Trends

టమాటా కోసం ఆ దేశం రెండుగా విడిపోయి కొట్టుకుంది

వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. చిన్న గొడవలే తర్వాతి దశల్లో పెద్దవిగా మారుతుంటాయి. మహాభారతాన్నే చూస్తే.. ఈగో అనే మాట లేకపోతే లక్షలాది మంది మరణాలకు కారణమైన యుద్ధమే లేదు. ఆ పురాణాన్ని పక్కన పెడితే.. గంపెడు టమాటా కోసం దేశం రెండు వర్గాలుగా చీలి పరస్పర దాడులతో అతలాకుతలం కావటాన్నిఊహించగలరా? సంచలనంగా మారిన ఈ ఘర్షణ ఎక్కడ జరిగాయన్నది చూస్తే..

ఆఫ్రికాలోని నైజీరియాలో టమోటా బుట్టల కారణంగా గొడవలు కావటమే కాదు.. చివరకు దేశం రెండుగా చీలిపోయిన పరిస్థితి. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటాలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్ కు వెళుతున్నాడు. ప్రమాదం జరిగి టమాటాలు రోడ్డు మీద పడ్డాయి. దీంతో అక్కడి సమీపంలోని షాపుల వారికి ఇబ్బంది అయ్యింది. ఆ సందర్భంగా వారి మధ్య వాదనలకు కారణమైంది. అది కాస్తా తర్వాత ఘర్షణలకు దారి తీసి పోరాటాల వరకు వెళ్లింది.

ఈ ఉదంతానికి సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో మరో మలుపు తిరిగింది. దేశంలోని ఉత్తర ప్రాంతానికి చెందిన ముస్లింలు.. దక్షిణ ప్రాంతానికి చెందిన క్రైస్తవులుగా రెండు వర్గాలుగా విడిపోయింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో యావత్ దేశం హింసాత్మక ఘటనలుచోటు చేసుకున్నాయి. అనేక దుకాణాలపై దాడి చేశారు. వాటికి నిప్పు అంటించారు. ఇప్పటివరకు జరిగిన హింసకు 20 మంది వరకు చనిపోయారు. వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో నిత్యవసర వస్తువులకు కొరత ఏర్పడింది. దీంతో.. ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ కఠిన ఆంక్షలు విధించింది. బుట్టెడు టమోటా ఎంత రచ్చ చేసిందో కదా!

This post was last modified on March 11, 2021 1:08 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఆ సీక్వెల్… నా వల్ల కాదు బాబోయ్

అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…

38 minutes ago

నాడూ మూడే!… నేడూ మూడే!

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…

4 hours ago

మోడీ ముందు జ‌గ‌న్ మ‌రింత‌ ప‌లుచ‌న‌!

ప్ర‌స్తుతం ఎవ‌రు ఔన‌న్నా.. కాద‌న్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజ‌కీయాల‌కు కూడా ప్ర‌ధాని మోడీ పెద్ద‌దిక్కుగా మారారన్నది వాస్త‌వం. ఆయ‌న‌ను…

5 hours ago

రాముడి పాత్ర వద్దన్న రణబీర్

ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్‌లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…

6 hours ago

దళిత క్రైస్తవుల విషయంలో జగన్ కన్నా షర్మిలే బెటర్?

వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్‌పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…

6 hours ago

గుణశేఖర్ గారు లాజిక్ మిస్సయ్యారు

ఒక్కడు, చూడాలని ఉంది లాంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు గుణశేఖర్ కొత్త మూవీ యుఫొరియా ఫిబ్రవరిలో విడుదలైన…

6 hours ago