#worstprosharathchandra.. బుధవారం ట్విట్టర్లో నేషనల్ లెవెల్లో టాప్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతల గురించి పాజిటివ్, నెగెటివ్ ట్రెండ్స్ చేయడం మామూలే కానీ.. ఇలా ఒక సినిమా పీఆర్వో గురించి హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. వేలల్లో ట్వీట్లు వేసి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేయడం విడ్డూరమే. ఈ పని చేస్తోంది తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు కావడం గమనార్హం. అజిత్ కొత్త సినిమా ‘వాలిమై’కు పీఆర్వోగా పని చేస్తున్న వ్యక్తే శరత్ చంద్ర. అతడి గురించే ఇలా నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు.
అజిత్ అభిమానులకు అంతగా కోపం తెప్పించే పని ఏం చేశాడు అంటారా.. ‘వాలిమై’ గురించి ఏ అప్డేట్ ఇవ్వకపోవడమే. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడాది దాటిపోయింది. కరోనా కంటే ముందే సినిమాను మొదలుపెట్టి దాదాపు సగం చిత్రీకరణ జరిపారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. జోరుగానే సాగుతోంది.
ఐతే సినిమా మొదలై ఇంత కాలం అయినా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం అజిత్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం టైటిల్ లోగో కూడా వదల్లేదు. అసలు సినిమా గురించి ఫలానా టైంలో అప్డేట్ ఇస్తారన్న సమాచారం కూడా లేదు. ఇప్పటికి నాలుగైదు సార్లు ‘వాలిమై అప్డేట్ కావాలి’ అంటూ ట్రెండ్స్ చేశారు. సోషల్ మీడియాను హోరెత్తించారు.
మధ్యలో ఒకసారి నిర్మాత బోనీ కపూర్ను సైతం టార్గెట్ చేస్తే.. ఆయన సరైన సమయంలో అప్డేట్ వస్తుందని ఊరుకున్నారు. కానీ తర్వాత చప్పుడు లేదు. దీంతో ఇప్పుడు పీఆర్వోను టార్గెట్ చేశారు. అతడి పేరు తెలుసుకుని నెగెటివ్ ట్రెండ్ మొదలుపెడితే అజిత్ అభిమానులందరూ దిగిపోయారు. తమ ఆగ్రహాన్నంతా చూపిస్తూ పీఆర్వో మీద మీమ్స్, జోకులు పేలుస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకుమించి వారిని వెయిట్ చేయిస్తే చాలా కష్టం కాబట్టి ‘వాలిమై’ ఫస్ట్ లుక్ అతి త్వరలోనే చిత్ర బృందం రిలీజ్ చేయక తప్పదేమో.
This post was last modified on March 11, 2021 9:41 am
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…