అసలే కరోనా వైరస్ సెకెండ్ వేవ్ ను జనాలు తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో బ్లాక్ ఫంగస్ సోకటం మూలిగే నక్కపై తాటిపండు పడినట్లయ్యింది. బ్లాక్ ఫంగస్ కేసులతోనే కరోనా వైరస్ రోగులు ఇబ్బందులు పడుతుంటే తాజాగా దానికన్నా ప్రమాధకరమైన వైట్ ఫంగస్ కేసులు వెలుగుచూడటం కలకలం రేపుతోంది.
బీహార్ లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు బయటపడటంతో డాక్టర్లు ఉలిక్కిపడ్డారు. వీరిలో కరోనా వైరస్ లక్షణాలు మాత్రమే ఉన్నాయి. పైగా వీరికి టెస్టులు చేయిస్తే కరోనా నెగిటివ్ అనే వచ్చింది. అయినా వీరిలో వైట్ ఫంగస్ ఎలా వచ్చిందో డాక్టర్లకు అర్ధం కావటంలేదు.
ఇదే విషయమై మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ఎస్ సింగ్ మాట్లాడుతు తాజాగా వెలుగు చూసిన వైట్ పంగస్ కేసులు బ్లాక్ పంగస్ కేసులకన్నా చాలా ప్రమాధకరమన్నారు. కరోనా వైరస్ లేకపోయినా నలుగురికి వైట్ ఫంగస్ సోకటమే తమను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. యాంటీ ఫంగల్ మందులు వాడుతున్న కారణంగా ప్రస్తుతానికైతే నలుగురు క్షేమంగానే ఉన్నారన్నారు.
కరోనా వైరస్ సోకినపుడు రోగుల్లో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనబడినట్లే వైట్ ఫంగస్ సోకిన రోగుల్లో కూడా ఇవే లక్షణాలు బయటపడ్డాయన్నారు. తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారిలోను, షుగర్, స్టెరాయిడ్లు వాడిన, వాడుతున్న వారిలో వైట్ ఫంగస్ లక్షణాలు ఎక్కువగా బయటపడే అవకాశాలున్నట్లు సింగ్ తెలిపారు. ఏదేమైనా ముందు కరోనా వైరస్ తర్వాత బ్లాక్ ఫంగస్ తాజాగా వైట్ పంగస్ జనాలను ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాయి.
This post was last modified on May 21, 2021 1:54 pm
సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…
థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…
తెలంగాణలో రెండు రాజ్యసభ స్థానాలకు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డిలు..…
వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…
రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…
టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున వరుసగా తమిళ నటులు, టెక్నీషియన్లతో పని చేస్తున్నాడు. గత ఏడాది ధనుష్తో కలిసి…