భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే… ఆ మారిన పరిస్థితులకు అనుగుణంగానే సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పుల్లోనూ విశాల దృక్పథం చూపిస్తోంది. ఇప్పటిదాకా కేవలం వివాహం జరిగిన జంటలకే పరిమితం అయిన గృహ హింస కేసులు ఇకపై సహజీవనం చేసే జంటలకూ వర్తిస్తుందని తాజాగా సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. వెరసి ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్ లో మహిళపై పురుషుడు తన పైత్యం చూపిస్తే…గృహ హింసను ఎదుర్కోక తప్పదన్నమాట.
సంప్రదాయ పోకడలకు అత్యధిక ప్రాదాన్యం ఇచ్చే భారత్ లోనూ ఇటీవలి కాలంలో సహజీవనం తరహా సంబంధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. గతకొంత కాలంగా దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతాల్లోనూ ఈ లివ్ ఇన్ రిలేషన్లు కనిపిస్తూనే ఉన్నాయి. ఎక్కడున్నా పురుషుడు తన పురుషాధిక్యతను ప్రదర్శించేందుకే ప్రాధాన్యం ఇస్తాడు కదా. అలాగే కర్ణాటకకు చెందిన ఓ సహజీవనంలో… మగాడు మహిళపై తన బుద్ధి చూపించుకున్నాడు. అయితే ఈ వ్యవహారంపై కేసు నమోదుకు పోలీసులు సహకరించలేదేమో… బాధిత మహిళ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
లివ్ ఇన్ రిలేషన్ లో తనపై తన ప్రియుడు వేధింపులకు పాల్పడ్డాడని, ఈ నేపథ్యంలో పెళ్లి జరిగితే గృహ హింస అనే నిబంధనను తొలగించి మరీ తనకు న్యాయం చేయాలని సదరు మహిళ సుప్రీంను వేడుకుంది. బాధిత మహిళ వాదనను విన్న సర్వోన్నత న్యాయస్థాయం… పెళ్లి చేసుకున్నా, లివ్ ఇన్ లో ఉన్నా మగాడు ఆడదానిపై వేధింపులకు పాల్పడటం సరికాదని అభిప్రాయపడింది. సహజీవన సంబంధాల్లోనూ ఈ తరహా ఫిర్యాదులు వస్తే,… సెక్షన్ 498ఏ కింద గృహ హింస కేసు నమోదు చేయవచ్చని తెలిపింది. అయితే సదరు లివ్ ఇన్ రిలేషన్ ను పెళ్లిగా మార్చుకునేందుకు బాధిత మహిళ అంగీకరిస్తేనే కేసు నమోదు చేయాలని కోర్టు తేల్చి చెప్పింది.
This post was last modified on August 3, 2026 5:09 pm
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…
నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి కాంబో రిపీట్ చేస్తూ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బికె 111కు రెండు…