#worstprosharathchandra.. బుధవారం ట్విట్టర్లో నేషనల్ లెవెల్లో టాప్లో ట్రెండ్ అయిన హ్యాష్ ట్యాగ్ ఇది. నటీనటులు, టెక్నీషియన్లు, నిర్మాతల గురించి పాజిటివ్, నెగెటివ్ ట్రెండ్స్ చేయడం మామూలే కానీ.. ఇలా ఒక సినిమా పీఆర్వో గురించి హ్యాష్ ట్యాగ్ పెట్టడం.. వేలల్లో ట్వీట్లు వేసి నేషనల్ లెవెల్లో ట్రెండ్ చేయడం విడ్డూరమే. ఈ పని చేస్తోంది తమిళ స్టార్ హీరో అజిత్ అభిమానులు కావడం గమనార్హం. అజిత్ కొత్త సినిమా ‘వాలిమై’కు పీఆర్వోగా పని చేస్తున్న వ్యక్తే శరత్ చంద్ర. అతడి గురించే ఇలా నెగెటివ్ ట్రెండ్ చేస్తున్నారు.
అజిత్ అభిమానులకు అంతగా కోపం తెప్పించే పని ఏం చేశాడు అంటారా.. ‘వాలిమై’ గురించి ఏ అప్డేట్ ఇవ్వకపోవడమే. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లి ఏడాది దాటిపోయింది. కరోనా కంటే ముందే సినిమాను మొదలుపెట్టి దాదాపు సగం చిత్రీకరణ జరిపారు. లాక్ డౌన్ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలైంది. జోరుగానే సాగుతోంది.
ఐతే సినిమా మొదలై ఇంత కాలం అయినా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేయకపోవడం అజిత్ అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. కనీసం టైటిల్ లోగో కూడా వదల్లేదు. అసలు సినిమా గురించి ఫలానా టైంలో అప్డేట్ ఇస్తారన్న సమాచారం కూడా లేదు. ఇప్పటికి నాలుగైదు సార్లు ‘వాలిమై అప్డేట్ కావాలి’ అంటూ ట్రెండ్స్ చేశారు. సోషల్ మీడియాను హోరెత్తించారు.
మధ్యలో ఒకసారి నిర్మాత బోనీ కపూర్ను సైతం టార్గెట్ చేస్తే.. ఆయన సరైన సమయంలో అప్డేట్ వస్తుందని ఊరుకున్నారు. కానీ తర్వాత చప్పుడు లేదు. దీంతో ఇప్పుడు పీఆర్వోను టార్గెట్ చేశారు. అతడి పేరు తెలుసుకుని నెగెటివ్ ట్రెండ్ మొదలుపెడితే అజిత్ అభిమానులందరూ దిగిపోయారు. తమ ఆగ్రహాన్నంతా చూపిస్తూ పీఆర్వో మీద మీమ్స్, జోకులు పేలుస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ఇంతకుమించి వారిని వెయిట్ చేయిస్తే చాలా కష్టం కాబట్టి ‘వాలిమై’ ఫస్ట్ లుక్ అతి త్వరలోనే చిత్ర బృందం రిలీజ్ చేయక తప్పదేమో.
పెద్ద సినిమా విడుదలవుతున్న ప్రతిసారి తెలంగాణలో టికెట్ రేట్ల పెంపు అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రతిసారి ప్రభుత్వాన్ని అడగలేక,…
మాములుగా దర్శక నిర్మాతలు తమ సినిమాకు ఎంత ఖర్చు పెట్టినా బడ్జెట్ ని బాహాటంగా బయటికి చెప్పుకోరు. దానికి కారణాలు…
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాటల్లో రాజీపడరు.. చేతల్లో ఆలస్యం చేయరు. ఇదేదో మనం చెప్పే మాట కాదు..…
తన కొత్త సినిమా పెద్ది ప్రమోషన్లలో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎక్కడికి వెళ్లినా… ఆయన వెంట…
ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ కు ఒక ఎక్స్ పైరీ డేట్ ఉంటుందనేది ఎప్పటినుంచో వినిపించే మాటే. పాతికేళ్ల నుంచి ముప్పై…
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…