నెల్లూరు జిల్లాలోని కృష్ణంపట్నం పేరు ఇప్పుడు మార్మోగిపోతోంది. ఇక్కడ ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు.. కరోనాకు ఇస్తున్న మందు గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ముందు దీని గురించి అందరూ తక్కువ చేసి మాట్లాడారు. జనాల మూఢత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారని.. శాస్త్రీయత లేని మందు ఇచ్చి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వ్యాఖ్యానాలు వినిపించాయి.
ఈ మందు కోసం జనాలు క్యూలు కట్టిన ఫొటోలు, వీడియోలు చూపించి ఇదేం వెర్రితనం అంటూ వేళాకోళం చేశారు. కానీ ఇప్పుడు ఈ మందు నిజంగా చాలా బాగా పని చేస్తోందని దాన్ని తీసుకున్న వాళ్లు చెబుతుండటం.. ఆసుపత్రుల్లో మృత్యువుతో పోరాడుతున్న వాళ్లను అంబులెన్సుల్లో ఇక్కడికి తీసుకొచ్చి మందు వేయించి తీసుకెళ్తుండటం.. ఆ మందు వేసుకున్న కాసేపటికే కరోనా రోగులు కోలుకుని ఉత్సాహంగా మాట్లాడుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఒక మాజీ హెడ్ మాస్టర్ స్వయంగా కృష్ణంపట్నం ఆయుర్వేద మందు గురించి మీడియాకు ఒక బైట్ ఇచ్చారు. తాను కరోనాతో ఆసుపత్రిలో వారం నుంచి పోరాడుతున్నానని.. ఇక తాను బతుకుతాననే ఆశ పోయిందని.. విషమ స్థితిలో ఇక్కడికి వచ్చానని.. ఇంకొన్ని నిమిషాలు తనకు ఆక్సిజన్ పెట్టకుంటే తన ప్రాణాలు పోయేవని.. అలాంటి స్థితిలో ఆనందయ్య ఇచ్చే ఆయుర్వేద మందు వేసుకుంటే 15 నిమిషాల్లో కోలుకున్నానని ఆయన మీడియాకు వెల్లడించారు. ఇలా ఈ మందు గురించి పాజిటివ్గా మాట్లాడుతున్న వాళ్లు చాలామందే ఉన్నారు. ఈ మందును కంటిద్వారా వేస్తుండటం గమనార్హం.
ఐతే కరోనా మందును కంట్లో వేయడమేంటి.. ఇంత తక్కువ వ్యవధిలో ఉపశమనం రావడం ఏంటి అని అలోపతి వైద్యులు ప్రశ్నిస్తున్నారు. జనాల మూఢ నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారని వాళ్లు ఆనందయ్య తీరును దుయ్యబడుతున్నారు. ఐతే ఈ మందును ఆనందయ్య ఉచితంగా ఇస్తుండటం విశేషం.
ఈ మందు కోసం నెల్లూరు జిల్లా వాళ్లే కాక ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తండటంతో రెండు కిలోమీటర్ల దూరం ట్రాఫిక్ జాం అయ్యే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులుగా జనం పెద్ద ఎత్తున గుమికూడి పరిస్థితులు అదుపు తప్పుతుండటంతో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వస్తోంది. ఈ మందు గురించి పరిశీలన జరిపిన వైద్యాధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. రెండు రోజులు మందు పంపిణీ ఆపగా.. తిరిగి మళ్లీ పంపిణీ చేస్తున్నారు.
This post was last modified on May 21, 2021 2:00 pm
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…