Political News

వ్య‌క్తి చ‌నిపోతే… కేసు మూసేయొచ్చు: ఉండ‌వ‌ల్లి కేసుపై సుప్రీంకోర్టు

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు చెందిన ఓ కీల‌క కేసు విష‌యంలో సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. కేసును కొన‌సాగించాల్సిన అవ‌స‌రం లేద‌ని వ్యాఖ్యానించింది. దీనిలో ఎలాంటి త‌ప్పూ లేద‌ని పేర్కొంది. “వ్య‌క్తి చ‌నిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న వ‌చ్చి వాంగ్మూలం ఇవ్వ‌లేడు క‌దా? అలాంప్పుడు ఆ కేసులో నిజానిజాలు ఏంట‌నేది ఎవ‌రు చెబుతారు?  ఇక‌, ఈ కేసును మూసివేయ‌డ‌మే మంచిది.“ అని అభిప్రాయ‌ప‌డింది. అయితే.. తీర్పును మాత్రం వెల్ల‌డించ‌లేదు.

ఎవ‌రు?  ఏంటాకేసు?

ఈనాడు గ్రూపు సంస్థ‌ల అధిప‌తి, దివంగ‌త రామోజీరావుకు సంబంధించిన మార్గ‌ద‌ర్శి ఫైనాన్షియ‌ర్స్‌, చిట్స్ విష‌యంలో  మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ కేసు వేసిన విష‌యం తెలిసిందే. చిట్స్ పేరుతో ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి డిపాజిట్లు సేక‌రించార‌ని.. ఇది ఆర్బీఐ నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని.. దీనిని ఎలా ప‌రిగ‌ణిస్తారు? అనేది ఈ కేసు సారాంశం. దీనిపై ఇప్ప‌టికే సుప్రీంకోర్టు ప‌లు మార్లు విచార‌ణ జ‌రిపింది. అదేస‌మ‌యంలో తెలంగాణ హైకోర్టులోనూ ఈ కేసు వాద‌న‌లు జ‌రిగాయి. చివ‌రిగా తెలంగాణ హైకోర్టు.. రామోజీరావు మృతి చెందిన నేప‌థ్యంలో కేసును మూసి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

దీనిని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌.. సుప్రీంకోర్టులో స‌వాల్ చేశారు. “వ్య‌క్తి చ‌నిపోయినంత మాత్రాన .. వ్య‌వ‌స్థ(మార్గ‌ద‌ర్శి) చ‌నిపోలేద‌ని.. దీనిని కొన‌సాగిస్తున్నారు.. కాబ‌ట్టి.. త‌దుప‌రి నిర్వాహ‌కులను దీనిలో ఇంప్లీడ్ చేసి విచార‌ణ సాగించాలి.“ అని ఉండ‌వ‌ల్లి త‌న వాద‌న‌ల‌ను లిఖిత పూర్వ‌కంగా కోర్టుకు వినిపించారు. అన‌ధికార డిపాజిట్లను సేక‌రించ‌వ‌చ్చా? అనే విష‌యంపై స్ప‌ష్ట‌త ఇవ్వాల‌ని కోరారు. అన‌ధికారికంగా ప్ర‌జ‌ల నుంచి డిపాజిట్లు స్వీక‌రించి.. అనేక సంస్థ‌లు బోర్డు తిప్పేశాయ‌ని ఆయ‌న తెలిపారు. అయితే.. రామోజీరావు.. సంస్థ‌లు ఆర్థిక న‌ష్టాలు రాక‌పోవ‌డంతో ఎలాంటి ఇబ్బంది రాలేద‌ని వివ‌రించారు.

అయిన‌ప్ప‌టికీ.. ఒక వ్య‌క్తి.. హిందూ అవిభాజ్య కుటుంబం(హెచ్‌యూడీఎఫ్‌) కింద ప్ర‌జ‌ల నుంచి డిపాజిట్లు సేక‌రించేందుకు అవ‌కాశం ఉందా? అని ఉండ‌వ‌ల్లి ప్ర‌శ్నించారు. అయితే.. దీనిపై సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఈ కేసులో అస‌లు నిందితుడు(రామోజీ) లేరు కాబ‌ట్టి.. ఇప్పుడు ఆ ప్ర‌శ్న ఉత్ప‌న్నంకాద‌ని.. వ్య‌క్తి మ‌ర‌ణించిన త‌ర్వాత అనేక కేసుల‌ను మూసి వేస్తున్నామ‌ని వ్యాఖ్యానించింది. ఇప్ప‌టికే అనేక తీర్పులు కూడా ఉన్నాయ‌ని తెలిపింది. ఆ తీర్పుల‌నే దీనికి కూడా సంక్ర‌మించేలా చేయొచ్చ‌ని వ్యాఖ్యానించింది. అయ‌తే.. కోర్టు స‌మ‌యం ముగియ‌డంతో వాద‌న‌ల‌ను వాయిదా వేసింది.

This post was last modified on August 3, 2026 9:52 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

57 minutes ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

2 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

3 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

4 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

6 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

6 hours ago