Trends

టమాటా కోసం ఆ దేశం రెండుగా విడిపోయి కొట్టుకుంది

వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. చిన్న గొడవలే తర్వాతి దశల్లో పెద్దవిగా మారుతుంటాయి. మహాభారతాన్నే చూస్తే.. ఈగో అనే మాట లేకపోతే లక్షలాది మంది మరణాలకు కారణమైన యుద్ధమే లేదు. ఆ పురాణాన్ని పక్కన పెడితే.. గంపెడు టమాటా కోసం దేశం రెండు వర్గాలుగా చీలి పరస్పర దాడులతో అతలాకుతలం కావటాన్నిఊహించగలరా? సంచలనంగా మారిన ఈ ఘర్షణ ఎక్కడ జరిగాయన్నది చూస్తే..

ఆఫ్రికాలోని నైజీరియాలో టమోటా బుట్టల కారణంగా గొడవలు కావటమే కాదు.. చివరకు దేశం రెండుగా చీలిపోయిన పరిస్థితి. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటాలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్ కు వెళుతున్నాడు. ప్రమాదం జరిగి టమాటాలు రోడ్డు మీద పడ్డాయి. దీంతో అక్కడి సమీపంలోని షాపుల వారికి ఇబ్బంది అయ్యింది. ఆ సందర్భంగా వారి మధ్య వాదనలకు కారణమైంది. అది కాస్తా తర్వాత ఘర్షణలకు దారి తీసి పోరాటాల వరకు వెళ్లింది.

ఈ ఉదంతానికి సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో మరో మలుపు తిరిగింది. దేశంలోని ఉత్తర ప్రాంతానికి చెందిన ముస్లింలు.. దక్షిణ ప్రాంతానికి చెందిన క్రైస్తవులుగా రెండు వర్గాలుగా విడిపోయింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో యావత్ దేశం హింసాత్మక ఘటనలుచోటు చేసుకున్నాయి. అనేక దుకాణాలపై దాడి చేశారు. వాటికి నిప్పు అంటించారు. ఇప్పటివరకు జరిగిన హింసకు 20 మంది వరకు చనిపోయారు. వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో నిత్యవసర వస్తువులకు కొరత ఏర్పడింది. దీంతో.. ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ కఠిన ఆంక్షలు విధించింది. బుట్టెడు టమోటా ఎంత రచ్చ చేసిందో కదా!

This post was last modified on March 11, 2021 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దేవరకొండా… ఇక ఆ సినిమా దేవుడికేనా?

తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…

19 minutes ago

బిగ్ బాస్-9‌లో ఇతనే పెద్ద సర్ప్రైజ్

ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…

1 hour ago

‘అఖండ’ బాంబు… ఎవరిపై పడుతుందో?

దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్‌ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…

4 hours ago

అప్పటినుండి నేతలు అందరూ జనాల్లో తిరగాల్సిందే

వ‌చ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వ‌స్తున్నాన‌ని.. త‌న‌తో పాటు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవాల‌ని…

4 hours ago

హ‌ద్దులు దాటేసిన ష‌ర్మిల‌… మైలేజీ కోస‌మేనా?

రాజ‌కీయాల్లో విమ‌ర్శ‌లు చేయొచ్చు. ప్ర‌తివిమ‌ర్శ‌లు కూడా ఎదుర్కొన‌చ్చు. కానీ, ప్ర‌తి విష‌యంలోనూ కొన్ని హ‌ద్దులు ఉంటాయి. ఎంత రాజ‌కీయ పార్టీకి…

5 hours ago

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

7 hours ago