దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి వ్యతిరేకంగా విద్యార్థులు చేపట్టిన ఆందోళనతో దేశ వ్యాప్తంగా జంతర్ మంతర్ చర్చ జరుగుతుంది. దేశ నడిబొడ్డున పార్లమెంట్ స్ట్రీట్ లో రాష్ట్రపతి భవన్ కు దగ్గరగా వుంది. నిరసనలకు ఎంతగానో ఫేమస్ అయింది. అయితే ఇక్కడ ధర్నాలు, నిరసనలు జరగకుండా చూడాలని ఎప్పటి నుంచో స్థానికులు కొందరు ఫిర్యాదు చేస్తున్నారు. తాజాగా జంతర్ మంతర్ కు ప్రత్యామ్నాయ వేదిక చూడాలని సుప్రీం కోర్టులో పిటేషన్ వేశారు.
జంతర్ మంతర్ వద్ద తరచుగా జరుగుతున్న నిరసనలు, ధర్నాల వల్ల స్థానికుల రాక పోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ పిటీషన్ దాఖలైంది. నిత్యావసర సరుకుల రవాణా కు ఆటంకం కలుగుతుందని, అత్యవసర వైద్య సేవలకు ఆటంకం ఏర్పడుతుందని పిటీషన్ లో పేర్కొన్నారు. దీనిమీద ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని జస్టిస్ జాయ్ మాల్య భాగ్చి, జస్టిస్ మోహనలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. పిటీషనర్ తమ దృష్టికి తీసుకొచ్చిన అంశాలు పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని, చాలా కీలక మైనవని వ్యాఖ్యనించారు.
స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ప్రత్యామ్నాయ వేదికను గుర్తించాలని, అందుకు కేంద్రం నుంచి సూచనలు తీసుకొని రావాలని సోలిసిటర్ జనరల్ ను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంతో సహా సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు కనుక కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించి తగిన నిర్ణయం తీసుకుంటే జంతర్ మంతర్ లో నిరసనలకు చెక్ పెట్టినట్టవుతుంది.
దేశంలో ఐదు జంతర్ మంతర్లు…
జంతర్ మంతర్ అనగానే మందరికీ ఢిల్లీలోని జంతర్ మంతర్ ఒక్కటే గుర్తుకు వస్తుంది. కానీ దేశంలో ఐదు చోట్ల జంతర్ మంతర్లను నిర్మించారు. ఢిల్లీ, జైపూర్, వారణాసి, మధుర, ఉజ్జయనిల్లో నిర్మించారు. వీటిలో జైపూర్ లో వున్న జంతర్ మంతర్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ సంపాదగా గుర్తించగా ఢిల్లీలోని జంతర్ మంతర్ ను జాతీయ స్మారక చిహ్నంగా గుర్తించింది.
This post was last modified on August 3, 2026 11:36 pm
మహారాష్ట్రలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు.. చాలామంది చూస్తుండగా, నిమిషాల వ్యవధిలో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయిన ఘటన ఇప్పుడు సోషల్…
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనూ మతమార్పిడులను ప్రోత్సహించారని, హిందువులకు ఆయన చేసిందేమీ లేదని మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…
సరిగ్గా ఇంకొక్క నెల రోజుల్లో ప్యారడైజ్ రిలీజ్ ఉంది. నాని అభిమానులు కౌంట్ డౌన్ మొదలుపెట్టుకున్నారు. జూన్ నుంచి వరసగా…
ఎవరో జ్వాలలు రగిలించారు ఎవరో దానికి టార్గెట్ అయ్యారని సామెత చెప్పినట్టు ఇరుముడి బ్లాక్ బస్టర్ విజయం మెగా ఫాన్స్…
పెద్ద పెద్ద వాళ్ళ కుటుంబాల్లోనే సమస్యలు ఉన్నాయి.. ప్రతి ఇంటిలోనూ అందరికీ సమస్యలు ఉంటాయి.. అంటూ మాజీ మంత్రి వైసిపి…
ఫార్చునర్ కారు.. చేతిలో చీపురు! కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా బంట్వాల్లో కనిపిస్తున్న ఈ దృశ్యం ఇప్పుడు అందరి దృష్టినీ…