ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా ఉన్న పీకే… ఇప్పుడు ఏకంగా చట్టసభల్లోకి అడుగుపెట్టబోతున్నారు. బీహార్ లోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పీకే ఘన విజయం సాధించారు. వెరసి ఎమ్మెల్యేగా ఆయన తన కొత్త జీవితాన్ని ప్రారంభించినట్టైంది. నిన్నటిదాకా స్ట్రాటజిస్ట్ గా పిలిపించుకున్న పీకే ఇకపై ఎమ్మెల్యేగా పిలిపించుకోనున్నారు.
విద్యాధికుడైన ప్రశాంత్ కిశోర్… రాజకీయ వ్యూహ రచనలో ఆరితేరిపోయారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన పీకే… ఎన్డీఏ విజయానికి అవసరమైన వ్యూహాన్ని రచించారు. ఆ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించగా…పదేళ్ల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైంది. ఆ తర్వాత 2019 సార్వత్రిక ఎన్నికలు వచ్చేసరికి ఏపీలో నాటి, నేటి విపక్షం వైసీపీకి వ్యూహాలు రచించిన పీకే… ఏపీలోనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సీఎం చేశారు. ఆ తర్వాత 2024 ఎన్నికల నాటికి వ్యూహ రచనకు దూరంగా జరిగిన పీకే తన సొంత రాష్ట్రం బీహార్ రాజకీయాల్లోకి దిగిపోయారు. అధికార జేడీయూలో చేరి… కొన్నాళ్లకే ఆ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి… కొంత సమయం తీసుకుని జన సురాజ్ పేరిట సొంత పార్టీని పెట్టుకున్నారు.
ఇదంతా గతం అయితే… జన సురాజ్ పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అభ్యర్థిగా తాజాగా పీకే తొలిసారి బరిలోకి దిగారు. బీహర్, గుజరాత్, మధ్య ప్రదేశ్ లలో ఒక్కో అసెంబ్లీ చొప్పున మూడు అసెంబ్లీ స్థానాలకు ఇటీవలే ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉధయం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో బీహార్ లోని బంకీపూర్ నుంచి జన సురాజ్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పీకే విజయం సాధించారు. కతన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ పై 19,246 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారు. బీజేపీ రెండో స్థానానికి పరిమితం కాగా.. ఆర్డేడీ అభ్యర్థి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ప్రశాంత్ కిశోర్ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన సందర్భంలో మరో ఆసక్తికర అంశం కూడా ఉంది. పీకే గెలిచింది బీజేపీ ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ప్రాతినిధ్యం వహిస్తున్న బంకీపూర్ నుంచే కావడం గమనార్హం. బంకీపూర్ ఎమ్మెల్యేగా ఉండగానే… బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి దక్కించుకున్న నితిన్… ఈ ఏప్రిల్ మాసంలో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దీంతో బంకీపూర్ ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేశారు. ఫలితంగా జరిగిన ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిని వెనక్కు నెట్టేసిన పీకే.. ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ స్థానం బీజేపీకి కంచుకోటగా కొనసాగుతూ వస్తోంది. 1995 నుంచి ఇక్కడ బీజేపీ అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. అలాంటి చోట బీజేపీని ఓడించి పీకే ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం గమనార్హం.
This post was last modified on August 3, 2026 8:08 pm
అదేంటి కాక్రోచ్ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడని బిత్తర పోతున్నారా..? అప్పుడే ఆయన తన పదవికి రాజీనామా…
తెలంగాణా అధికార కాంగ్రెస్ పార్టీలో రాజకీయ పరిణామాలు రోజుకో రకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కొండా సురేఖ…
హీరో హీరోయిన్లకు.. పెద్ద టెక్నీషియన్లకు అంటే సినిమాకు ఏక మొత్తంగా పారితోషకాలు ఇస్తారు. కానీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసేవాళ్లకు…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు నలుగురు వంద రోజుల గ్యాప్ లో పరస్పరం తమ సినిమాలతో తలపడుతున్నారు. ఒకరు గాంధీ…
మామూలుగా స్టార్ హీరోయిన్ల నుంచి కెరీర్ ఆరంభంలో గ్లామర్ మోతాదు ఎక్కువ ఉంటుంది. క్రమంగా గ్లామర్ పాత్రలు తగ్గించుకుని, పెర్ఫామెన్స్…
నేచురల్ స్టార్ నాని కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో తెరకెక్కి, భారీ అంచనాలతో రాబోతున్న సినిమా.. ది ప్యారడైజ్. ఏకంగా రూ.200…