వినేందుకు విచిత్రంగా అనిపించినా ఇది నిజం. చిన్న గొడవలే తర్వాతి దశల్లో పెద్దవిగా మారుతుంటాయి. మహాభారతాన్నే చూస్తే.. ఈగో అనే మాట లేకపోతే లక్షలాది మంది మరణాలకు కారణమైన యుద్ధమే లేదు. ఆ పురాణాన్ని పక్కన పెడితే.. గంపెడు టమాటా కోసం దేశం రెండు వర్గాలుగా చీలి పరస్పర దాడులతో అతలాకుతలం కావటాన్నిఊహించగలరా? సంచలనంగా మారిన ఈ ఘర్షణ ఎక్కడ జరిగాయన్నది చూస్తే..
ఆఫ్రికాలోని నైజీరియాలో టమోటా బుట్టల కారణంగా గొడవలు కావటమే కాదు.. చివరకు దేశం రెండుగా చీలిపోయిన పరిస్థితి. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటాలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్ కు వెళుతున్నాడు. ప్రమాదం జరిగి టమాటాలు రోడ్డు మీద పడ్డాయి. దీంతో అక్కడి సమీపంలోని షాపుల వారికి ఇబ్బంది అయ్యింది. ఆ సందర్భంగా వారి మధ్య వాదనలకు కారణమైంది. అది కాస్తా తర్వాత ఘర్షణలకు దారి తీసి పోరాటాల వరకు వెళ్లింది.
ఈ ఉదంతానికి సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో మరో మలుపు తిరిగింది. దేశంలోని ఉత్తర ప్రాంతానికి చెందిన ముస్లింలు.. దక్షిణ ప్రాంతానికి చెందిన క్రైస్తవులుగా రెండు వర్గాలుగా విడిపోయింది. అనంతరం చోటు చేసుకున్న పరిణామాలతో యావత్ దేశం హింసాత్మక ఘటనలుచోటు చేసుకున్నాయి. అనేక దుకాణాలపై దాడి చేశారు. వాటికి నిప్పు అంటించారు. ఇప్పటివరకు జరిగిన హింసకు 20 మంది వరకు చనిపోయారు. వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. ప్రస్తుతం ఆ దేశంలో నిత్యవసర వస్తువులకు కొరత ఏర్పడింది. దీంతో.. ధరలు భారీగా పెరిగిపోయాయి. ఈ ఘర్షణల్ని అదుపులోకి తెచ్చేందుకు దేశ వ్యాప్తంగా ప్రజలు ఇళ్లలోనే ఉండాలంటూ కఠిన ఆంక్షలు విధించింది. బుట్టెడు టమోటా ఎంత రచ్చ చేసిందో కదా!
This post was last modified on March 11, 2021 1:08 pm
టీడీపీ అధికార ప్రతినిధి, SEEDAP ఛైర్మన్ దీపక్ రెడ్డి తన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మీడియా…
వైసీపీ అధినేత జగన్ పరామర్శల యాత్రలు.. కార్యకర్తల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. గతంలో గుంటూరులో నిర్వహించిన పరామర్శ యాత్రలో ఒక…
ఏపీ రాజధాని అమరావతిలో అద్భుత ఘట్టానికి ముహూర్తం ఖరారైంది. శనివారం ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నారు.…
రాముడిని ఎవరైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవరైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుపడే ధార్మిక సంస్థలు.. ఇప్పుడు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి. ఏపీ…
ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…
మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…