన్నపాన్ని భారత్ మన్నించింది. అమెరికాతో పాటు అవసరమైన ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసే దిశగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతిపై ఉన్న నిషేధాన్ని కేంద్ర విదేశాంగ శాఖ ఎత్తివేసింది. కరోనా ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్ తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రపంచ దేశాల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనాకు ఇప్పటి వరకు చికిత్సంటూ ఏమీ లేదు. నాలుగు నెలల కిందటే బయటపడ్డ నావెల్ కరోనాకు వ్యాక్సిన్ కూడా కనుగొనలేదు. ఐతే మలేరియాను నయం చేయడానికి వాడే హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉన్నంతలో కరోనాకు బాగా పనిచేస్తోందని పరీక్షల్లో వెల్లడైంది. దీంతో ఈ ఔషధానికి ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఏర్పడింది. భారత్ అవసరాలకు సరిపడేంత మందుతోపాటు అదనంగా నిల్వలు ఉండటంతో ఆ మేరకు ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ముందు ఈ ఔషధాన్ని ఎగుమతి చేసేందుకు భారత్ సుముఖంగా లేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ సహా కొన్ని ఔషధాల ఎగుమతులపై నిషేధం ఉంది. అయితే ఈ కష్ట కాలంలో భారత్ తమ విన్నపాన్ని ఆలకించకపోతే గట్టి చర్యలు ఉంటాయని, దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం కూడా ఉందని ట్రంప్ హెచ్చరించాడు. ట్రంప్ హెచ్చరికల సంగతెలా ఉన్నా.. కరోనా ధాటికి అల్లాడుతున్న దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతి చేయాలని ముందే ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
This post was last modified on April 9, 2020 6:52 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…