మెగాస్టార్ చిరంజీవి సేవా దృక్పథం గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది. దాసరి నారాయణరావు మరణానంతరం టాలీవుడ్ పెద్ద పాత్రలోకి మారిన ఆయన.. ఎవరికి ఏ కష్టం అన్నా ముందుగా స్పందిస్తున్నారు. తన వంతుగా సాయం అందిస్తున్నారు. గత కొన్నేళ్లలో ఆయన్నుంచి ఎంతో మంది సాయం పొందారు. ఈ మధ్య కరోనాతో మరణించిన టీఎన్ఆర్ కుటుంబానికి ఆయన లక్ష రూపాయల సాయం అందజేయడం తెలిసిందే. నటి పావలా శ్యామల కష్టాల్లో ఉందని తెలుసుకుని ఆమెకు కూడా లక్ష రూపాయలు పంపించారు.
ఇక కరోనా వల్ల గత ఏడాది సినీ పరిశ్రమలో సంక్షోభం తలెత్తినప్పటి నుంచి చిరు చేసిన సేవ గురించి ఎంత చెప్పినా తక్కువే. కరోనా బాధితుల కోసమని తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడానికి కూడా చిరు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
ఇదే సమయంలో చిరు పెద్ద మనసు గురించి ఒక తమిళ నటుడు వెల్లడించడం, ఆయన్ని కొనియాడటం విశేషం. ఆ నటుడెవరో కాదు.. 80, 90 దశకాల్లో తమిళ, తెలుగు చిత్రాల్లో విలన్గా మెప్పించిన పొన్నాంబళం. ఫైట్ మాస్టర్ కూడా అయిన పొన్నాంబళం చిరుతో కలిసి చాలా సినిమాల్లో నటించాడు. ఐతే కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స చేయించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఆ సంగతి తెలిసి తమిళ సినీ పరిశ్రమలో పలువురు సాయం అందించడానికి ముందుకొచ్చారు.
చిరు సైతం పొన్నాంబళంకు రూ.2 లక్షలు అందజేశారట. ఈ విషయం చిరు ఏమీ చెప్పుకోలేదు. స్వయంగా ఇప్పుడు పొన్నాంబళమే ఒక వీడియో ద్వారా విషయం వెల్లడించారు. మధ్యలో అనారోగ్యంతో బాగా చిక్కిపోయి కనిపించిన పొన్నాంబళం సర్జరీ తర్వాత కోలుకున్నాడు. ఇప్పుడు హుషారుగానే కనిపిస్తున్నాడు. చిరు తనకు రూ.2 లక్షలు అందజేయడం గురించి వెల్లడిస్తూ కష్ట కాలంలో ఆ డబ్బు తనకెంతో ఉపయోగపడిందని, చిరు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు పొన్నాంబళం. దీంతో మరోసారి చిరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
ఈ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించాక ఎంత ప్లాన్డ్ గా పనులు చేసినా చివరి నిమిషం వరకు వాయిదా ఉండదన్న…
మలయాళంలో బ్లాక్ బస్టర్ అవ్వొచ్చేమో కానీ తెలుగులో మాత్రం దృశ్యం 3ని ఫ్లాప్ గానే పరిగణించాలి. తక్కువ బిజినెస్ చేయడం…
మీలాగా మేం ఫామ్ హౌస్లో పడుకోవట్లే - అంటూ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. బీఆర్ఎస్ పార్టీపై ఓ…
స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లిలాంటిదే అన్నట్టుగా వైసీపీ నాయకులకు ఎక్కడ ఎలా వ్యవహరించాలో తెలియడం లేదన్న విమర్శలు వస్తున్నాయి.…
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ కు నిజంగానే షాక్…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్లు.. కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.…