Trends

తల్లి కొడుకు కలిసి చంపేశారు..

డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్‌ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక (భూంపల్లి) ప్రాంతంలో తల్లీకొడుకు కలిసి ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 5.1 తులాల బంగారం, 53 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

భూంపల్లి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సమీపంలో హోటల్‌, దుకాణం నిర్వహిస్తున్న చాకలి రజిత (38) క్రైమ్‌ కథనాలు, ఆన్‌లైన్‌ వీడియోలు చూస్తూ హత్యలకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన మైనర్‌ కుమారుడిని కూడా నేరాల్లో భాగస్వామిని చేసినట్లు దర్యాప్తులో తేలింది. కుమారుడు శారీరకంగా బలంగా ఉండేందుకు ఇంట్లోనే వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది.

ఒంటరి మహిళను నమ్మించి..

గతంలో ‘రేఖ’ అనే ఒంటరి మహిళను నమ్మించి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్‌ పోసి అచ్చమాయపల్లి అటవీ ప్రాంతంలో తగలబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఇటీవల అతికం విజయ (45)ను తమ ఇంటికి పిలిపించిన తల్లీకొడుకు ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై రామక్కపేట శివార్లకు తరలించి కాల్చివేసినట్లు దర్యాప్తులో తేలింది. సగం కాలిన స్థితిలో మృతదేహం లభించడంతో పోలీసులు కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.

సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో ఛేదింపు

విజయ మృతదేహం లభించిన తర్వాత సిద్దిపేట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్‌, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితులపై దృష్టి సారించినట్లు సమాచారం. అనంతరం రజితతో పాటు ఆమె మైనర్‌ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. రజితను రిమాండ్‌కు తరలించగా, బాలుడిని జువైనల్‌ హోమ్‌కు పంపినట్లు తెలిసింది.

విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మంచానికే పరిమితమైన భర్తకు బీమా చేయించి అనంతరం అతడిని హత్య చేయడంతో పాటు మరో ముగ్గురు మహిళలను కూడా హత్య చేసేందుకు తల్లీకొడుకు పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటనలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.

This post was last modified on August 17, 2026 3:08 pm

Share

Recent Posts

సూర్యని ఊరిస్తున్న ట్రిపుల్ మైలురాయి

మొన్నటిదాకా వరస డిజాస్టర్లతో మార్కెట్ రిస్క్ లో పడేసుకున్న సూర్య మాములు కంబ్యాక్ ఇవ్వలేదు. అసలు పెద్దగా అంచనాలు లేకుండా…

14 minutes ago

ర‌వితేజ కొడుకు… యాక్టింగ్ కోస‌మే డైరెక్ష‌న్

టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులకు చిన్నతనంలోనే సినిమా పురుగు కుట్టేస్తుంది. బాల నటుడిగానే అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ఆ కోవలోనే…

1 hour ago

ప్ర‌పంచ‌పు వింత అంటే ఇదే: యువ‌కుడికి గ‌ర్భాశ‌యం!

మ‌హిళ‌లు మీసాలు పెంచ‌లేర‌ని.. పురుషులు గ‌ర్భాన్ని దాల్చ‌లేర‌ని సామెత‌!. అయితే.. ఇటీవ‌ల కాలంలో ర‌ష్యాకు చెందిన ఓ మ‌హిళ మీసాలు…

3 hours ago

జగన్ నమ్మకం ఏంటో అర్థం కావట్లేదే!

విశ్వాసం..అతి విశ్వాసం…ఈ రెండింటికి మధ్య ఒక సన్నని గీత ఉంది. ఈ విషయం తెలుసుకోకుండా చాలామంది రాజకీయ నేతలు తొందరపడుతుంటారు…

3 hours ago

టికెట్ రేట్ల పంచాయితీలో ‘ప్యారడైజ్’ తర్జన భర్జన

ఇంకో 15 రోజుల్లో విడుదల కాబోతున్న ది ప్యారడైజ్ టికెట్ రేట్లకు సంబంధించి ట్రేడ్ వర్గాల్లో చర్చలు మొదలైపోయాయి. పెంచాలా…

4 hours ago

ప్రతీకారానికి ఒక్క నిమిషం చాలు.. కానీ నేను ఆ పని చేయలేదు

వైసీపీ హయాంలో మూడేళ్ల క్రితం జరిగిన తన అరెస్టు ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. నాడు జరిగిన ఘటనలను…

4 hours ago